India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వింటర్ స్టడీ టూర్లో భాగంగా 2025 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ట్రైనీ అధికారుల బృందం సోమవారం విశాఖ పోర్ట్ అథారిటీను సందర్శించింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన నిర్వహించారు. పోర్ట్ సామర్థ్యాలు, పూర్తి యాంత్రీకరణ దిశగా తీసుకుంటున్న చర్యలు, ఆధునీకరణపై వివరణ ఇచ్చారు. 10 మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్, పరిశ్రమల వినియోగానికి నీటిని మళ్లీ ఉపయోగించే మలిన జల వినియోగంపై వివరించారు.

కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన PGRSలో భాగంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడారు. 25 శాతం కంటే ఎక్కువ పెండింగ్ ఉన్న అధికారులకు మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజా వినతుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తున్న టీపీవో-6కి ఛార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ పనితీరును నెల రోజులు సూక్ష్మంగా పరిశీలిస్తానని, తీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

విశాఖ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయని, రెవెన్యూ అధికారులతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు.

విశాఖ కేజీహెచ్ అనుబంధ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న సమాచారం మేరకు కౌన్సిల్ డైరెక్టర్ సునీత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థినులు కాపీ కొడుతూ పట్టుబడి డిబార్ అయినట్లు అధికారులు తెలిపారు.

విశాఖకి వచ్చే వేసవిలో నీటి కొరత ఉండదని GVMC అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నగరానికి తాగునీరు అందించే ఏలేరు, రైవాడ, మేఘాద్రి గెడ్డ, తాటిపూడి, గోస్తనీ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలతో కనీసం 6 నెలల పాటు నిరంతర నీటి సరఫరా చేయగలమన్నారు. వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంపై పర్యవేక్షణ కొనసాగుతోందని GVMC నీటి సరఫరా అధికారి పల్లంరాజు స్పష్టం చేశారు.

విశాఖ జిల్లాలో YCP మాజీ నేతల రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మళ్లీ ‘ఫ్యాన్’ నీడకే చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీఎంపీ MVV.సత్యనారాయణ యాక్టివ్ కానున్నట్లు సమాచారం. గౌరవం, గుర్తింపు దక్కే చోటకే వెళ్లాలని వీరు భావిస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ నేతల పునరాగమనం జిల్లా రాజకీయాల్లో కీలకం కానుంది.

విశాఖలో చికెన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.137, విత్ స్కిన్ కేజీ రూ.244, స్కిన్ లెస్ కేజీ రూ.254 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా శోంఠాం కోడి కేజీ రూ.300 పలకగా.. డజన్ గుడ్లు రూ.65కి అమ్ముతున్నారు. మటన్ కేజీ రూ.1000 కాగా.. చేపలు అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎంవీపీ కాలనీ, అప్పుఘర్, ఫిషింగ్ హర్బర్ సముద్రపు చేపల అమ్మకాలతో సందడిగా ఉన్నాయి.

విశాఖ వీధులకు సరికొత్త అందాన్ని తెచ్చేలా నెల్లూరు తరహాలో జీవీఎంసీ ‘స్మార్ట్ వెండింగ్ జోన్ల’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సెంట్రల్ పార్క్, ఎండాడ, దువ్వాడలలో అత్యాధునిక మాడ్యులర్ కియోస్కులను నిర్మించనున్నారు. వీటికి సోలార్ పవర్, డిజిటల్ పేమెంట్స్, సీసీటీవీ నిఘా వంటి సౌకర్యాలు ఉంటాయి. వీధి వ్యాపారులకు శాశ్వత చిరునామాను కల్పిస్తూ, ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా తీర్చి దిద్దడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 8688400499 నంబరు ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా సీఎండీకి తెలపవచ్చు. విశాఖ సహా 11 జిల్లాల ప్రజలు కొత్త సర్వీసులు, సరఫరా అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 8688400499 నంబరు ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా సీఎండీకి తెలపవచ్చు. విశాఖ సహా 11 జిల్లాల ప్రజలు కొత్త సర్వీసులు, సరఫరా అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.