Visakhapatnam

News February 18, 2025

విశాఖ: టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య

image

టెన్త్ క్లాస్ చదువుతున్న కే.సాస మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. అక్కయ్యపాలెం ఎన్. జి.జి..ఓఎస్.కాలనీ ఓ అపార్ట్మెంట్‌లో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది. బాలిక సీతమ్మధారలోని ఓ స్కూల్‌లో చదువుతుంది. ఏమైందో తెలియదు గానీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News February 18, 2025

బ‌హుళ పంట‌ల విధానంపై రైతుల్లో చైత‌న్యం తీసుకురావాలి: కలెక్టర్

image

లాభ‌దాయ‌క సాగు విధానాల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని వ్య‌వ‌సాయ అనుబంధ శాఖ‌ల‌ అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్ర‌కృతి సేద్యానికి, మిల్లెట్లు, బ‌హుళ పంట‌ల సాగుకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. గ్రామాలల్లో ప్ర‌తి ఇంటి వ‌ద్దా కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంప‌కం చేసేలా అవ‌గాహ‌న కల్పించాలన్నారు.

News February 18, 2025

గాజువాక: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

గాజువాక షీలా నగర్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైలపల్లి మనోహర్ బైక్‌ను నడుపుతుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతని తండ్రి పేరు దేముడు అని ఐడి కార్డులో రాసి ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

విశాఖలో చదివిన ఏయూ వైస్-చాన్సలర్‌ రాజశేఖర్

image

ఏయూ వైస్-చాన్సలర్‌‌గా మంగళవారం నియామకం అయిన రాజశేఖర్ విశాఖలో విద్యాభ్యాసం చేశారు. విశాఖలో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్‌లో పదోతరగతి పూర్తి చేశారు. ఏ.వి.ఎన్. కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయనను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. అయితే విశాఖతో అనుబంధం ఉన్న వ్యక్తిని వైస్ ఛాన్సలర్‌గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

News February 18, 2025

ఏయూ వైస్ ఛాన్సలర్‌గా పీజీ రాజశేఖర్ నియామకం

image

విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా ఖరగ్‌పూర్ ఐఐటీకి చెందిన పీజీ రాజశేఖర్‌ను నియమిస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పీజీ రాజశేఖర్‌ను వైస్ ఛాన్సలర్‌గా నియమించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News February 18, 2025

నూత‌న సాగు విధానాలు అభివృద్ధి పరచాలి : కలెక్టర్

image

ప్ర‌కృతి సేద్యం, నూత‌న సాగు విధానాలు, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు మార్కెటింగ్ స‌దుపాయం కల్పించాలని జిల్లా క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. మంగ‌ళ‌వారం స్థానిక‌ క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో వ్య‌వ‌సాయ అనుబంధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. వ్యవసాయ రైతులకు గిట్టుబాటు ధరకు కల్పించే విధంగా సేవలందించాలని తెలిపారు.

News February 18, 2025

విశాఖ: రెండు రైళ్లు రద్దు

image

కార్యాచరణ పరిమితుల కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేయనున్నట్లు రైల్వే శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేసుకోవాలని సూచించింది. రానుపోను రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.  ✔ ఫిబ్రవరి 21న సంత్రాగచ్చి-ఎంజీఆర్ చెన్నై ఎక్స్‌ప్రెస్ (22807)✔ ఫిబ్రవరి 18న షాలిమర్-విశాఖ ఎక్స్ ప్రెస్(22853) రద్దు చేశారు.

News February 18, 2025

విశాఖకు చేరుకున్న ఎమ్మెల్సీ బ్యాలెట్ ప‌త్రాలు

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఈ నేపథ్యంలో ఎన్నిక‌ల‌ బ్యాలెట్ ప‌త్రాలు విశాఖ జిల్లాకు సోమవారం చేరుకున్నాయి. ఓట‌ర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్య‌ర్థుల ఫోటోలు, ఇత‌ర‌ వివ‌రాల‌తో కూడిన నివేదిక‌ల‌ను స్థానిక‌ అధికారులు ఇప్ప‌టికే పంపించారు. సంబంధిత బ్యాలెట్ ప‌త్రాల‌ను క‌ర్నూలులో ప్రింటింగ్ చేశారు. ఈ పత్రాలు విశాఖకు సోమవారం చేరుకున్నాయి.

News February 18, 2025

కావ్యరచనకు ఆధ్యుడు వాల్మీకి మహర్షి: చాగంటి

image

వాల్మీకి మహర్షి కావ్యరచనకు ఆధ్యుడని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విశాఖ మధురవాడ గాయత్రీ కళాశాల వేదికగా నిర్వహిస్తున్న శ్రీమద్రామాయణం ఉపన్యాసాన్ని ఆయన సోమవారం కొనసాగించారు. ఈ సందర్భంగా కావ్యాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేయడం వాల్మీకి మహర్షికే సాధ్యమన్నారు. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలని రామాయణంలో స్వామి హనుమ వివరించి తెలిపారని పేర్కొన్నారు. తర్వాత చేస్తే ప్రయోజనం శూన్యమన్నారు.

News February 17, 2025

విశాఖలో 54 ఫోన్ల రికవరీ

image

కదిలే రైళ్లు, ప్లాట్ ఫాం, వెయిటింగ్ హాలులో చోరీకి గురైన ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. రూ.10 లక్షల విలువైన 54ఫోన్లను రైల్వే డీఎస్ఆర్పీ పి.రామచంద్రరావు సూచనలతో సీఐ ధనుంజయ నాయుడు ఇవాళ విశాఖ రైల్వే స్టేషన్‌లో బాధితులకు అందించారు. వేర్వేరు సందర్భాల్లో మిస్ అయిన ఫోన్లు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించి రికవరీ చేశారు.