Visakhapatnam

News July 22, 2024

విశాఖపట్నం ఉక్కుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం..!

image

విశాఖ ఉక్కు కర్మాగారంలో ముడిసరకు కొరతను నివారణకు రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చింది. ఉక్కు కర్మాగారానికి అవసరమైన గర్భాంలోని మాంగనీసు, సరిపల్లిలోని ఇసుక గనుల లీజుపై విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాసరావు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే సీఎం స్పందిస్తూ సత్వరమే లీజుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందించారు.

News July 22, 2024

అల్లూరి జిల్లాలో నేడు విద్యా సంస్థలకు సెలవు

image

అల్పపీడన ప్రభావంతో వర్షాలు జోరుగా కురుస్తుండంతో అల్లూరి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం కూడా కలెక్టర్ దినేశ్ కుమార్ సెలవు ప్రకటించారు. జిల్లాలోని చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాలలో అన్ని విద్యా సంస్థలకు సోమ, మంగళవారం రెండు రోజులు సెలవులు ఉంటాయన్నారు. ఈ ఆదేశాలను విద్యాశాఖ అధికారులు అమలు చేయాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 21, 2024

అరకులో రైల్వే ట్రాక్‌పై కూలిన చెట్టు

image

అల్లూరి జిల్లా అరకులోయ కేకే లైన్‌లో బొర్రా గృహలు, కరకవలస స్టేషన్‌ల మధ్య రైల్వే ట్రాక్‌పై భారీ వృక్షం కూలి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి బొర్రా స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై చెట్టు కూలింది. దీంతో అరకు మీదుగా వెళ్ళే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్టును తొలగించేందుకు రైల్వే శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

News July 21, 2024

PHOTO: ఉమ్మడి విశాఖలో హృదయ విదారక ఘటన

image

ఉమ్మడి విశాఖలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామానికి చెందిన మారపరెడ్డి జయశంకర్(30) వర్షంలో తడుస్తున్న గేదెను పాకలో కట్టడానికి తీసుకెళ్తుండగా కరెంట్ తీగ ఆయనపై తెగి పడింది. ఈ ఘటనలో గేదెతో పాటు జయశంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాంబిల్లి సీఐ నర్సింగరావు తెలిపారు.

News July 21, 2024

AIFF ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు విశాఖ యువకులు

image

ఈ నెల 27న అస్సాంలోని నాగోన్‌లో జరగబోయే AIFF జూనియర్ బాయ్స్ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్‌కు ఏపీ ఫుట్బాల్ టీమ్‌లో విశాఖ జిల్లా నుంచి ఐదుగురు ప్లేయర్‌లు ఎంపికయ్యారు. సెలెక్ట్ అయిన సి.హెచ్.సందీప్, డీ.ధనుశ్, ఎం. మహేశ్ చైతన్య, మురళీ, Ch.లోవన్ కాంత్‌కి అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

News July 21, 2024

కిరండూల్ రైలు దంతెవాడ వరకే

image

కొత్తవలస-కిరండూల్ రూట్‌లో భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈ నెల 22 వరకు విశాఖ-కిరండూల్ పాసింజర్ దంతెవాడ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో 21 నుంచి 23 వరకు కిరండూల్-విశాఖ పాసింజర్ దంతెవాడ నుంచి ప్రారంభమవుతుంది. విశాఖ- కిరండూల్(18514) రాత్రి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 22 వరకు విజయనగరం-రాయగడ-కొరాపుట్ మీద దంతెవాడ వరకు వెళుతుంది.

News July 21, 2024

హైకోర్టులో విజయసాయి రెడ్డి కుమార్తెకు ఊరట

image

విశాఖ జిల్లా భీమిలి వద్ద MP విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మించిన ప్రహరీ కూల్చి వేయాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై మరొకరు వేసిన పిల్ విచారణకు రావడంతో.. దాంతో నేహారెడ్డి పిటిషన్ జత చేయాలని కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు వద్దని అధికారులకు సూచించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రహరీ నిర్మించారని సమాచారం.

News July 20, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్‌కు భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ సరిగా లేదనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పారు.

News July 20, 2024

పాడేరు: ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం

image

భారీ వర్షాల నేపథ్యంలో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ఐదు ఘాట్ రోడ్లలో శనివారం నుంచి భారీ వాహనాలు, బస్సులు, ప్రైవేటు జీపుల రవాణాను సాయంత్రం 7నుంచి ఉదయం 6గంటల వరకు నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వడ్డాది-పాడేరు ఘాట్, పాడేరు-చింతపల్లి, కొక్కరాపల్లి ఘాట్, డౌనూరు, లంబసింగి ఘాట్, రంపచోడవరం-చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్లలో నిషేధ ఉత్తర్వులు పక్కాగా అమలు చేయాలన్నారు.

News July 20, 2024

MED, MPED 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో MED, MPED 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఫలితాలను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫలితాల కోసం ఏయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.