Visakhapatnam

News July 19, 2024

గిరి ప్రదక్షిణకు వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ ప్లేస్

image

ఈ నెల 20వ తేదీన జరుగుతున్న గిరి ప్రదక్షిణలో 2,3,4 వీలర్స్‌కు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నడిచి వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికగా వివిధ ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చేవారికి పార్కింగ్ ప్లేస్‌లో ఏర్పాటు చేశారు. విజయనగరం మార్గంలో వచ్చే భక్తులు అడవివరం వద్ద, హనుమంతవాక వైపు నుంచి వచ్చేవారు సెంట్రల్ జైలు వద్ద, రూరల్ ప్రాంతం నుంచి వచ్చేవారు సింహపురి కాలనిలో పార్కింగ్ చేసుకోవాలి.

News July 19, 2024

కొచ్చువేలి-బరోని మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొచ్చువేలి భరోని మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. ఈనెల 25న ఉదయం 8 గంటలకు కొచ్చువాలీలో బయలుదేరి, 21న ఉదయం 11:45 గంటలకు దువ్వాడ చేరుకుని, 22న మధ్యాహ్నం బరోని చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 23న బయలుదేరి, మూడో రోజు తెల్లవారుజామున 5:25 కు దువ్వాడ చేరుతుంది. శుక్రవారం మధ్యాహ్నం 1:30కు కొచ్చివేలి చేరుతుంది.

News July 19, 2024

విశాఖ: అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన వారిపై నిఘా

image

పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. పెదగంట్యాడకు చెందిన యువతిపై హత్యాయత్నం విషయమై ఆయన మాట్లాడుతూ.. బాధిత తల్లిదండ్రులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. అమ్మాయిలను వేధించినా, ఇబ్బందులకు గురి చేసినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. మహిళల రక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు.

News July 19, 2024

విశాఖలో నేడు పాఠశాలలకు సెలవు

image

విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈఓ చంద్రకళ ఉదయం ప్రకటన విడుదల చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి సెలవు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు దీనిని పాటించాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News July 19, 2024

విశాఖ: పిల్లలను బెదిరించే ప్రయత్నంలో తండ్రి మృతి

image

‘మీరు అల్లరి చేస్తే నేను చచ్చిపోతా’ అంటూ పిల్లల అల్లరిని మాన్పించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం ఆతని ప్రాణాలనే తీసింది. ఈ ఘటన గోపాలపట్నంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన చందన్ కుమార్(33) పిల్లలు డబ్బులు చించేయడంతో వారిపై కోప్పడగా భార్య అడ్డు పడింది. దీంతో చందన్ ఫ్యాన్‌కు చీరకట్టి పిల్లలను భయపెట్టే ప్రయత్నం చేశారు. అదికాస్తా బిగుసుకుపోయి అతని ప్రాణాలు తీసింది.

News July 19, 2024

గిరి ప్రదక్షిణ రోజు ట్రాఫిక్ ఆంక్షలు

image

సింహాచలం గిరి ప్రదక్షిణ పురస్కరించుకొని విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో రవాణా శాఖ ట్రాఫిక్ ఆంక్షలు జారీచేశారు. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనదారులకు విశాఖపట్నం సిటీ గుండా వెళ్లేందుకు అనుమతిలేదని తెలిపారు. ప్రత్యామ్నాయంగా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం గుండా ప్రయాణించాని సూచించారు. అలానే శ్రీకాకుళం వైపు నుంచి అనకాపల్లి రావాలని తెలిపారు.

News July 19, 2024

వరి నాట్లేసిన అరకు ఎంపీ, ఎమ్మెల్యే

image

హుకుంపేట మండలం అడ్డుమండలో గురువారం అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం పొలంలో నాట్లేశారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి కృషి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు సంక్షేమానికి విస్మరించిందని ఆరోపించారు.

News July 18, 2024

హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసిన మదన్

image

గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కేంద్రంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన భార్యకు శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ ఆమె భర్త మదన్ కమిషనర్‌కు రాసిన లేఖ బట్టబయలు కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. తాజాగా గురువారం రాత్రి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను మదన్ కలిశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమెకు ఫిర్యాదు చేశారు.

News July 18, 2024

విశాఖలో ప్రేమోన్మాది అరెస్ట్.. రౌడీషీట్ ఓపెన్

image

విశాఖలోని గొంతినవానిపాలెంలో <<13648352>>యువతి తల్లి<<>>ని గాయపరిచిన నిందితుడు సిద్ధును గురువారం అరెస్టు చేసినట్లు డీసీపీ తుహీన్ సిన్హా తెలిపారు. విశాఖ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రేమ పేరుతో యువతిని వేధించడంతో పాటు మరో రెండు కేసులు ఉండడంతో నిందితుడు సిద్ధుపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు. మహిళలు, యువతులపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News July 18, 2024

అధికారుల సహకారంతోనే సహజ వనరుల దోపిడీ: జనసేన

image

అధికారుల సహకారంతోనే సహజ వనరుల దోపిడీ జరుగుతుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు.‌ గురువారం విశాఖలో పౌర గ్రంథాలయంలో జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలన్నారు. విశాఖలో ఎర్రమట్టి దిబ్బలను రక్షించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు.