India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 7న నిర్వహించనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాస మూర్తి ఆదేశించారు. ఈ పరీక్షకు చేయాల్సిన ఏర్పాట్లపై విజయనగరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలన్నారు.
విజయనగరం జిల్లా కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రసాద్ గురువారం తెలిపారు. వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, NIA యాక్ట్, ఎక్సైజ్ కేసులు, కుటుంబ వివాదాలు, కార్మిక సంబంధిత, సివిల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. నూతన కోర్డు భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.
విజయనగరం మహిళ ప్రాంగణంలోని SEEDAP ఆధ్వర్యంలో ఈనెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా పథక సంచాలకుడు శ్రీనివాస్ పాణి గురువారం తెలిపారు. వివిధ కంపెనీల్లో 240 ఉద్యోగాలకు మేళా జరుగుతుందన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు అర్హులని, 18 నుంచి 28 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. యువతీ, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
విజయనగరం జిల్లాలో 215 గ్రామాల్లో చెరువులు, కల్వర్టుల మరమ్మతులకు త్వరితగతిన ప్రణాళిక తయారుచేసి వారంలోగా పనులు పూర్తిచేయాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. సీఎస్తో గురువారం జరిగిన వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రోజుకు 100 చెరువులు నిర్దేశించుకొని పనులు పూర్తిచేయాలని అన్నారు. పనుల పురోగతిపై ప్రతి రోజూ సమీక్ష నిర్వహించాలని సంయుక్త కలెక్టర్ను ఆదేశించారు.
విజయనగరం జిల్లా కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రసాద్ గురువారం తెలిపారు. వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, NIA యాక్ట్, ఎక్సైజ్ కేసులు, కుటుంబ వివాదాలు, కార్మిక సంబంధిత, సివిల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. నూతన కోర్డు భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.
విజయనగరం జిల్లాలో నిర్వహించిన మధ్యవర్తిత్వ కార్యక్రమానికి భారీగా విశేష స్పందన లభించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భబిత గురువారం తెలిపారు. 3 నెలలుగా జిల్లా కోర్టులో ఉన్న మధ్యవర్తిత్వ కేంద్రానికి 1,100 కేసులు మధ్యవర్తిత్వ ప్రక్రియకు పంపించగా అందులో 30 కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. మనోవర్తి, ప్రమాద బీమా, గృహహింస, చెక్ బౌన్స్ కేసులు, వాణిజ్యపరమైన తగాదాలు పరిష్కరించుకోవచ్చన్నారు.
స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా సంక్షేమ హాస్టళ్లకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో తన ఛాంబర్లో గురువారం సమీక్షించారు. జిల్లాలో 15 హాస్టళ్లలో మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందన్నారు. 11 సాంఘిక, 39 బీసీ హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు చేసిన వారికి సులువుగా అనుమతులను ఇవ్వాలని, దరఖాస్తుల పరిశీలన ఉదారంగా ఉండాలని JC సేతు మాధవన్ సూచించారు. గురువారం విజయనగరం కలెక్టరేట్లో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ పై వర్క్ షాప్ నిర్వహించారు. సింగల్ డెస్క్ పోర్టల్ ద్వారా గత ఏడాది 2257 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చామన్నారు. ప్రతి నెలా జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీలో సమీక్షిస్తామన్నారు.
విజయనగరం జిల్లాకు చెందిన 76 మంది ఉత్తమ ఉపాధ్యాయులను రేపు సన్మానించనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ గురువారం తెలిపారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం జరిపిస్తామన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 11 కార్పొరేషన్లకు నామినేటెడ్ డైరెక్టర్లను నియమించిన సంగతి తెలిసిందే. వీటిలో మన విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. నెల్లిమర్లకు చెందిన సువ్వాడ వనజాక్షిని రాష్ట్ర గ్రీన్కో & బ్యూటిఫికేషన్ డైరెక్టర్ గా ప్రకటించింది. ఆమె ఈ పదవిని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.