India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరంలో పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో పాఠశాల భవనం లేక బడి ఈడు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామస్థులంతా ఏకమై శ్రమదానంతో రేకుల షెడ్డు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖా మంత్రి లోకేశ్, అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని కోరారు.
అగనంపూడి టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం గాజువాక నుంచి అగనంపూడి వైపు బైక్పై వెళ్తున్న ఇద్దరు లారీ వెనుక చక్రాల కింద పడి స్పాట్లోనే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక మహిళ, మరో పురుషుడు ఉన్నారు. మృతి చెందిన మహిళ వద్ద ఉన్న ఆధార్ కార్డు, బ్యాంకు బుక్ ప్రకారం పాత గాజువాకకు చెందిన గొర్లె అరుణ్ కుమారిగా పోలీసులు గుర్తించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ పి రఘువర్మ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగుస్తుంది. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయింది. 123 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 19 వేల ఓటర్లు ఉన్నారు.
పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేశ్ దావోస్లో పర్యటిస్తున్నారు. విశాఖలో ఆటో మొబైల్ ఉత్పత్తి, సప్లయ్ చైన్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ZF ఫాక్స్కాన్ CEO దృష్టికి తీసుకెళ్లారు. సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాట్సోడస్ను కోరారు. గ్లోబల్ డెలివరీ కేంద్రాలు, బ్యాక్ ఎండ్ ఐటీ ఆఫీస్ ఏర్పాటు చెయ్యాలని రాజీవ్ మోమానీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 28 మద్యం దుకాణాలను కేటాయించింది. అనకాపల్లి జిల్లాలో గౌడ శెట్టిబలిజ యాత కులస్తులకు మొత్తం 15 దుకాణాలను కేటాయించింది. విశాఖ జిల్లాలో 14 దుకాణాలను కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఒక్క దుకాణం కూడా కేటాయించలేదు.
భీమిలి పట్టణంలో మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మానసికస్థితి సరిగా లేకపోవడంతో పాటు పోలియోతో బాలిక మంచం పైనే ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం నిందితుడు బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక నానమ్మ బయటికి వెళ్లి వచ్చి చూసేసరికి నిందితుడు లోపల ఉండటంతో కేకలు వేసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
సంక్రాంతి సీజన్లో విశాఖ ఆర్టీసీకి రూ. రెండు కోట్ల ఆదాయం వచ్చినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35% అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. సంక్రాంతికి ముందు తర్వాత ఈనెల 21 వరకు విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాలకు బస్సులు నడిపినట్లు తెలిపారు. ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయలేదన్నారు.
విశాఖ సీపీ ఆదేశాలు మేరకు టాస్క్ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రైడ్ చేసి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి ద్వారా మరికొంతమంది బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10మందిని అరెస్టు చేశారు. ఈ బెట్టింగ్ ద్వారా రూ.178 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో ఎవరినీ విడిచి పెట్టమని సీపీ తేల్చి చెప్పారు.
పెందుర్తిలోని జెర్రిపోతులపాలెంలో మద్యం డిపోను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం పరిశీలించారు. ఈనెల 29 నుంచి రాష్ట్రంలో నవోదయం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నాటు సారా లేకుండా చేసి చూపిస్తామన్నారు. ఎవరైనా, ఎక్కడైనా కల్తీ సారా అమ్మినట్లు తెలిసినా, గంజాయి సాగు, రవాణాకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ఉన్నారు.
విశాఖలోని పీఎం పాలెం పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. HPCL లేఔట్లోని ఓ ఇంటిలో బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నల్ల సాయితేజను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.