India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజకీయంగా విశాఖకు, పరిపాలన పరంగా VZM జిల్లాకు చెందిన ఎస్.కోట నియోజకవర్గంలో TDP 3 వర్గాలుగా విడిపోయింది. MLA లలిత కుమారి, జిల్లా సహకార మార్కెటింగ్ ఛైర్మన్ గొంప కృష్ణ, ఇందుకూరు సుధారాణి (MLC రఘురాజు భార్య) చెరో వర్గంలో ఉన్నారు. ఇటీవల 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి MLA వీరికి ఆహ్వానాలు ఇవ్వలేదంటూ ఈ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో నియోజకవర్గంలో వర్గపోరు నడుస్తున్నట్లు బట్టబయలైంది.

విశాఖలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం జిల్లాలో 7,205 కేసులు నమోదయ్యాయి. అన్ని వయస్సుల వారిలో బ్రెయిన్, రొమ్ము, ఊపిరితిత్తులు, నోరు, జీర్ణాశయ, గైనకాలజికల్ క్యాన్సర్లు కనిపిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, వ్యసనాలు, ప్లాస్టిక్ వినియోగమే ఇందుకు ప్రధాన కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. క్యాన్సర్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నారు.

జీవీఎంసీ, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఆర్కే బీచ్లో ‘శిఖర్ సే సాగర్ తక్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. శనివారం స్వచ్ఛత వాక్, యువతకు 5 కి.మీ.రన్, సైకత శిల్పాల ప్రదర్శన ఉంటాయి. ఆదివారం సైక్లోథాన్, బీచ్ క్లీనింగ్ నిర్వహిస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో నగరాన్ని ప్రథమస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు.10 కి.మీ.రన్ రద్దు చేశారన్నారు.

విశాఖలో TDP-జనసేన మధ్య అంతర్గత రాజకీయ విభేదాలు తెరపైకి వచ్చాయి. సిట్టింగ్ MLA వంశీకృష్ణ, TDP ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ మధ్య సమన్వయం లోపించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవులు, అభివృద్ధి కార్యక్రమాల్లో TDP క్యాడర్కు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశం TDP హైకమాండ్ వరకు చేరినట్టు సమాచారం. పొత్తులో ఆధిపత్య పోరు కూటమికి సవాలుగా మారుతుందన్న చర్చ సాగుతోంది.

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. 2026 బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ. 170 కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.3,500 కోట్ల అంచనా వ్యయం ఉన్న ఈ ప్రాజెక్టుకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవని, జోన్ నిర్మాణంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని పలు విమర్శలు వస్తున్నాయి. ఈ నామమాత్రపు కేటాయింపులతో జోన్ కల నెరవేరడంపై విశాఖ ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా ఆఫ్-సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ త్వరగా పూర్తిచేసేలా సంబంధిత శాఖలు, పరిశ్రమల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లో క్రైసిస్ గ్రూప్ జిల్లా స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పాతబడిన, పనికిరాని యంత్రాలు, నిరుపయోగ సామగ్రిని తొలగించి, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు.

విశాఖలోని తాటిచెట్లపాలెంలో అర్ధరాత్రి బాంబు కలకలం రేపింది. చెత్తకుప్పలో ఉన్న స్కూల్ బ్యాగ్లో లైటింగ్ బ్లింక్ కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఐఎఫ్ఆర్ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన పోలీసులు వేంటనే 112కి కాల్ చేసి అప్రమత్తం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్లి పరిశీలించగా పిల్లలు ఆడుకునే బొమ్మ అని నిర్ధారణ అయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వ దృక్పథం అనుకూలంగా ఉందని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ తెలిపారు. అధికారులు, కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. RINLకి ఇంకా దేశవ్యాప్తంగా బ్రాండ్ విలువ ఉందన్నారు. రుణాల వడ్డీ 14% – 8.9% తగ్గిందని, ఉత్పత్తి ఖర్చులు మరింత తగ్గించే అవకాశం ఉందన్నారు. 2 నెలల్లో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తామని CMD మణీష్ రాజ్ గుప్తా పేర్కొన్నారు.

విశాఖలో 27 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి లాటరీని నేడు VMRDA చిల్డ్రన్స్ ఏరినాలో నిర్వహించనున్నారు. 52 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయగా 108 దరఖాస్తులు వచ్చాయి. ఒక బారు లైసెన్స్కు 4 దరఖాస్తులు వచ్చినపుడే లక్కీ డ్రా నిర్వహిస్తారు. 27 మద్యం బార్లకు మాత్రమే 4 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.22 కోట్లు ఆదాయం లభించిందని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు.

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం వాస్తవమేనని MLA విష్ణు కుమార్ రాజు అన్నారు. గతంలో లడ్డూ తీసుకొస్తే 10 రోజుల పాటు సువాసన వచ్చేదని, ఐదేళ్లుగా లడ్డూను చూస్తేనే కల్తీ అయిందని అర్థమవుతోందన్నారు. YCP పాలనలో కొందరు నేతలు దారుణంగా మాట్లాడారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం పరిరక్షిస్తుందని
ఆయన స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.