India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ నగర మొదటి మేయర్ NSN రెడ్డి 95వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి శనివారం పూలమాలలు వేశారు. బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు పాల్గొని ఎన్.ఎస్.ఎన్.రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషిచేసిన ప్రజా నాయకుడు ఎన్.ఎస్.ఎన్.రెడ్డి అని కొనియాడారు.
విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకోజిపాలెం మెయిన్ రోడ్లో పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ను లారీ ఢీకొట్టింది. బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. బైక్ నంబర్ AP40CS0114 ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడి కత్తు కేసు విచారణ జరిగింది. జగన్పై హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కోర్టుకు వచ్చారు. వాదనల అనంతరం మార్చి 21కి ఈ కేసు పడింది. ప్రధాన సాక్షి అయిన జగన్ కోర్టుకు రాకుండా కాలయాపన చేయడం తగదని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. జగన్ తీరుతోనే కేసు విచారణ ఆలస్యం అవుతోందని ఆరోపించారు. పరామర్శలకు వెళ్లే జగన్కు.. కోర్టుకు వచ్చే సమయం దొరకలేదా అని ప్రశ్నించారు.
విశాఖ స్టీలుప్లాంట్ పోలీస్ స్టేషన్లో ఈనెల 25న బైకుల బహిరంగ వేలం వేయనున్నట్లు సీఐ కేశవరావు తెలిపారు. పలు రకాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న 25 బైకులను వేలం వేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలని సీఐ కోరారు. మరిన్ని వివరాలకు తమ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.
విశాఖలో ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో శుక్రవారం PM-MKSSY పథకంపై మత్స్యకారులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. మత్స్య అనుబంధ పరిశ్రమలలో పనిచేస్తున్నవారు NFDP క్రింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జోనల్ డైరెక్టర్ భామిరెడ్డి తెలిపారు. ఇందులో భాగాంగా కొంతమంది మత్స్యకారులకు NFDP, e-SHARM రిజిస్ట్రేషన్ కార్డులు అందజేశారు.
విశాఖలో జరిగిన భూకుంభకోణాలపై విచారణ నివేదికలను బహిర్గతం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బొత్స సత్యనారాయణ అన్నారు. బురదజల్లడం కాదు, ఆరోపణలు నిరూపించాలన్నారు. అటు జెడ్ కేటగిరీలో వున్న జగన్ భద్రత ఎందుకు కుదిరించారు అని గవర్నర్ ఆశ్చర్య పోయారన్నారు. జగన్ మిర్చి యార్డ్ కు వెళ్ళిన తర్వాత మిర్చి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి తెలిసిందన్నారు.
చండీగఢ్లో నిర్వహిస్తున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన వేదవ్యాస్ కాంస్య పతకం సాధించాడు. శుక్రవారం నిర్వహించిన 1000 మీటర్ల పరుగు పోటీలో 34 నిమిషాల 55 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్య పతకం సాధించాడు. వేదవ్యాస్ వరుసగా రెండు పతకాలు సాధించడంతో పొట్నూరు ప్రజలు అభినందించారు. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆ గ్రామ ప్రజలు కోరుకున్నారు.
విశాఖ ఆర్డీఓ శ్రీలేఖపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని అనకాపల్లి జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు పెంటకోట జోగినాయుడు, కార్యదర్శి కె.చంద్ర రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నేతలంతా కలెక్టర్ విజయకృష్ణణ్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదిచ్చారు. సంఘం రాష్ట్ర నాయకులు స్వామి, కిషోర్, మద్దాల రాంబాబు, ఆళ్ల వెంకట అప్పారావు, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మళ్ల భాస్కరరావు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో చిన్న, మధ్యతరహా పత్రికల యాజమాన్యాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్కు శుక్రవారం వినతి అందజేశారు. ఎంప్యానెల్మెంట్ ప్రక్రియను సరళీకృతం చెయ్యాలని కోరారు. అర్హత కలిగిన వారందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్ట్లకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని వారు లేఖలో పేర్కొన్నారు.
గ్రామీణ మండలం చినగదిలిలో ఉన్న ఈవీఎం గోదామ్లను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం గోదాములను సందర్శించిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అక్కడ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Sorry, no posts matched your criteria.