India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను విశాఖ ఎంపీ శ్రీ భరత్ మంగళవారం పార్లమెంట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ రైల్వే జోన్ కోసం చర్చించారు. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విజయవాడ వంటి అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో రైళ్ల కొరత ఉందని తెలియజేస్తూ, ఆయా మార్గాల్లో కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని కోరారు. విశాఖ మీదుగా ప్రయాణించే రైళ్లకు అత్యవసర కోటాను పెంచాలన్నారు.

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చిని, జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్ను సింహాచలం ఈవో వెంకటరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రానున్న చందనోత్సవ వేడుకలపై వీరు చర్చించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈవోకు జీవీఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్ సూచించారు.

జీవీఎంసీ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 28న నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. అజెండా సిద్ధం చేసి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం వచ్చేనెల 17తో ముగియనుండటంతో, ఈ సమావేశమే చివరిదిగా నిలవనుంది. ప్రతి సభ్యుడు మాట్లాడేలా వరుసగా రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో అజెండాలో భారీగా అంశాలు చేర్చే అవకాశముందని అధికారులు తెలిపారు.

విశాఖ జిల్లా తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో జరిగిన సమీక్షలో జిల్లాల పనితీరును పరిశీలించారు. 2025-26లో విశాఖ స్థూల ఉత్పత్తి రూ.1.60 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ.6.58 లక్షలుగా నమోదైంది. గాజువాక నియోజకవర్గానికి ఏ+ గ్రేడ్ లభించింది. విశాఖలో రిజిస్ట్రేషన్ కేంద్రం, ఎమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటుపై సూచనలు చేశారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా మరో కీలక అడుగు పడింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణతో పాటు కోల్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేటుకు అప్పగించేందుకు ఆర్ఐఎన్ఎల్ టెండర్లు ఆహ్వానించింది. క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను రెండేళ్లకు రూ.83.52 కోట్లతో నిర్వహించనుంది. అధిక విద్యుత్ వ్యయంతో ఈపీడీసీఎల్పై ఆధారపడుతున్న ప్లాంట్ నెలకు రూ.80-90 కోట్లు చెల్లిస్తోంది. దీనిపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

విశాఖలో నైపుణ్యాభివృద్ధి సంస్థ (SDI), నిరుద్యోగ యువతకు వెల్డింగ్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, డేటా ఎంట్రీ వంటి విభాగాల్లో ఉచిత శిక్షణ అందిస్తోంది. SSC నుంచి B.Tech వరకు అర్హత ఉండి 18-28 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఉచిత భోజన, వసతితో శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 11 నుంచి 20 లోపు ద్వారకానగర్లోని SDI కేంద్రంలో లేదా 79893 13189 నంబర్ను సంప్రదించాలన్నారు.

ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి నెల రోజుల పాటు ఉచిత యోగా థెరపీ శిబిరాలు నిర్వహించనున్నారు. మధుమేహం, నిద్రలేమి, కీళ్లనొప్పులు, సయాటికా వంటి సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. బీచ్ రోడ్డులోని యోగా విభాగంలో రోజూ ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. ఆసక్తి గల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్వోడీ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.

ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి నెల రోజుల పాటు ఉచిత యోగా థెరపీ శిబిరాలు నిర్వహించనున్నారు. మధుమేహం, నిద్రలేమి, కీళ్లనొప్పులు, సయాటికా వంటి సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. బీచ్ రోడ్డులోని యోగా విభాగంలో రోజూ ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. ఆసక్తి గల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్వోడీ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.

ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి నెల రోజుల పాటు ఉచిత యోగా థెరపీ శిబిరాలు నిర్వహించనున్నారు. మధుమేహం, నిద్రలేమి, కీళ్లనొప్పులు, సయాటికా వంటి సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. బీచ్ రోడ్డులోని యోగా విభాగంలో రోజూ ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. ఆసక్తి గల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్వోడీ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.

ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి నెల రోజుల పాటు ఉచిత యోగా థెరపీ శిబిరాలు నిర్వహించనున్నారు. మధుమేహం, నిద్రలేమి, కీళ్లనొప్పులు, సయాటికా వంటి సమస్యలకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. బీచ్ రోడ్డులోని యోగా విభాగంలో రోజూ ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. ఆసక్తి గల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్వోడీ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.
Sorry, no posts matched your criteria.