Vizianagaram

News September 14, 2024

పైడితల్లి అమ్మవారి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

image

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల నిర్వహణపై శనివారం ఉదయం 11 గంగలకు కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అక్టోబర్ 15న అమ్మవారి సిరిమాను సంబరం జరగనున్న నేపథ్యంలో పండగ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు.

News September 13, 2024

VZM: నర్సింగ్ చేసిన వారికి గుడ్ న్యూస్

image

ANM, GNM,BSC నర్సింగ్ చదివిన వారికి జపనీస్ భాష నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గోవిందరావు తెలిపారు. ఆరు నెలల శిక్షణ కోసం రూ.3.50 లక్షలు చెల్లించాలని, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50వేలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.శిక్షణ అనంతరం జపాన్ దేశంలో నెలకు రూ.లక్ష దాటి జీతం పొందవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://shorturl.at/FB7ok వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవాలన్నారు.

News September 13, 2024

VZM: రాష్ట్రస్థాయి యోగాసనాలకు 30 మంది ఎంపిక

image

49వ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు 30 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విక్రమ్ శుక్రవారం జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులను అభినందించారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటి, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. యోగా క్రీడా శరీరానికి, మానసిక ఎదుగుదలకు ఎంతో ఉపయోకరమని, అందుకే దేశ ప్రధాని మోదీ సైతం ఈ క్రీడను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

News September 13, 2024

విజయనగరం: ఈ నెల 16న గ్రీవెన్స్ రద్దు

image

ఈ నెల 16న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వివిధ సమస్యలపై అర్జీలు అందించడానికి వచ్చే ప్రజలు ఈ విషయం గమనించాలని సూచించారు.

News September 13, 2024

కలెక్టర్ ఔదార్యం.. వసతి గృహాలకు ఫ్యాన్ల పంపిణీ

image

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఔదార్యం చూపారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, వెనుకబడిన సంక్షేమ శాఖల పరిధిలో గల మరిపివలస, సాలూరు, పార్వతీపురం, కురుపాం, జియ్యమ్మవలస, చినమేరంగి, రావివలస, గరుగుబిల్లి వసతిగృహాలకు 20 ఫ్యాన్లను సొంత ఖర్చులతో సమకూర్చారు. వాటిని కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత వసతి గృహాల సంక్షేమ అధికారులకు అందజేశారు.

News September 13, 2024

ఈ నెల 17 నుంచి ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకొని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు జరుగుతాయని, అక్టోబర్ 2న స్వచ్చ భారత్ దివాస్‌గా జరుపుకుంటామని తెలిపారు.

News September 12, 2024

తిరుపతి, శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు

image

తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. వచ్చేనెల 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు తిరుపతిలో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.47కు శ్రీకాకుళం చేరుకుంటుందన్నారు. శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతికి అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు.

News September 12, 2024

మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి యాక్సిడెంట్

image

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి యాక్సిడెంట్ అయ్యింది. మెంటాడ పర్యటనకు వెళుతుండగా రామభద్రపురం మండలం బూసాయవలస వద్ద ఎస్కార్ట్ వాహనాన్ని మరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News September 12, 2024

‘ఉలిపిరి హెచ్ఎం‌పై పోక్సో కేసు పెట్టాలి’

image

ఉలిపిరి హెచ్ఎంపై పోక్సో కేసు పెట్టాలని పార్వతీపురం ఎస్ఎఫ్ఐ గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి డి.పండు డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. హెచ్ఎం కృష్ణారావు విద్యార్థులపై, ఉపాధ్యాయుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో కురుకుట్టిలో పని చేసినప్పుడు ఇదే తంతు జరిగిందన్నారు. ఘటనపై విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేయాలన్నారు.

News September 12, 2024

VZM: ‘ఈనెల 25 వరకు ఛాన్స్’

image

ఏపీ ఓపెన్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరానికి పది, ఇంటర్ లో జాయిన్ అవ్వడానికి గడువు పొడిగించినట్లు డీఈవో ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఫైన్ లేకుండా ఈనెల 15లోగా అప్లై చేసుకోవచ్చన్నారు. రూ.200 ఫైన్ తో ఈనెల 25 వరకు అవకాశం ఉందన్నారు. అర్హతగలవారు సంబంధిత వెబ్ సైట్‌లో
అప్లై చేసుకోవాలన్నారు.