Visakhapatnam

News November 30, 2025

విశాఖ: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్’

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నవంబర్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 30, 2025

విశాఖ: బీచ్ రోడ్డులో వైసీపీ కోటి సంతకాల సేకరణ

image

ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం తగదని మాజీ మంత్రి బాలరాజు అన్నారు. బీచ్ రోడ్డులో వైసీపీ నిర్వహించిన కోటీ సంతకాల సేకరణలో ఆయన పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. సంతకాల సేకరణ పూర్తి చేసి గవర్నర్‌కు అందజేస్తామని విశాఖ జిల్లా అధ్యక్షుడు కే.కే.రాజు, ముఖ్య నాయకులు తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందని వారు పేర్కొన్నారు.

News November 30, 2025

వీఎంఆర్డీఏ పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు

image

వీఎంఆర్డీఏకు చెందిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు ప్రవేశపెడుతున్నామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యాలయంలో శనివారం బోర్డు సమావేశం జరిగింది. పర్యాటకుల సౌకర్యం కోసం ఈ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రహదారులు, 2040 మాస్టర్ ప్లాన్, కైలాసగిరిపై అభివృద్ధి ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించామన్నారు.

News November 29, 2025

విశాఖలో 209 మంది పోలీసులకు రివార్డులు

image

విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 209 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.

News November 29, 2025

వీఎంఆర్డీఏ పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు

image

వీఎంఆర్డీఏకు చెందిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు ప్రవేశపెడుతున్నామని చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యాలయంలో శనివారం బోర్డు సమావేశం జరిగింది. పర్యాటకుల సౌకర్యం కోసం ఈ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రహదారులు, 2040 మాస్టర్ ప్లాన్, కైలాసగిరిపై అభివృద్ధి ప్రాజెక్టులు గురించి సమావేశంలో చర్చించామని తెలిపారు.

News November 29, 2025

మాతృమరణాలు సంభవించకుండా చూడాలి: కలెక్టర్

image

విశాఖ కలెక్టరేట్ లో శనివారం కలెక్టర్ హరీంధిర ప్రసాద్ మాతృ మరణాలపై సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో కణితి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, నక్కవానిపాలెం పట్టణ ఆరోగ్యకేంద్రం పరిదిలో ఒక్కొక్క మాతృ మరణం జరిగిందని DMHO జగదీశ్వర రావు వివరించారు. మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూడాలని, హైరిస్క్ గర్భిణీలు ప్రసవానికి వచ్చినప్పుడు KGHకు గాని VGHకు గాని రిఫర్ చేయాలని కలెక్టర్ సూచించారు.

News November 29, 2025

డ్రగ్ ఫ్రీ విశాఖ నినాదంతో ‘వైజాగ్ మారథాన్’

image

విశాఖ బీచ్ రోడ్డు వేదికగా ఆదివారం 4వ ఎడిషన్ ‘వైజాగ్ మారథాన్’ జరగనుంది. ‘డ్రగ్ ఫ్రీ విశాఖ’ నినాదంతో వైజాగ్ రన్నర్స్ ఆధ్వర్యంలో ఎంజీఎం గ్రౌండ్స్ వద్ద ఉదయం 4 గంటలకు పరుగు ప్రారంభం కానుంది. ఈసారి గిరి ప్రదక్షిణ స్ఫూర్తితో ప్రత్యేకంగా 32 కిలోమీటర్ల పరుగును చేర్చడం ప్రధాన ఆకర్షణ. వీటితో పాటు 5కే, 10కే, 21కే విభాగాల్లో సుమారు 8 వేల మంది రన్నర్లు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

News November 29, 2025

పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

image

పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ మీటింగు హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆటోనగర్, మధురవాడ ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల్లో పని చేసే కార్మికుల సౌకర్యార్థం బస్టాప్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News November 29, 2025

విశాఖ: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమిలి మండలం దిబ్బడిపాలేనికి చెందిన చిన్మయ ఆనంద్‌ శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిచూసి CPR చేసి వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హెడ్ కానిస్టేబుల్ అమర్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News November 29, 2025

విశాఖ: ‘ఉచిత శిక్షణ.. డిసెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోండి’

image

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు డిసెంబరు 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు సర్దార్ గౌతులచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.రాజేశ్వరి తెలిపారు. ప్రవేశ పరీక్ష కూడా డిసెంబరు 7కి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. విశాఖ జిల్లాకు చెందిన, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల నేరుగా ఎంవీపీ కాలనీ 6వ సెక్టార్లోని కార్యాలయంలో తమ దరఖాస్తులు అందజేయాలన్నారు.