India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో కన్న కొడుకే తల్లిని <<15319558>>హత్య<<>>చేసిన విషయం తెలిసిందే. ఎవరూ లేని సమయంలో తల్లిపై కత్తితో దాడి చేయగా ఆమె చనిపోయింది. తల్లిని రూమ్లో పెట్టి తాళం వేశాడు. ఇంటికి వచ్చిన తమ్ముడు తల్లి గురించి అడగ్గా ఇంట్లో లేదని సమాధానం ఇచ్చాడు. చిన్నకొడుకు తండ్రికి ఫోన్ చేసి చెప్పగా కోస్ట్ గార్డులను ఇంటికి పంపించాడు. వారు వెతకగా అల్కాసింగ్ రక్తపు మడుగులో పడి ఉండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
విశాఖలో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు MVP పోలీసులు తెలిపారు. మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో MVP పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైడ్లో వ్యభిచార గృహం నడిపిస్తున్న సంతోశ్ కుమార్, విటుడు పెందుర్తికి చెందిన కుమార్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
వాల్తేర్ డివిజన్లో సాంకేతిక కారణాల వల్ల విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు చేసినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పలాస (67289/90)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
వాల్తేర్ డివిజన్లో సాంకేతిక కారణాలతో పలు రైళ్ల గమ్యం కుదించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పార్వతీపురం(67287/88)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 విజయనగరం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పార్వతీపురానికి బదులుగా విజయనగరం నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు వేయడం జరిగిందని వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 10:20 గంటలకు విశాఖ-గోరఖ్ పూర్ (08588) బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 5:45కు గోరఖ్పూర్లో బయలుదేరునుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
విశాఖలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్తో అవస్థలు పడుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం భూమి విలువను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజువారి రిజిస్ట్రేషన్ల కంటే శుక్రవారం మరింత ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఆసక్తి చూపారు. మరోపక్క సర్వర్లు మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాత్రి 12 వరకు సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కేంద్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మతం పేరుతో ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలని దీనికోసం వామపక్ష, లౌకిక పార్టీలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచార ఉద్యమం చేపడతామన్నారు.
విశాఖలో శనివారం జరగబోయే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నైతిక విలువలు పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. 42,230 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 184 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 3న పర్యావరణ పరీక్ష కూడా అవే కేంద్రాల్లో జరగనున్నట్లు వెల్లడించారు.
విశాఖలో శుక్రవారం తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. <<15316724>>ఆల్కాసింగ్<<>> భర్త బదిలీ కావడంతో ఇటీవలే ముంబాయి నుంచి విశాఖ వచ్చారు. పెద్ద కొడుకు ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని మందలించింది. దీంతో తల్లిని తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మల్కాపురం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీరప్రాంత రక్షక దళం కోస్ట్ క్వాటర్స్లో ఈ ఘటన జరిగింది. మృతురాలు కోస్ట్ గార్డ్ కమాండర్ ఉద్యోగి భార్య ఆల్కా సింగ్గా గుర్తించారు. ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండడంతో స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మహిళను హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.