India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ ఐదో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊర్వసి జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని దెబ్బతిన్నాయి. అనకాపల్లికి చెందిన ఓ మహిళ కొత్త కారు డ్రైవ్ చేస్తూ వెళుతూ ఓ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొని నుజ్జునుజ్జు అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాకపోకలను పునరుద్ధరించారు.
విశాఖ ఐదో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊర్వసి జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని దెబ్బతిన్నాయి. అనకాపల్లికి చెందిన ఓ మహిళ కొత్త కారు డ్రైవ్ చేస్తూ వెళుతూ ఓ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొని నుజ్జునుజ్జు అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాకపోకలను పునరుద్ధరించారు.
ఏపీ సభాపతి అయన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నిర్వహణ, చేపట్టాల్సిన అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ గైర్హాజరైంది.
విశాఖలో 12 మంది కార్పొరేటర్లు కూటమికి మద్దతివ్వడంతో YCP బలం 50కి చేరింది. TDPలో గెలిచి YCPలో చేరిన కోటేశ్వరరావు, కాకి గోవిందరెడ్డి TDPలో చేరే అవకాశాలున్నాయి. అలా జరిగితే YCPకి 48, కూటమి బలం 47గా మారనుంది. మరో ఐదుగురిని కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో స్థాయీ సంఘం ఎన్నికల్లో గెలిచి.. ఆపై మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా కూటమి నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బిఆర్క్ సెకెండ్ ఇయర్ రెండో సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు ఒకటి నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సబ్జెక్టుల వారిగా పరీక్షా తేదీలను ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్ సైట్లో ఉంచినట్లు వెల్లడించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజనీరింగ్ బి.ఆర్క్, ఎంఎస్సీ అప్లైడ్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ రెండో సెమిస్టర్ పరీక్ష ఫీజును ఆగస్టు 6వ తేదీలోగా చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టి.చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.2 వేలు అపరాధరుసుంతో ఆగస్టు 7 నుంచి 13 వరకు ఫీజును స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 27 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆగస్టు 14 తర్వాత ఫీజులు స్వీకరించమన్నారు.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని అరకు, పాడేరు, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో గళం వినిపించనున్నారు. పాయకరావుపేట MLA అనిత హోం మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా, బండారు, కొణతాల వంటి మాజీ మంత్రులు.. KSN రాజు, పల్లా వంటి సీనియర్లు ఉన్నారు. మరి మీ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.
అనకాపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ విజయ్ కృష్ణన్ సోమవారం సెలవు ప్రకటించారు. విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు ఆదేశాలు పాటించాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎంఈవోలు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
పలువురు వైసీపీకి కార్పొరేటర్లు TDPలో చేరిన నేపథ్యంలో విశాఖ నగర మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2 నెలల్లో మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకునే విధంగా టీడీపీ, జనసేన పార్టీలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల పాటు మేయర్ను మార్చకూడదనే చట్టాన్ని గతంలో టీడీపీ ప్రభుత్వం చేసింది. దాన్ని రెండున్నర ఏళ్లకు కుదించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
వర్షాలు కారణంగా ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 140 గ్రామాల్లో 47,999 సర్వీస్ కనెక్షన్లకు విద్యుత్తు అంతరాయం ఏర్పడినట్లు సీఎండీ పృథ్వితేజ్ తెలిపారు. విశాఖలో మాట్లాడుతూ.. నేలకొరిగిన విద్యుత్తు స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, పడిపోయిన ట్రాన్స్ఫార్మర్లను యుద్ధ ప్రాతిపదికన సరి చేశామన్నారు. కంట్రోల్ రూమ్కు వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేసి తక్కువ సమయంలో విద్యుత్ను పునరుద్ధరించామన్నారు.
Sorry, no posts matched your criteria.