India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కిసాన్ డ్రోన్ను జామి మండలం మొక్కాసవలస గ్రామానికి చెందిన లబ్ధిదారుడు కూనిరెడ్డి సత్యనారాయణ మూర్తికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద జిల్లాలో 24 డ్రోన్లను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు.
CMO ఆదేశాల మేరకు త్వరలో PGRSకు సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తామని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. PGRSపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతినెలా విశ్లేషణ నిర్వహిస్తారని, అందువల్ల అధికారులంతా వచ్చిన వినతల పరిష్కారం పట్ల చిత్త శుద్ధి చూపించాలని ఆదేశించారు. అసలైన ఫిర్యాదుదారులకు న్యాయం చేకూర్చే విధంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు.
విజయనగరం జిల్లా చాలా ప్రశాంతమైనదని, ఆ పేరును నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ అంబేద్కర్ కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జిల్లా శాంతి కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ నెలలో వినాయక నిమజ్జనం, దసరా ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండగలు ఉన్న కారణంగా అవన్నీ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందల్ పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం SP వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. కార్యక్రమంలో SP ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పట్ల సిబ్బంది సానుకూలంగా స్పందించాలని, చట్ట పరిధిలో తగిన చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని ఆయన చెప్పారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 28 ఫిర్యాదులను స్వీకరించారు.
ఆకతాయిల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం తెలిపారు.
మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శక్తి’ యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు శక్తి టీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు. ఐదు బృందాలుగా 30 మంది నిత్యం పహారా కాస్తున్నారని పేర్కొన్నారు.
గోవా గవర్నర్గా బాధ్యతలను స్వీకరించిన తర్వత పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు.
దీంతో ఆదివారం ఆయన స్వగృహం వద్ద ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి అశోక్ గజపతిరాజు గౌరవ వందనం స్వీకరించారు.
గవర్నర్ హోదాలో పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిసారి జిల్లాకు రానున్నారు. మూడు రోజులు పాటు జిల్లాలో ఉంటారు. సెప్టెంబర్ 1న శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంటారు. 2వ తేదిన కోటలోని మోతీమహల్ను ప్రారంభిస్తారు. 3వ తేదిన సింహాచలం శ్రీవరహాలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, 4న గోవాకు తిరుగు పయనమవుతారని అశోక్ బంగ్లా వర్గాలు వెల్లడించాయి.
విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ మధ్య శనివారం MOU కుదిరింది. ఇరు సంస్థల ప్రతినిధులు శ్రీనివాసన్, సుందరం సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో సేంద్రీయ సాగు, ఆధునిక వరి సాగు, వ్యాధుల నియంత్రణపై శిక్షణకు MOU దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. సుస్థిర గిరిజనాభివృద్దికి MOU కుదిరిందన్నారు.
కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు వైద్య పరీక్షల షెడ్యూల్ను ఎస్పీ విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ నంబర్ల ప్రకారం హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
> సెప్టెంబర్1న రిజిస్ట్రేషన్ నెంబర్ 4013323 TO 4175360, 4177478-4232439
> 2న 4234215-4347353, 4350301-4495111, 4001630-4044049
> 3న 4044111-4130825, 4132116-4189468
> 4న 4190909-4235398, 4235403-4269223
> 6న 4270844-4330310, 4330524-4511514
ఇంటింటికి త్రాగు నీటిని అందించేందుకు ఉద్దేశించిన జలజీవన్ మిషన్ అమలు తీరు జిల్లాలో ప్రశంసనీయంగా ఉందని కేంద్ర బృందం అభినందించింది. బృందం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను శనివారం కలిసి, పథకం అమలుపై చర్చించారు. ప్రతీ ఇంటికి సురక్షిత త్రాగు నీరు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని, పథకాన్ని సంపూర్ణంగా, మరింత పటిష్ఠంగా అమలు చెయ్యాలని కోరారు.
Sorry, no posts matched your criteria.