India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ స్టీల్ ప్లాంట్లో 1140 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయనున్నారు. నెల రోజుల క్రితం ప్లాంట్ యాజమాన్యం వీఆర్ఎస్కు ప్రకటన ఇచ్చింది. ఈక్రమంలో 1600 మందికిపైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరి అప్లికేషన్లు రిజెక్టయ్యాయి. 1,140 వీఆర్ఎస్కు ఆమోదం లభించింది. రిటైర్మెంట్ తీసుకునే ప్రతి ఉద్యోగికి అత్యధికంగా రూ.50 లక్షల వరకు నగదు అందుతుంది. ఈ మేరకు కేంద్రం నిధులు విడుదల చేసింది.
ఇటీవల విశాఖలో గంజాయి కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి కీలక ఆదేశాలు ఇచ్చారు. గంజాయి రవాణా చేస్తున్న వారితోపాటు గంజాయి తాగే వారిపైనా రౌడీషీట్లు ఓపెన్ చేయాలని ఉత్తరాంధ్ర ఎస్పీలను ఆయన ఆదేశించారు. అలాగే ఇతర కేసులపై ఎస్పీలతో డీఐజీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇతర నేరాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
విశాఖ నుంచి తిరుపతికి వీక్లీ స్పెషల్ (08583/84)ప్రత్యేక రైళ్లను వేయడం జరిగిందని వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 28 వరకు ప్రతి సోమవారం వీక్లీ ట్రైన్ ఉంటుందన్నారు. సోమవారం రాత్రి 7గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుతుందన్నారు. తిరిగి మరుసటి రోజు తిరుపతి నుంచి విశాఖ బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ విషయం గమనించాలన్నారు.
☞ పెందుర్తి నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ☞మధురవాడ: మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ☞కాపులుప్పాడ వద్ద అస్తిపంజరం కలకలం ☞ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ ☞విశాఖ: పెళ్లి జరిగిన రెండు వారాలకే పరార్ ☞మధురవాడలో ఉరేసుకుని మహిళ మృతి ☞నేటి నుంచే పూర్ణామార్కెట్ దుర్గాలమ్మ జాతర ☞దువ్వాడలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెండ్
ఎన్.టి.ఆర్. కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడకుండా పనులను వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఇసుక సరఫరా, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ బాధ్యత వహించాలని అన్నారు.
మధురవాడలో బుధవారం మరో సంచలనం చోటుచేసుకుంది. ఒడిశాలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి మధురవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా పోలీసులు టవర్ లొకేషన్ ఆధారంగా వారిని గుర్తించారు. వెంటనే పీఎంపాలెం పోలీసుల సహాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీఎంపాలెం పోలీసులు ఒడిశా పోలీసులకు వారిని అప్పగించారు.
కష్టకాలంలో నిలబడ్డవారికి సపోర్ట్ చేయాలని విశాఖ MP శ్రీభరత్ అన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆదేశానుసారం ప్రస్తుత MLC రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనసేన కూడా మద్దతు తెలిపిందని బీజేపీతో చర్చిస్తామని వెల్లడించారు. కాగా.. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల సమయంలో TDP బలపరిచిన వేపాడ చింరజీవి గెలుపులో రఘువర్మ కీలక పాత్ర పోషించారు.
నవ వధువు పారిపోయిన ఘటన ఏలూరులో వెలుగు చూసింది. బాధితుడి వివరాల మేరకు.. ఏలూరు గజ్జలవారి చెరువుకు చెందిన శివనాగ సాయికృష్ణ, విశాఖ కంచరపాలేనికి చెందిన బోడేపు చంద్రహాసినితో జనవరి 31న పెళ్లి జరిగింది. వారం క్రితం బిట్టుబారు సమీపంలో కాపురం ప్రారంభించారు. ఈనెల 16న రాత్రి భర్త నిద్రపోయాక భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. 4 కాసుల గోల్డ్ చైన్, ఉంగరం, వెండి పట్టీలతో ఆమె పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు నూతన ఉప కులపతులుగా నియమితులయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆంగ్ల విభాగ సీనియర్ ఆచార్యులు ఏ.ప్రసన్నశ్రీ రాజమండ్రిలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఏయూలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు కె.రాంజీ మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నియమింపబడ్డారు.
లాభదాయక సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకృతి సేద్యానికి, మిల్లెట్లు, బహుళ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాలల్లో ప్రతి ఇంటి వద్దా కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంపకం చేసేలా అవగాహన కల్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.