Visakhapatnam

News July 7, 2024

విశాఖ: ‘వైసీపీ శ్రేణులపై దాడులను అరికట్టాలి’

image

వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలను ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. విశాఖ నగర వైసీపీ ఆఫీసులో ఆదివారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. 8న వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.

News July 7, 2024

విశాఖ: జూన్‌లో పెరిగిన విమానాల సంఖ్య

image

విశాఖ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాల సంఖ్య జూన్ నెలలో పెరిగింది. గత ఏడాది జూన్‌లో 1,692 విమానాలు రాకపోకలు సాగించగా ఈ ఏడాది జూన్‌లో 1,704కు విమానాల సంఖ్య పెరిగింది. అయితే విమాన ప్రయాణికుల సంఖ్య స్పల్పంగా తగ్గింది. గతేడాది జూన్‌లో 2,54,490 మంది ప్రయాణించగా, ఈ జూన్లో 2,32,149 మంది ప్రయాణించారని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు నరేశ్ కుమార్, కుమార్ రాజా తెలిపారు.

News July 7, 2024

అనకాపల్లి: బాలికపై కక్ష కట్టి హత్య..!

image

రాంబిల్లి(మ) కొప్పుగుండుపాలేనికి చెందిన B.దర్శిని(14)హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కశింకోటకు చెందిన బి.సురేశ్(26) కొప్పుగుండుపాలెంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఏడాదిగా బాలిక వెంటపడడంతో ఆమె తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిపై పోక్సో కేసుపెట్టి జైలుకు పంపారు. దీంతో బాలికపై కక్ష పెంచుకున్న నిందితుడు బెయిల్‌పై వచ్చి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.

News July 7, 2024

విశాఖ-కిరండూల్-విశాఖ ప్యాసింజర్ రద్దు

image

కేకే లైన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనుల కారణంగా విశాఖ-కిరండూల్-విశాఖ రైళ్లు ఈ నెల 8,9 తేదీల్లో రద్దు చేసినట్లు అరకు రైల్వేస్టేషన్ అధికారులు తెలిపారు. ఈనెల 8న ఉదయం 6.45 గంటలకు విశాఖ నుంచి కిరండూల్ బయలుదేరే స్పెషల్ ప్యాసింజర్(08551), అలాగే 9వ తేదీ ఉదయం 6 గంటలకు కిరండూల్ నుంచి విశాఖ బయలుదేరే ప్యాసింజర్(08552) రద్దు చేశారు. కావున ప్రయాణికులు, పర్యాటకులు గమనించి సహకరించాలని కోరారు.

News July 7, 2024

విశాఖ: ‘రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలి’

image

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికపై పని చేస్తున్న అధ్యాపకులు సర్వీస్ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలని వి.ఎస్.కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐవి జయబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నగరం జోన్-1,2 పరిధిలో 174 పోస్టులకు రెన్యువల్ చేస్తారని అన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 2024 మార్చి 31 నాటికి కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.

News July 6, 2024

విశాఖ: గోదావరి టైటాన్స్ విజయం

image

విశాఖ వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్-3లో గోదావరి టైటాన్స్ బెజవాడ టైగర్స్ జట్లు శనివారం తలపడ్డాయి. ఒక్క పరుగు తేడాతో గోదావరి టైటాన్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి బెజవాడ టైగర్స్ బౌలింగ్ ఎంచుకుంది. గోదావరి టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 225 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెజవాడ టైగర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ‌224 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. 

News July 6, 2024

జీకేవీధి: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

జీకేవీధి మండలం వంచుల పంచాయతీ సిరిబాల గ్రామానికి చెందిన జోరంగి టైసన్ అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వీధి దీపాలు అమర్చేందుకు శనివారం విద్యుత్ స్తంబం ఎక్కాడు. ఈక్రమంలో విద్యుత్ వైర్ తగిలి షాక్‌కు గురై కింద పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆర్వీ నగర్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.

News July 6, 2024

జీకేవీధి: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

జీకేవీధి మండలం వంచుల పంచాయతీ సిరిబాల గ్రామానికి చెందిన జోరంగి టైసన్ అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వీధి దీపాలు అమర్చేందుకు శనివారం విద్యుత్ స్తంబం ఎక్కాడు. ఈక్రమంలో విద్యుత్ వైర్ తగిలి షాక్‌కు గురై కింద పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆర్వీ నగర్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.

News July 6, 2024

పదో తరగతి పాఠ్యాంశంలో పాడేరు మోదకొండమ్మ జాతర

image

పాడేరులో జరిగే మోదకొండమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి తెలుగు పాఠ్యాంశంలో చేర్చింది. ప్రతి ఏటా మే నెలలో మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం 2014లో దీనిని రాష్ట్ర జాతరగా గుర్తించింది. ప్రభుత్వం మోదకొండమ్మ జాతరను పదో తరగతి పాఠ్యాంశంలో పెట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 6, 2024

చింతపల్లిలో బైక్ దొంగతనం.. నాయకుడి అరెస్ట్   

image

చింతపల్లిలో ఓ పార్టీకి చెందిన నేత బైక్‌ను దొంగలించి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ అరుణ్ తెలిపారు. నిందితుడు షేక్ మీరా ఇటీవలె స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని చేపట్టారు. ఎన్నికల తర్వాత ఈ నామినేటెడ్ పోస్టులు రద్దు కావడంతో ఆయన దొంగతనాల బాట పట్టారు. ఈ క్రమంలో శుక్రవారం చింతపల్లిలో బైక్‌ను దొంగలించి విక్రయిస్తుండగా పట్టుకున్నామని ఎస్ఐ తెలిపారు.