Visakhapatnam

News April 25, 2025

విశాఖలో నేడు చంద్రమౌళి అంత్యక్రియలు

image

కశ్మీర్ ఉగ్రవాద దుర్ఘటనలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు విశాఖలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రమౌళి మృతదేహానికి గురువారం రాత్రి ఘన నివాళులర్పించారు.

News April 25, 2025

వందేళ్ల పండగకు రెఢీ అవుతున్న ఏయూ 

image

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని ఉపకులపతి ప్రో.రాజశేఖర్ తెలిపారు. తొలిరోజు ఉదయం 6గంటలకు ఆర్కే బీచ్‌లో శతాబ్ది వాక్ థాన్ ప్రారంభంకానుందని అన్నారు. ఉ.9 గంటలకు ఏయూ పరిపాలన భవనం వద్ద బెలూన్ లాంచింగ్, మ.3.30 గంటల నుంచి ప్రధాన వేడుకలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఐఐటీ పాలక్కడ్ డైరెక్టర్ హాజరవుతారన్నారు.

News April 25, 2025

విశాఖ రేంజ్‌లో 9 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

image

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను గురువారం డీఐజీ గోపినాథ్ జెట్టి బదిలీ చేశారు. ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు తక్షణమే సంబంధిత బదిలీ స్థానంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళ జిల్లాకు బదిలీ అయ్యారు.

News April 25, 2025

ఏయూ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

image

ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్‌లో హాజరు సరిగ్గా లేదని 30మంది విద్యార్థుల హాల్ టికెట్స్ ఇవ్వకపోవడం ఘోరమన్నారు. ఈ విషయంపై గురువారం ఏయూ వీసీ ఆఫీస్ వద్ద AISF నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈవిషయం వీసీ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఫలితం లేదని నిరసన చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శశిభూషణరావు స్పందించి శుక్రవారం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

News April 25, 2025

విశాఖలో 97 మంది పోలీసులకు రివార్డులు

image

విశాఖ నగర పరిధిలో ప్రతిభ కనబర్చిన 97 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి గురువారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారుల వరకూ రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెల రివార్డులను అందజేస్తున్నారు.

News April 24, 2025

జ్ఞానాపురం చర్చి మైదానంలో బాలిక మృతదేహం

image

విశాఖలోని జ్ఞానాపురం చర్చి మైదానంలో అనుమానస్పద స్థితిలో పడి ఉన్న 11 ఏళ్ల బాలిక మృతదేహాన్ని చర్చి ప్రతినిధులు గుర్తించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతి పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలిలోనే బాలిక తల్లి, అమ్మమ్మ ఉన్నారు.

News April 24, 2025

చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

image

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పరామర్శించారు. చంద్రమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్ర దాడుల్లో సామాన్య ప్రజలు మరణించడం తన మనసును కలిచివేసిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ కుటుంబాని పవన్ హామీ ఇచ్చారు.

News April 24, 2025

చంద్రమౌళి పార్థివదేహానికి నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్

image

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. విశాఖలోని కనకదుర్గ హాస్పిటల్‌కి వెళ్లి చంద్రమౌళి పార్థివ దేహాంపై పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడుల్లో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రపంచం మొత్తం ఈ దాడులను ఖండిస్తోందని పేర్కొన్నారు.

News April 24, 2025

టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, అప్పగింతపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్లో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, అప్పగింతపై గురువారం సమీక్ష జరిగింది. ఏపీ టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ జీవో నం.39 ప్రకారం ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్లకు లోన్స్‌పై బ్యాంకు అధికారులతో చర్చించి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News April 24, 2025

ఈనెల 26న GVMC డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం

image

GVMC డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఈనెల 26న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈనెల 26న ఉదయం 11 గంటలకు GVMC కౌన్సిల్ హల్లో నిర్వహించనున్నారు. ఆరోజున సమావేశానికి హాజరవుతున్న సభ్యులు మొబైల్ ఫోన్‌లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవాలన్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్లు, కార్పొరేటర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.