Visakhapatnam

News February 21, 2025

విశాఖ ప్రజలారా జాగ్రత్త..!

image

విశాఖ అంటేనే వలసలు గుర్తుకొస్తాయి. చదువు రాని వాడు చేపల వేటకు రాష్ట్రాలు దాటి వెళ్తున్నాడు. కాస్తోకూస్తో చదివినోడు దుబాయ్, ఇటలీ, మలేషియా అంటూ విమానం ఎక్కుతున్నాడు. వీళ్ల కష్టాలే కొందరికి వరంగా మారింది. విదేశాల్లో ఉద్యోగాలు తీసిస్తామంటూ రూ.లక్షలు దోచేస్తున్నారు. వీరిని నమ్మి పరాయి దేశానికి వెళ్తున్న విశాఖ బిడ్డలు కష్టాలు పడుతున్నారు. జిల్లాలో ఈమోసాలు ఇటీవల ఎక్కువైపోవడం ఆందోళన కలిగిస్తోంది.

News February 21, 2025

విశాఖ: క్రికెట్ బెట్టింగ్.. నిందితుల అరెస్ట్ 

image

క్రికెట్ బుక్కిల ఏరివేతలో భాగంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో విజయనగరానికి చెందిన ఇద్దరు నిందితులను విశాఖ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గాజువాకకు చెందిన బాధితుడు సమాచారం ఆధారంగా క్రికెట్ బెట్టింగ్ ఊబిలో అమాయకుల నుంచి నుంచి మాయమాటలు, ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు చేస్తున్న బుక్కీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి మరికొందరి బుక్కిల సమాచారం సేకరించారు.

News February 21, 2025

భీమిలి: భార్యను బలవంతం చేసినందుకే జ్యోతిషుడి హత్య

image

జ్యోతిషం పేరిట పూజలు చేస్తూ పెందుర్తి నివాసి అప్పన్న(50) జీవనం గడిపేవారు. అప్పన్న పూజ పేరిట గుడ్డాల మౌనికను బలవంతం చేశాడు. మౌనిక తన భర్త ఊళ్ల చిన్నారావుకు విషయం తెలిపింది. చిన్నారావు అప్పన్నను హత్య చేసేందుకు తన తల్లి ఆరోగ్యం కోసం పూజ చేయాలని రూ.7 వేలకు ఒప్పించి ఉప్పాడ తీసుకెళ్లి హత్య చేసి భార్య సహాయంతో పెట్రోల్ పోసి తగల బెట్టారు. వీరిని గురువారం భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 21, 2025

విశాఖ: వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్షా నిర్వహించారు. మాతృ, శిశు మరణాలు నమోదు కాకుండా చర్యలు చేప్పట్టాలన్నారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటివి రాకుంగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆసుపత్రుల పనితీరుపై సమీక్ష జరిపి తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. DMHO జగదీశ్వర రావు ఉన్నారు.

News February 20, 2025

విశాఖ టుడే టాఫ్ న్యూస్

image

☞ విశాఖ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు ☞గంజాయి తాగినా రౌడీషీట్: విశాఖ DIG ☞కనకమహాలక్ష్మి సేవలో విదేశీ యువతులు ☞విశాఖ: VRS చేస్తే రూ.50 లక్షలు..! ☞ రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ ధర్నా ☞విశాఖలో డివైడర్‌ను ఢీకొట్టిన కారు ☞విశాఖ: జనారణ్యంలోకి వచ్చిన దుప్పి ☞హైదరాబాద్‌లో విశాఖ యువకుడి మృతి ☞ఆనందపురం: ఆవు పొట్టలో 50 కేజీల ప్లాస్టిక్ ☞విశాఖలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు

News February 20, 2025

విశాఖ: త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై క‌ఠిన‌ చ‌ర్య‌లు

image

గ్రూప్-2 ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని క‌లెక్ట‌ర్ హరేంద్ర ప్రసాద్ హెచ్చ‌రించారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. మాస్ కాపీయింగ్ లేదా ఇత‌ర సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని పేర్కొంటూ ఎలాంటి ఆధారం లేకుండా త‌ప్పుడు వార్త‌ల‌ను, స‌మాచారాన్ని చేరవేసే వారిపై నిఘా ఉంటుంద‌న్నారు. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

News February 20, 2025

 విశాఖ: 16 కేంద్రాల్లో గ్రూప్-2 ప‌రీక్ష‌ నిర్వహణ

image

ఫిబ్రవరి 23న జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో గ్రూప్ -2 ప‌రీక్ష జ‌ర‌గ‌నుంద‌ని, పటిష్ఠ ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గురువారం ఉద‌యం క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో జిల్లా అధికారులు, ఏపీపీఎస్సీ అధికారులు, ప‌రీక్షా కేంద్రాల‌ నిర్వాహ‌కుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశమైన ఆయ‌న ప‌లు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు.

News February 20, 2025

హైదరాబాద్‌లో విశాఖ యువకుడి మృతి

image

విశాఖ నుంచి హైదరాబాద్ స్నేహితులతో బర్త్డే సెలబ్రేషన్‌కు వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విశాఖ విశాలాక్షి నగర్‌కు చెందిన ఓబ్బిలినేని సూర్య దేవ్(26) చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడానికి హైదరాబాద్ వచ్చాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చెరువు వద్ద పుట్టిన రోజు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తెల్లవారుజామున చెరువులో దిగి సూర్యదేవ్ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

News February 20, 2025

విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణపై కలెక్టర్ సమీక్షా

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై విశాఖ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్షా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏజెంట్‌లు, ఎన్నికల విధులు సన్నద్ధతపై ఉత్తరాంధ్ర జిల్లాల ఏఆర్వోలకు సూచనలు చేశారు. ఎన్నిక‌లకు సంబంధించిన‌ విధుల‌ నిర్వహ‌ణ‌లో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఆదేశించారు.

News February 20, 2025

విశాఖ: ఎర్నాకుళం రైలుకు అదనపు భోగీ ఏర్పాటు

image

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖ మీదుగా ప్రయాణించే హటియా-ఎర్నాకుళం(22837) రైలుకు అదనపు భోగి యాడ్ చేస్తామని వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైలుకు ఫిబ్రవరి 24న థర్డ్ ఏసీ ఎకానమీ క్లాస్ భోగి అదనంగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.