Visakhapatnam

News July 25, 2024

నేడు వాటర్ మెన్ ఆఫ్ ఇండియా విశాఖలో పర్యటన

image

వాటర్ మెన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ నేడు ఎర్ర మట్టి దిబ్బలు, మడసర్లోవ, చిల్లపేట చెరువు, లాసన్స్ బే వద్ద సముద్రంలో కలుస్తున్న మురుగునీటి పరిశీలనకు వస్తున్నారు. ఉదయం 10 గంటలకు ముడసర్లోవ డంప్ యార్డ్, 11 గంటలకు చిల్లపేట చెరువు (భీమిలి), మధ్యాహ్నం 12.30 గంటలకు ఎర్ర మట్టి దిబ్బలు, మధ్యాహ్నం 2 గంటలకు లాసన్స్ బే బీచ్ పాయింట్ పరిశీలిస్తారు.

News July 25, 2024

అనకాపల్లి: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

image

అనకాపల్లిలో ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం తనిఖీ చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ఇతర పరిస్థితుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భద్రతా పరమైన చర్యలపై ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం లాక్ బుక్కులో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ వై. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News July 24, 2024

అల్లూరి జిల్లాలో రేపు అన్ని పాఠశాలలకు సెలవు

image

జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టనందున, ఈనెల 25వ తేదీన కూడా అన్ని యాజమాన్య పాఠశాలలకు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు సెలవు అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులను తల్లిదండ్రులు బయటకు పంపించకూడదని, ప్రజలు గెడ్డలు, వాగులు దాటి ప్రయాణించకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

News July 24, 2024

మద్యం పాలసీపై విశాఖ MLA వ్యాఖ్యలు

image

బుధవారం జరిగిన ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. మన రాష్ట్రంలో ఇది చాలా పెద్ద స్కాం అని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం లిక్కర్‌ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందని తెలిపారు. తయారీ కంపెనీలు అన్నీంటినీ వైఎస్.జగన్ బినామీలే నడిపారన్నారు. దీనిపై సీబీ సీఐడీ, సీబీఐలతో విచారణ చేయించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

News July 24, 2024

విశాఖ: ‘ఆల్ ది బెస్ట్ జ్యోతి’

image

విశాఖ నగరానికి చెందిన ఎర్రాజీ జ్యోతి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పారిస్‌లో రేపటి నుంచి జరిగే ఒలింపిక్ క్రీడల్లో ఆమె పాల్గొననుంది. 100 మీటర్ల హార్డిల్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఒలింపిక్స్‌కు విశాఖ అమ్మాయి అర్హత సాధించడం పట్ల పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

News July 24, 2024

MLAకు అయ్యన్న సూచన.. నవ్విన పవన్ కళ్యాణ్

image

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ అయ్యన్న నవ్వులు పూయించారు. రోడ్ల సమస్యపై ప్రశ్నించేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌కు స్పీకర్ అయ్యన్న అవకాశం ఇచ్చారు. ఆయన పార్టీ పెద్దలకు, మంత్రులకు, నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెపుతుండగా.. స్పీకర్ అయ్యన్న కలగజేసుకొని రోడ్ల గురించి మాట్లాడాలని సూచించారు. దీంతో ముందు వరుసులో కూర్చున్న పవన్ కళ్యాణ్‌తోపాటు సభ్యులు ఒక్కసారిగా నవ్వారు.

News July 24, 2024

విశాఖను కాలుష్యం నుంచి కాపాడతా: పవన్ కళ్యాణ్

image

విశాఖలో పలు కంపెనీలు నిబంధనలు పాటించకపోవడంతో పర్యావరణం దెబ్బతింటుందని స్థానిక MLAలు అసెంబ్లీ సమావేశంలో ప్రశ్న లేవనెత్తారు. మంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాక స్పీకర్ అయ్యన్న కలగజేసుకుని సభ్యులు చెప్పింది నిజమేనని విశాఖలో ఒకసారి పర్యటించాలని పవన్‌కు సూచించారు. కాలుష్యం నుంచి విశాఖను కాపాడాలని తపనపడే వ్యక్తులలో తానూ ఒకడినని.. సంబంధిత అధికారులతో చర్చించి విశాఖను కాలుష్యం నుంచి కాపాడతానన్నారు.

News July 24, 2024

విశాఖ: డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఏయూ పరిధిలోని డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. హానర్స్ మొదటి సెమిస్టర్ ఫలితాలతో పాటు రెగ్యులర్ కోర్సులకు సంబంధించి ఫస్ట్, సెకెండ్, ఫోర్త్ రీవాల్యుయేషన్ ఫలితాలను వెబ్ సైట్‌లో ఉంచామన్నారు. విద్యార్థులు తమ రిజిస్టర్ నంబర్‌ను ఏయూ వెబ్‌సైటులో నమోదు చేసి మార్కులను నేరుగా పొందవచ్చని వెల్లడించారు.

News July 24, 2024

కేజీహెచ్ ఓపీ వద్ద అవస్థలు పడుతున్న రోగులు

image

కేజీహెచ్ ఓపి వద్ద రోగులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి వచ్చే రోగులు వద్ద స్మార్ట్ ఫోన్ లేక ఒకవేళ ఉన్నా యాప్ డౌన్లోడ్ చేయలేక గంటలు తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిరీక్షించి ఓపీ తీసుకున్న రోగులు వార్డులకు వెళితే అక్కడ డాక్టర్లు ఉండడం లేదని.. కేవలం పీజీ విద్యార్థులతో వైద్య సేవలు అందిస్తున్నట్లు రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News July 24, 2024

భవిష్యత్తులో వారిని రెగ్యులర్ చేసే అవకాశం: మంత్రి సత్య

image

ANM నుంచి GNMగా ట్రైనింగ్ తీసుకుంటూ కేజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ స్టాఫ్‌ను భవిష్యత్తులో రెగ్యులర్ చేసే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేజీహెచ్‌లో 59 మంది డాక్టర్లు, 79 నర్సింగ్, 99 పారామెడికల్ స్టాఫ్ కొరత ఉందన్నారు. త్వరలో ఖాలీలు భర్తీ చేస్తామన్నారు. విశాఖ నార్త్ MLA విష్ణుకుమార్ రాజు కేజీహెచ్‌లో సిబ్బంది కొరతపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.