Visakhapatnam

News July 24, 2024

విశాఖ: డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

image

విశాఖలోని వి.ఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఐ.విజయబాబు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 25 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు.

News July 24, 2024

విశాఖ పోర్ట్ ట్రస్ట్‌కు రూ.150 కోట్లు

image

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌కు గత బడ్జెట్‌లో రూ. 276కోట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించగా.. ప్రస్తుతం రూ.150కోట్లు కేటాయించారు. సాగరమాల ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో రూ.700కోట్లు కేటాయించారు. ఇప్పటికే విశాఖ హార్బర్ ఆధునికీకరణ, రోడ్ల విస్తరణ సాగరమాల ప్రాజెక్టు కింద జరుగుతున్నాయి. దీనితో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.

News July 24, 2024

విశాఖ: ఇగ్నోలో ప్రవేశాలకు ఈనెల 31 వరకు గడువు

image

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో ప్రవేశాలకు జూలై 31వ తేదీ వరకు గడువు ఉన్నట్లు విశాఖ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ ధర్మారావు తెలిపారు. కేంద్రం పరిధిలో 11 జిల్లాల్లోని విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో డిగ్రీ, పీజీ, డిప్లమో సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 24, 2024

విశాఖ: నవోదయలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

కొమ్మాదిలోని జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. సెప్టెంబర్ 16వ తేదీలోగా www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. 2003 మే 1 నుంచి 2017 జులై 31 మధ్య జన్మించిన వారు అర్హులు. 2025 జనవరి 18న ఉదయం 11:30 నుంచి 1:30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. 75 శాతం గ్రామీణ విద్యార్థులకు, 25 శాతం పట్టణ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. > Share it

News July 24, 2024

విశాఖలో యువతిపై అర్ధరాత్రి దాడి..?

image

కొమ్మాది ప్రాంతంలో బేకరీలో పనిచేస్తున్న యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. సోమవారం విధులు ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో వసతిగృహానికి వెళ్తున్న ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయాలతో హాస్టల్‌కి వెళ్లిన ఆమెను స్నేహితులు ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. కమిషనర్ శంఖబ్రత బాగ్చి దృష్టి సారించి విచారణను ఆదేశించినట్లు తెలుస్తోంది.

News July 24, 2024

మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా ధరల తగ్గింపు

image

టమోటా ధరను సామాన్యులకు అందుబాటులో ఉండేటట్లు చేస్తామని విశాఖ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి షేక్. యాసిన్ తెలిపారు. టమాటా ధరను కట్టడి చేసేందుకు మార్కెటింగ్ శాఖ చిత్తూరు జిల్లా నుంచి వీటిని కొనుగోలు చేసి విశాఖ వినియోగదారులకు బయట మార్కెట్ ధర కన్న తక్కువకు ధరలకు అందజేయాలని ప్రణాళికలు వేస్తోంది. దీనికి అనుగుణంగా 24న బుధవారం విశాఖ జిల్లాలో గల అన్ని రైతు బజార్‌లోకి కేజీ రూ.54 గా విక్రయాలు జరపనున్నారు.

News July 23, 2024

జిల్లాలో రేపు అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు

image

అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు 24వ తేదీ బుధవారం పాఠశాలలకు, కళాశాలలకు సెలవు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చింతూరు డివిజన్ కూనవరం, వి ఆర్ పురం ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాల్లో తగు జాగ్రత్తలతో ఉండాలని సూచించారు. విద్యార్థులు బయటకు వెళ్లరాదని హెచ్చరించారు.

News July 23, 2024

విశాఖ: ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం

image

పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్మైలెక్స్ లాబరేటరీస్ పరిశ్రమలో వాక్యూమ్ పంపులు మీదపడి కబీ అనే ఒప్పంద కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఫార్మా కంపెనీలో తరచూ జరుగుతున్న ప్రమాదాల పట్ల కార్మికులు భయాందోళనలు చెందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

News July 23, 2024

విసన్నపేట లేఅవుట్ పై ఫిర్యాదు

image

కసింకోట మండలం విసన్నపేటలో 609 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా వేసిన అక్రమ లేఅవుట్‌ పై కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ VMRDA కమిషనర్ విశ్వనాథన్‌కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా గెడ్డలు, సీలింగ్ భూములు, దళితుల అసైన్డ్ భూములు, డి.పట్టాలను కలుపుకొని అక్రమ లేఅవుట్ వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 23, 2024

డిగ్రీ ప్రత్యేక విభాగాల విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

image

డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన స్పెషల్ కేటగిరి విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన డాక్టర్ వి.ఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రారంభమైంది. దృవపత్రాల పరిశీలన 23, 24, 25 తేదీలలో జరుగుతుందని, ప్రవేశాల కోఆర్డినేటర్ డి.రమేశ్ తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తామన్నారు.