India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మల్కాపురంలోని ఇద్దరు ఆటోడ్రైవర్ల మధ్య జరిగిన వివాదంలో కత్తిపోట్లకు గురైన శామ్యూల్ KGHలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మల్కాపురం ఆటో స్టాండ్ వద్ద అప్పలరెడ్డికి శామ్యూల్ మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో అప్పలరెడ్డి తన వద్ద ఉన్న <<15456247>>కత్తితో శామ్యూల్ని <<>>పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. KGHలో చేర్పించి ఆపరేషన్ చేసినప్పటికీ శామ్యూల్ మృతి చెందాడు. కాగా..నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిశ్రమలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకుల తోడ్పాటు, రుణాల మంజూరు ప్రక్రియ, తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
గోపాలపట్నంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. నాగేంద్రబాబు, వసంత 11 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పోర్న్ వీడియోలకు బానిసైన నాగేంద్ర భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన వసంత శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని KGHకి తరలించారు.
పాత గాజువాక జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. గాజువాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నేవీ అధికారుల క్వార్టర్స్లో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ క్వార్టర్స్లో కమల అనే మహిళ కొన్ని సంవత్సరాలుగా ఓ అధికారి ఇంట్లో పని చేస్తుంది. వారు పని మీద బయటకు వెళ్లారు. మూడు రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. గురువారం పక్క ఫ్లాట్ వాళ్లు కిటికీలోంచి చూడగా ఆమె బట్టలు లేకుండా కింద పడి ఉంది. దీంతో సెక్యురిటీకి సమాచారం అందించారు. మల్కాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విశాఖ రానున్నారు. ఈరోజు సాయంత్రం 6:40కు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి నగరంలో గల టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ముఖ్య నాయకులతో సమావేశమై రాత్రి టీడీపీ కార్యాలయంలో బస చేస్తారు. శనివారం భోగపురంలో గల ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని శనివారం మధ్యాహ్నం విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకొని విజయవాడ వెళ్తారు.
మల్కాపురంలోని ఆటో స్టాండ్ వద్ద ఇద్దరు డ్రైవర్ల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ఒకరిపై మరొకరు కత్తితో దాడి చేసుకున్నారు. దీంతో శామ్యూల్ తీవ్రంగా గాయపడగా కేజీహెచ్కు తరలించారు. కత్తితో పొడిచిన అప్పన్న రెడ్డిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మద్యం మత్తులో ఘర్షణకు దిగారని, వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
తగరపువలసలోని ఓ స్వీట్షాప్లో మహిళ మృతిచెందింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన రక్షణకుమారి కొంతకాలంగా ఓ స్వీట్ షాప్లో పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఒంట్లో బాగోలేదని ట్యాబ్లెట్ వేసుకుని షాప్కి వెళ్లింది. అక్కడ పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. భీమిలి పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మధురవాడ లో ఇంటర్ విద్యార్థి మేడపై నుంచి దూకి మృతి చెందిన ఘటనపై పోలీస్, ఇంటర్ విద్యాశాఖ అధికారులు నివేదిక అందించాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒత్తిడి వల్ల చనిపోయాడా, ఇతర కారణాలు వల్ల చనిపోయామా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని సూచించారు.
విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707/08)కు ఏలూరు రైల్వే స్టేషన్లో అదనపు హాల్ట్ మరో ఆరు నెలలు కొనసాగుతుందని వాల్తేరు డివిజన్ డిసిఎం సందీప్ గురువారం తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్లో ఒక నిమిషం పాటు రైలు ఆగనున్నట్లు తెలిపారు. ఈ హాల్ట్ ఇరువైపులా ఉంటుందన్నారు. ప్రయాణికుల విషయాన్ని గమనించాలన్నారు.
Sorry, no posts matched your criteria.