India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైనర్ దర్శిని <<13605926>>హత్య కేసు<<>>లో నిందితుడు సురేశ్ మృతదేహాన్ని పోలీసులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. కొప్పుగుండుపాలెం శివారులో సురేశ్ మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమయింది. మృతదేహం బాగా కుళ్ళిపోవడంతో ఇతను ఆత్మహత్య ఎలా చేసుకున్నాడో తెలియరాలేదు. అయితే ఒంటిమీద ఎటువంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం కోసం అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు.
గతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రాష్ట్ర హోం మంత్రి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం నిత్యం చేస్తున్నారు. ఏ కార్యక్రమంలో ఉన్నా, ఎక్కడికి వెళ్లినా పాఠశాల చిన్నారులు కనిపిస్తే చాలు కొద్దిసేపు వారితో గడుపుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఒక వైపు పర్యవేక్షిస్తూనే మరోవైపు దార్లపూడిలో ప్రభుత్వ పాఠశాల చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారితో కొద్దిసేపు ముచ్చటించారు.
జనాభా సంబంధిత పరిశోధనలో ఏయూ 47 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు కేంద్రం సంచాలకులు ఆచార్య బి.మునిస్వామి తెలిపారు. 1977లో ఏయూలో జనాభా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇటువంటి కేంద్రాలు 18 ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇవి నడుస్తున్నాయి. రాష్ట్ర దేశ జనాభా తెలిపే విధంగా డిజిటల్ గడియారాన్ని ఈ కేంద్రం బయట ఏర్పాటు చేశారు.
విశాఖలో <<13598823>>డ్యూక్ బైక్<<>>తో మంగళవారం రాత్రి ఓ యువకుడు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. మాధవధార నుంచి వెళుతూ జ్యోతినగర్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరిని కంచరపాలెం నుంచి వస్తున్న క్రాంతి బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో త్రినాథరావు అక్కడికక్కడే మృతి చెందగా.. సన్యాసిరావు తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వీరిద్దరూ రోజువారి కూలీలే. ఈ ఘటనలో బైకర్కు స్వల్పగాయాలయ్యాయి.
ఉమ్మడి విశాఖ పర్యటనలో భాంగా సీఎం చంద్రబాబు ఈరోజు ఉ. 11 గంటలకు ఎస్.రాయవరం మండలం దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువ పనులను పర్యవేక్షిస్తారు. అనంతరం హెలికాప్టర్లో 12 గంటలకు బయలుదేరి భోగాపురం విమానాశ్రయం నిర్మాణ ప్రాంతానికి వెళ్తారు. తిరిగి మధ్యాహ్నం1:35కు బయలుదేరి పెదగంట్యాడ మండలం మెడ్టెక్ జోన్కు బయలుదేరుతారు. సాయంత్రం 4:45 నిమిషాలకు ఎయిర్ పోర్టుకు చేరుకుని అధికారులతో సమీక్షిస్తారు.
విశాఖ, అనకాపల్లి జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాలలో ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, పీజీటీ సోషల్, ఫిజికల్ సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టులను బోధించడానికి గెస్ట్ ఫ్యాకల్టీలను నియమిస్తున్నారు. అర్హత ఉన్నవారు గురువారం 10 గంటలకు మేఘాద్రి గెడ్డలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకులంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. పీజీలో 55% మార్కులు, బి.ఈ.డి., టెట్ అర్హత ఉండాలి.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 11న ఎస్.రాయవరం మండలం దార్లపూడిలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని తెలిపారు. దార్లపూడిలో సీఎం భద్రతా ఏర్పాట్లపై అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ మురళీకృష్ణతో సమీక్షించారు. భద్రత ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించవద్దని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
10వ తరగతి విద్యార్థులకు ఈనెల 11వ తేదీ నుంచి సూపర్ 50 శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ తెలిపారు. విద్యార్థులు సూపర్ 50ని సద్వినియోగం చేసుకుని, 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లో సీట్లు సంపాదించాలని సూచించారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులను పండుగలకు ఇంటికి పంపించరని చెప్పారు.
విశాఖ నగర జనాభా 23.85 లక్షలకు చేరింది. గత ఏడాది కంటే 2.32 శాతం వృద్ధి సాధించింది. 2021లో విశాఖ జనాభా 22.26 లక్షలు ఉండగా, 2022లో 22.78 లక్షలు, 2023లో 23.31 లక్షలుగా నమోదయింది. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని ఏయూలోని పీ.ఆర్.సీ కేంద్రం సంచాలకులు ఆచార్య బీ.మునిస్వామి వివరాలను వెల్లడించారు. అత్యంత జనసాంద్రత కలిగిన జిల్లాగా.. తక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా విశాఖ నిలుస్తోంది.
విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో 1794 జులై 10న ఆంగ్లేయులు విజయనగరం సంస్థానాధీశులు మధ్య జరిగిన యుద్ధానికి నేటికి 230 ఏళ్లు. ఆ యుద్ధంలో చినవిజయరామరాజుతో పాటు 394 మంది మరణించారు. దీంతో ఆ యుద్ధాన్ని స్కాట్లాండ్ ప్లోడెన్ యుద్ధంతో పోల్చారు. చినవిజయరామరాజును మచిలీపట్నం పంపించడానికి పన్నాగం పన్నగా అతను తన సామంతులతో కలిసి పద్మనాభం వద్ద ఆంగ్లేయులపై యుద్ధం చేసి వీరమరణం పొందారు. అక్కడే ఆయనకు సమాధి నిర్మించారు.
Sorry, no posts matched your criteria.