India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
VMRDA కమిషనర్ కే.ఎస్.విశ్వనాథన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్గా ఆయనను నియమించారు. VMRDA కమిషనర్గా విశ్వనాథన్ పలు సంస్కరణలను చేపట్టారు. VMRDA పరిధిలో ఉన్న టూరిజం, కళ్యాణమండపాలను అభివృద్ధి దిశగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించారు.
ఎల్ఆర్ఎస్ పథకం కింద అనధికార లేఔట్లలోని స్థలాల క్రమబద్ధీకరణ కోసం VMRDA కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈనెలాఖరులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల గడువు ముగుస్తుంది. వీఎంఆర్డీఏకు ఇప్పటివరకు 585 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్కి దరఖాస్తు చేసుకునే విధానంపై హెల్ప్ డెస్క్లో అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టు, రైల్వే లైన్ల విస్తరణ, ఇతర పనుల భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో అధికారులతో సమావేశమయ్యారు.అభివృద్ధి ప్రాజెక్టుల పనులను క్షేత్రస్థాయి పర్యటనలు చేసి చర్యలు చేపట్టాలన్నారు. నిర్ణీత కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలన్నారు.
పీపీపీ విధానంపై జగన్మోహన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. తన హయాంలోనే జీవోలు 107, 108, 133 ఇచ్చి 50% సీట్లను ప్రైవేటు కోటాకు కేటాయించిన జగన్, ఇప్పుడు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కేవలం 18% పనులు చేసిన జగన్ సర్కార్ అసమర్థత వల్లే 1,750 సీట్లు రద్దయ్యే దశకు వచ్చాయని, తమ పీపీపీ విధానంతో ఆ సీట్లను కాపాడామని స్పష్టం చేశారు.
సెట్విన్, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 16న మద్దిలపాలెం వి.ఎస్.కృష్ణ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నారు. 15-29 ఏళ్ల యువతీ, యువకులు జానపద నృత్యం, గీతాలు, పెయింటింగ్ వంటి పలు అంశాల్లో పోటీపడవచ్చు. జిల్లా విజేతలు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారు. ఆసక్తి గలవారు అక్టోబర్ 14న సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని సెట్విన్ సీఈవో కవిత కోరారు.
విశాఖలో హోమ్ స్టే, బెడ్ & బ్రేక్ఫాస్ట్ విధానాలపై అక్టోబర్ 10న ఉదయం 10 గంటలకు VMRDA చిల్డ్రన్ ఎరీనాలో పర్యాటక శాఖ అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. సొంత ఇళ్లలో కొంత భాగాన్ని పర్యాటకులకు వసతిగా కల్పించి, ఆదాయం పొందాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశమని జిల్లా పర్యాటక అధికారి తెలిపారు. ఆసక్తిగల పౌరులు హాజరై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.
కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం బాలికల సంఖ్య 46కి తగ్గింది. మొత్తం 64 మంది ఆస్పత్రిలో చేరగా.. వీరిలో మంగళవారం 8 మందిని డిశ్చార్జ్ చేసి పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. బుధవారం మరో 10 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. ప్రస్తుతం 46 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె వెల్లడించారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో బుధవారం వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారి ‘అమ్రిత్ సంవాద్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం పవన్ కుమార్ ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సూచనలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రయాణికులు ఎస్కలేటర్ వద్ద వృద్ధుల కోసం కేర్ టేకర్, రైలులో మగ, ఆడవాళ్లకి వేర్వేరుగా బాత్రూం ఏర్పాటు చేయాలని సూచించారు.
మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటనలో మార్పులు జరిగాయని, ఆయన కేజీహెచ్లో కురుపాం విద్యార్థులను పరామర్శిస్తారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు అనుమతులపై డ్రామా సృష్టిస్తూన్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి ఫ్లెక్సీలు తొలగిస్తూ, ఆంక్షలతో పర్యటనను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటన అల్లర్లు సృష్టించడానికేనని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ విమర్శించారు. మెడికల్ కాలేజీలను మధ్యలోనే వదిలేసి, నిధులను పార్టీ ఆఫీసులకు మళ్లించారని ఆయన ఆరోపించారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టడంపై ఉన్న శ్రద్ధ కాలేజీలపై లేదన్నారు. డాక్టర్ సుధాకర్ మృతికి, బీసీ నేతల వేధింపులకు కారణమైన జగన్కు ఉత్తరాంధ్రలో పర్యటించే అర్హత లేదని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.