Visakhapatnam

News July 19, 2024

గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి..!

image

సింహాచలం గిరి ప్రదక్షిణకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలో మీటర్ల మేర సాగే నడక మార్గంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
➣ సింహాచలం దేవస్థానం: 0891-2954944/9390501082
➣ జీవీఎంసీ కమాండ్ కంట్రోల్ సెంటర్:1800-42500009
➣ వాటర్ సప్లై&పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్: 0891-2869111
➣ విశాఖ పోలీస్: 9390105353/9330105355
>>> Share it

News July 19, 2024

గిరి ప్రదక్షిణపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

image

గిరి ప్రదక్షిణపై విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 20వ తేదీ ఉదయం గిరిప్రదక్షిణ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రికి ఏర్పాట్లు అన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

News July 19, 2024

విశాఖ మెడ్ టెక్ జోన్‌ను సందర్శించిన రాష్ట్ర మంత్రి

image

విశాఖ ఉక్కు నగరం పరిధిలో ఉన్న ఏపీ మెడ్ టెక్ జోన్‌ను రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. అక్కడ వివిధ కంపెనీల ఆపరేషన్స్ ప్రక్రియలను పరిశీలించారు. వైద్య పరికరాల తయారీకి సంబంధించిన వివిధ కంపెనీలను సందర్శించి కంపెనీల సీఈవోలతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. అక్కడున్న వసతులు, కంపెనీలు, ఉద్యోగులు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News July 19, 2024

హోంమంత్రి నెలరోజుల పనితీరుకు మీరిచ్చే మార్కులెన్ని?

image

హోం మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టి నేటితో నెల రోజులైంది. ఉమ్మడి విశాఖ నుంచి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ ఈమె.100 రోజుల ప్రణాళికతో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందని.. అత్యాచారాలు, హత్యలు పెరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. మరి మంత్రి నెలరోజుల పనితీరుకు 10కి మీరిచ్చే మార్కులెన్ని?

News July 19, 2024

20, 21 తేదీల్లో సిఫార్సు లేఖలు అనుమతించబడవు: ఈవో

image

సింహాచలం ఆలయంలో ఈనెల 20, 21 తేదీల్లో సిఫార్సు లేఖలు అనుమతించబడవని ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. 20న గిరి ప్రదక్షిణ 21న ఆషాడ పౌర్ణమి మరియు చందన సమర్పణ సందర్భంగా లక్షలాది సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అన్నారు. ఈ కారణంగా సిఫార్సులకు అనుమతించమని స్పష్టం చేశారు. అలాగే కొండపైకి ఏ విధమైన వాహనాలకు అనుమతి లేదన్నారు.

News July 19, 2024

విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూములు ఏర్పాటు

image

జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ విభాగంలో తుఫాను కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కలక్టర్ హరేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0891 – 2590102, 0891 – 2590100 ఫోన్ నంబర్‌లతో పని చేస్తుందని తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్‌ల ద్వారా వర్షాభావ పరిస్థితుల ప్రజలు తెలుసుకోవచ్చు.

News July 19, 2024

వర్షాలపై విశాఖ వాతావరణ శాఖ UPDATE

image

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం పూరీకి తూర్పుఆగ్నేయంగా 70 కిలోమీటర్ల, కళింగపట్నానికి తూర్పుఈశాన్యంగా 240కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. తీరం దాటిన తర్వాత బలహీనపడి ఒడిశా, ఛత్తీస్‌గడ్ మీదుగా కొనసాగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడతాయని తెలిపారు.

News July 19, 2024

గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రం

image

సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో గిరి ప్రదక్షిణ విజయవంత అయ్యేందుకు కృషి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్‌ను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

News July 19, 2024

విశాఖ: ఇగ్నో ప్రవేశాలకు గడువు పెంపు

image

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) 2024 విద్యాసంవత్సరానికి గాను వివిధ దూరవిద్య కోర్సులతోపాటు ఆన్‌లైన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన గడువు పొడిగించినట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ జి.ధర్మారావు తెలిపారు. డిప్లమా, పీజీ డిప్లమా, డిగ్రీ, పీజీ కోర్సులలో చేరడానికి జూలై 31 వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 19, 2024

తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

image

ప్రస్తుతం తుఫాను వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ, హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శుక్రవారం ఉదయం అనకాపల్లి, ఏలూరు సహా కోస్తాంధ్రలోని పలు జిల్లాల కలెక్టర్‌లతో ఆమె మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.