Visakhapatnam

News July 23, 2024

ఈనెల 27న విశాఖ జడ్పీ సర్వసభ్య సమావేశం

image

ఈ నెల 27న జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం.పోలినాయుడు మంగళవారం తెలిపారు. ఆరోజు ఉదయం 10.30గంటలకు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలకు సంబంధించిన పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు.

News July 23, 2024

విశాఖలో 781 కి.మీ. యూజీడీ పూర్తి: మంత్రి

image

విశాఖలో 781 కి.మీ మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పనులు పూర్తయ్యాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పెందుర్తిలో రూ.412 కోట్లతో 226 కి.మీ మేర 80%, గాజువాక, మల్కాపురంలో రూ.530 కోట్లుతో 429 కి.మీ.లో 50% పనులు పూర్తయ్యాయన్నారు. మధురవాడ, యండాడ, కొమ్మాదిలో 413కి.మీ ప్రపోజల్‌తోపాటు అనకాపల్లి, భీమిలిలో 311 కి.మీ DPR ప్రిపేర్ చేస్తున్నామన్నారు. మొత్తం 2,160 కి.మీ. మేర యూజీడీ నిర్మాణం జరుగుతుందన్నారు.

News July 23, 2024

కేంద్ర బడ్జెట్‌పై విశాఖకు గంపెడాశలు!

image

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. ఈసారైనా విశాఖ కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు పూర్తిస్థాయిలో నిధులు అందిస్తారా? అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. విశాఖ మీదుగా ఫ్లై ఓవర్ల నిర్మాణం, పోర్ట్ అభివృద్ధిని కోరుకుంటున్నారు.

News July 23, 2024

పారిస్ ఒలింపిక్స్‌కు విశాఖ కోచ్

image

విశాఖకు చెందిన బాక్సింగ్ కోచ్ ఐ.వెంకటేశ్వరరావు పారిస్ ఒలింపిక్స్‌లో టెక్నికల్ ఆఫిషియల్‌గా సేవలందించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అందుకున్నట్లు ఆయన తెలిపారు. టెక్నికల్ అఫీషియల్స్ న్యూఢిల్లీ నుంచి బుధవారం బయలుదేరనున్నామన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఆరుగురు కాంటింజెంట్ సభ్యులు ఇప్పటికే జర్మనీలో శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. కాగా.. వెంకటేశ్వరరావు ద్రోణాచార్య అవార్డు గ్రహీత.

News July 23, 2024

విశాఖలో కూతురిపై అత్యాచారం.. 20ఏళ్ల శిక్ష

image

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. అత్యాచారం చేసిన చోడిపల్లి మురళీకృష్ణకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు పేర్కొంది. ముద్దాయికి శిక్షపడే విధంగా కృషి చేసిన పోలీస్ అధికారులను కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అభినందించారు.

News July 23, 2024

విశాఖ- కిరండూల్ రైలు దారి మళ్లింపు

image

భారీ వర్షాల కారణంగా కొత్తవలస- కిరండూల్ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. విశాఖ- కిరండూల్ (18514), కిరండూల్- విశాఖ(18513) రైలు విజయనగరం, రాయగడ, కొరాపుట్ మీదుగా దంతెవాడ చేరుకుంటుందన్నారు. తిరిగి అదే మార్గంలో విశాఖ వైపు వెళ్తుందని వాల్తేరు డివిజనల్ వాణిజ్య మేనేజర్ కె.సందీప్ వెల్లడించారు. విశాఖ- కిరండూల్ పాసింజర్ దంతెవాడ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తుందన్నారు.

News July 23, 2024

నేటి నుంచి ఎల్‌హెచ్‌బీ బోగీలతో గరీబ్ రథ్

image

ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 23 నుంచి విశాఖ- సికింద్రాబాద్(12739) గరీబ్ రథ్ రైలు ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడుస్తుందని వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. సోమవారం రాత్రి ఎల్‌హెచ్‌బీ బోగీలతో సికింద్రాబాద్ బయలు దేరిన ఈ రైలు మంగళవారం ఉదయం విశాఖ చేరుకుంటుందన్నారు. 18 థర్డ్ ఏసీ ఎకానమి బోగీలతో పాటు 2 జనరేటర్ బోగీలతో ఈ రైలు రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు.

News July 23, 2024

అల్లూరి జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు

image

అల్లూరి జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలలకు, కళాశాలలకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాలకు వాగులు, గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయని బయటికి రావద్దని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలు కూడా సెలవు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News July 23, 2024

విశాఖ: ‘యుద్ధప్రాతిపదికన విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ’

image

వరదల ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ పేర్కొన్నారు. సంస్థ పరిధిలోని 5 సర్కిల్‌లో 24 మండలాలకు 140 గ్రామాల్లో 47,999 సర్వీసు కనెక్షన్లకు విద్యుత్తు అంతరాయం ఏర్పడగా సకాలంలో సర్వీసులకు సరఫరా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక బృందాలతో సోమవారం పూర్తి స్థాయిలో పనులు జరిగేలా ఎస్ఈలు ఆదేశించినట్లు తెలిపారు.

News July 22, 2024

నష్టం వివరాలను అందజేయాలి: కలెక్టర్

image

అల్పపీడనం ప్రభావంతో విశాఖ జిల్లాలో 4 రోజులుగా కురిసిన వర్షాలకు జరిగిన నష్టం వివరాలను అందజేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. నష్టం నివేదికలను కలెక్టర్ కార్యాలయానికి సత్వరమే అందించాలని ఆదేశించారు. జేసీ మయూర్ అశోక్ అధికారులు పాల్గొన్నారు.