India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ జిల్లా DMHO పేడాడ జగదీశ్వర్రావు ఉత్తమ అవార్డును రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ అందించిన అవార్డుల్లో DMHO పేడాడ జగదీశ్వర్రావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది DMHOకు అభినందనలు తెలిపారు.

విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడులు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయనతో పాటు వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సందేశాన్ని అందించారు. వేడుకల్లో భాగంగా సిబ్బందికి స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.

విశాఖ ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఛైర్మన్ పృథ్వితేజ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థ పరిధిలో 73 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని తెలిపారు. 19,385 మంది వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు అమర్చామన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 97 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

విశాఖ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి అనగాని సత్య ప్రసాద్ జాతీయ జెండా ఎగురువేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, కమిషనర్ శంఖబ్రత బాగ్చి, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథ్ పాల్గొన్నారు. పోలీస్, రెవెన్యూ, జీవీఎంసీ విభాగాల్లో ప్రతిభ చూపించిన అధికారులు, ఉద్యోగులకు మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో జ్యోతి తెన్నేటి విశ్వనాథం కీలక పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి సత్యాగ్రహంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాసేవకు అంకితమయ్యారు. విశాఖ ఎంపీగాను గెలుపొందారు. మద్రాస్ ప్రెసెడెన్సీ నుంచి విడిపోయాక ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటులో ఆయన కృషి నగర వాసులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

విశాఖలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. జ్ఞానాపురంలో నివాసం ఉంటున్న సత్యరాజ్ బైక్ పై మిత్రుడితో కలిసి ఫంక్షన్కు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా డివైడర్ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వేములవలస వద్ద అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సాయికుమార్ రోడ్డు దాటుతుండగా మినీ బస్సు ఢీకొని మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో 7 శకటాలు, 8 స్టాళ్లు, 52 మందితో కూడిన పోలీసుల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వివిధ పథకాల లబ్ధిదారులకు మంత్రి రూ.214.99 కోట్ల ప్రోత్సాహకాలను పంపిణీ చేయనున్నారు.

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపలు, చికెన్ దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేశ్ కుమార్ గురువారం తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం, కృష్ణాష్టమి సందర్భంగా శనివారం అన్ని మాంసం దుకాణాలను, జంతు వధశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వ్యాపారులు గమనించాలని ఆయన సూచించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబైంది. గురువారం మధ్యాహ్నం నుంచి అధికారులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పురాతనమైన కలెక్టరేట్ భవనం విద్యుత్ కాంతుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖద్వారం సైతం చూడముచ్చటగా అలంకరించారు. కలెక్టరేట్తో పాటు నగరంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు.

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపలు, చికెన్ దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేశ్ కుమార్ గురువారం తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం, కృష్ణాష్టమి సందర్భంగా శనివారం అన్ని మాంసం దుకాణాలను, జంతు వధశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వ్యాపారులు గమనించాలని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.