Visakhapatnam

News July 12, 2024

విశాఖ: ఎమ్మెల్యేను కలిసిన MSK.ప్రసాద్

image

విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును తన కార్యాలయంలో ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ చీఫ్ సెలెక్టర్ MSK.ప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల అభిమానంతో వరుసగా గెలుస్తూ వస్తున్న వెలగపూడిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 12, 2024

రాయితీపై విక్రయాలు ప్రారంభించిన విశాఖ జేసీ

image

ఎంవీపి కాలనీలోని రైతుబజారులో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం పంపిణీ కేంద్రాన్ని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ప్రారంభించారు. బియ్యం కిలో రూ.48, కిలో కందిపప్పు రూ.160 రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ధరల పెరుగుదల నియంత్రించడంతోపాటు, ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ చర్యలు చేపట్టింది.

News July 12, 2024

పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు: గుడివాడ

image

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చెప్పినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ‌ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును చేపట్టినట్లు ‌ విమర్శించారు. విశాఖ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందన్నారు. ప్రజల తరఫున తాము పోరాటం చేస్తామన్నారు.

News July 12, 2024

విశాఖ: పవన్ కళ్యాణ్‌కు విశ్రాంత ఐఏఎస్ లేఖ

image

విశాఖ ముడసర్లోవ పార్కులో నిర్మాణాలు చేపట్టడం పర్యావరణానికి హానికరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. రిజర్వాయర్ ‌కు ఆనుకుని ఉన్న పార్కు ప్రదేశంలో 105 రకాల పక్షులను శాస్త్రవేత్తలు గుర్తించారని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతంలో జీవీఎంసీ భవనాల నిర్మాణానికి 228 చెట్లను తరలించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కట్టడాలు నిర్మించడం చట్ట విరుద్ధం అన్నారు.

News July 12, 2024

విశాఖ: నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్ల గడువు

image

ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన వెబ్ ఆప్షన్ల గడువు శుక్రవారంతో ముగియనుంది. శనివారం వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఈనెల 16న సీట్లు కేటాయిస్తారు. 17 నుంచి 22వ తేదీ వరకు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు ఆన్‌లైన్‌లో అందించి, కాలేజీలో రిపోర్టు సమర్పించాలి. 19 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి.

News July 12, 2024

విశాఖ: ‘రెండో శనివారం సెలవు ఇవ్వాలి’

image

విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు రెండవ శనివారం తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం రెండవ శనివారం సెలవుగా ప్రకటించినప్పటికీ జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

News July 12, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక విభాగాల పరిశీలనకు కమిటీ

image

విశాఖ ఉక్కు కర్మాగారంలో బ్లాస్ట్ ఫర్నేస్, రోలింగ్ మిల్స్, కోకో వెన్ విభాగాల పనితీరు మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సెయిల్ నుంచి ముగ్గురు అధికారుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. కమిటీలో టాపస్ దాస్ గుప్తా, సమీర్ రాయ్ చౌధురి (బిలాయ్ స్టీల్ ప్లాంట్), ప్రకాష్ బొండేకర్ (దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్) ఉన్నారు. వీరు త్వరలో విశాఖ ఉక్కును సందర్శించనున్నారు.

News July 12, 2024

గాజువాక: సచివాలయ సిబ్బంది మధ్య కొట్లాట ..!

image

గాజువాక సమీపంలో 67వ వార్డు జోగవానిపాలెం సచివాలయంలో సిబ్బంది కొట్లాటకు దిగారు. పింఛనుదారుల చిరునామా వివరాలను అనుసంధానం చేసే క్రమంలో వార్డు వెల్ఫేర్ సెక్రటరీ జల్లూరి సమరం, ప్లానింగ్ సెక్రటరీ అన్నెపు శ్రీనివాస్ వాదులాటకు దిగుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారు పట్టించుకోలేదు. ఈ ఘటనపై గాజువాక జోనల్ కమిషనర్ బి.సన్యాసినాయుడు గురువారం విచారణకు ఆదేశించారు.

News July 12, 2024

1912 నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే సకాలంలో పరిష్కారం: సీఎండీ

image

విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల ఇంజనీర్లతో విశాఖ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతరాయాల నివారణకు పలు సూచనలు చేశారు. విద్యుత్ సమస్యలను 1912 నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే సకాలంలో పరిష్కరిస్తామన్నారు.

News July 12, 2024

విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జట్టి

image

విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జట్టి నియమితులయ్యారు. విశాఖ రేంజ్ పరిధిలో చింతపల్లి సబ్ డివిజన్ ఏఎస్పీగా పనిచేశారు. 2015లో తిరుపతి అర్బన్ ఎస్పీగా, అనంతరం కర్నూల్ ఎస్పీగా 2018 వరకు పనిచేశారు. అనంతరం తిరుపతి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఐదేళ్ల పాటు పనిచేశారు. 2022 వరకు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం డీఐజీగా పదోన్నతి పొందారు.