Visakhapatnam

News July 4, 2024

మౌలిక వసతుల కల్పనకు కృషి: విశాఖ కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఐటీ, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని భావిస్తుందని అందుకు తగ్గట్లుగా మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తానని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించిన తరువాత మాట్లాడుతూ.. జిల్లాలో భూముల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అర్హులకు అన్యాయం జరగకుండా చూస్తానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు.

News July 4, 2024

విశాఖ: రేపు పలు రైళ్లును రద్దు చేసిన రైల్వే అధికారులు

image

పలాస-విజయనగరం డివిజన్ పరిధిలో భద్రతాపరమైన పనులు కారణంగా ఈనెల 5న పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కే.సందీప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (07471) పలాస-విశాఖ, (07470) విశాఖ -పలాస, (08522) విశాఖ – గునుపూర్, (08521) గునుపూర్ – విశాఖ, (08504) విశాఖ – భవానీపట్నం, (08532) విశాఖ – బ్రహ్మపుర ప్యాసింజర్, (22820) విశాఖ – భువనేశ్వర్ ఇంటర్ సిటీ రైలు రద్దు చేసినట్లు తెలిపారు.

News July 4, 2024

విశాఖ: రేషన్ లబ్ధిదారులకు ఈనెల పంచదార లేదు

image

రేషన్ కార్డుదారులకు జులై నెల కోట కింద పంచదారను సరఫరా చేయలేదు. ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాలోని పౌర సరఫరాల సంస్థ గిడ్డంగుల్లో ఆకస్మికంగా తనిఖీ చేయగా కందిపప్పు పంచదార ఇతర సరుకులు తూకంలో తక్కువగా ఉన్నాయి. ఫలితంగా కాంట్రాక్టర్‌ను నిలిపివేశారు. విశాఖ జిల్లాలో 5.20 లక్షల కార్డుదారులు ఉండగా వారెవరికి జులై నెల పంచదారను సరఫరా చేయడం లేదు.

News July 4, 2024

సింహగిరి ప్రదక్షణ అధికారులతో సమీక్షించిన కమిషనర్

image

ఈ నెల 20,21 వ తేదీలలో జరుగనున్న శ్రీ సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ సందర్భంగా నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత ఈ రోజు నగర పోలీసు కమీషనర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ముందస్తు రివ్యూ సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన పలు గిరి ప్రదక్షిణ బందోబస్తు ఏర్పాట్లను వీడియోల ద్వారా పరిశీలించారు. దారి పొడవునా వీధి దీపాలు ఏర్పాటు, సముద్ర స్నానాల్లో భద్రత చర్యలు తదితర అంశాలపై చర్చించారు.

News July 3, 2024

కొత్తూరులో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ముంచంగిపుట్టు మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తూరు రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా పాడేరు నుంచి ముంచంగిపుట్టు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

News July 3, 2024

ఏయూ పరిధిలో గురువారం జరగాల్సిన పరీక్షలు వాయిదా: టీ. చిట్టిబాబు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 4వ తేదీన జరగాల్సిన రెండో, నాల్గో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీ. చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ విద్యార్థి సంఘాలు 4వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. గురువారం జరగాల్సిన పరీక్షలు మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

News July 3, 2024

గ్రీన్ టాక్స్ తగ్గించేందుకు కృషి: పల్లా శ్రీనివాస్

image

భారీ వాహనాలకు భారంగా మారిన గ్రీన్ టాక్స్ తగ్గించేందుకు కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక మండలం కూర్మన్నపాలెంలో ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నెల రోజుల్లోనే అగనంపూడి టోల్ ప్లాజా ఎత్తివేయించానన్నారు.

News July 3, 2024

విశాఖ: స్వామీజీలపై దుష్ప్రచారం మానుకోవాలి- వీహెచ్పీ

image

స్వార్థపరమైన రాజకీయ దురుద్దేశంతో హిందూమత స్వామిపై దుష్ప్రచారం తగదని వీహెచ్పీ నేత విజయ శంకర్ ఫణి హితవు పలికారు. డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం పెందుర్తి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. విజయ శంకర్‌ మాట్లాడుతూ ఇటీవల కొంత మంది స్వలాభం, వైఖరి వల్ల బ్రాహ్మణ వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాముల మీద దుష్ప్రచారం తగదన్నారు.

News July 3, 2024

ఏయూ: 15 నుంచి బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ 4వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పరీక్షలు భాగం డిప్యూటీ రిజిస్టార్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్స్ నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌కు తెలియజేయాలని పేర్కొన్నారు. సబ్జెక్ట్ ఎగ్జామినర్, ప్రిన్సిపల్స్ పర్యవేక్షణలో ప్రాక్టికల్స్ నిర్వహణ చేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు.

News July 3, 2024

ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా పోరాటం: సీపీఐ

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ స్పష్టం చేశారు. బుధవారం విశాఖలో సీపీఐ నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. గత ప్రభుత్వం అక్రమాలపై విచారణ జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆయనతో పాటు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.