Vizianagaram

News April 1, 2025

‘యువతిని చంపి 100 కి.మీలు బైక్‌పై తీసుకొచ్చారు’

image

సాలూరులో <<15956319>>యువతి హత్య<<>> కేసును పోలీసులు చేధించిన విషయం తెలిసిందే. యువతి మెడపై 2 గాయాలు ఉండడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. రాంబాబు ఐశ్యర్యను విశాఖ జిల్లా ఆరిలోవలోని ఓ రూములో చంపినట్లు తేలింది. అక్కడి నుంచి స్నేహితుల సాయంతో సాయంతో డెడ్‌బాడీని బైక్‌పై 100 KM తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీశాడు. బైక్‌పై వచ్చినప్పుడు రికార్డ్ అయిన CC ఫుటీజీ ఆధారంగా రాంబాబును అరెస్ట్ చేశారు.

News April 1, 2025

యువతిని చంపి జీడితోటలో చెట్టుకు వేలాడదీశాడు

image

సాలూరు మండలం చీపురువలసలో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మర్రివానివలసకు చెందిన ఐశ్వర్య విశాఖలో పనిచేస్తోంది. ఓ పెళ్లిలో దత్తివలసకు చెందిన వివాహితుడు రాంబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడ్ని గుడ్డిగా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. ఈ క్రమంలో రాంబాబు యువతిని చంపి చెట్టుకు చున్నీతో వేలాడదీసి ఆత్మహత్యలా చిత్రీకరించాడు.

News April 1, 2025

భీమిలి బీచ్‌లో విజయనగరం వాసి మృతి

image

భీమిలి బీచ్‌లో విజయనగరం జిల్లా వాసి సోమవారం మృతి చెందారు. గజపతినగరం ప్రాంతానికి చెందిన పరదేశి(37) భీమిలీ బీచ్‌లో స్నానానికి వచ్చాడు. స్నానం చేసిన అనంతరం ఒడ్డుపై కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని భీమిలి ఆసుపత్రికి తరలించారు.

News April 1, 2025

మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును కలిసిన వైసీపీ కౌన్సిలర్లు

image

మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు విశాఖలోని సోమవారం కలిశారు. మున్సిపల్ ఛైర్మన్ సావు మురళీ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని, ఎమ్మెల్యే బేబినాయన చేస్తున్న అభివృద్ధికి సహకరించడం లేదని సుజయ కృష్ణరంగారావుకు తెలిపారు. అభివృద్ధి చేయడంలో విఫలం కావడంతో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైట్లు వివరించారు. వైసీపీ మద్దతుతో ఛైర్మన్ పదవి కైవసం చేసుకుంటామని మాజీమంత్రి చెప్పారు.

News April 1, 2025

VZM: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

విజయనగరం రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి కాలుజారి పడటంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఛత్రిభాను(46) మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ బాలాజీరావు చెప్పారు. దిబ్రుగర్ నుంచి కన్యాకుమారి వెళ్తున్న రైలులో ప్రయాణం చేస్తున్న భాను విజయనగరం స్టేషన్‌లో వాటర్ కోసం దిగాడు. ఇంతలోనే రైలు కదలండంతో రైలులోకి ఎక్కుతుండగా కాలుజారి కిందపడి మృతి చెందిడని SI తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహారాజు ఆసుపత్రికి తరలించామన్నారు.

News March 31, 2025

జామి: ప్రమాదవశాత్తు గెడ్డలో పడి గొర్రెల కాపరి మృతి

image

జామి మండలం లక్ష్మీపురం గ్రామానికి సమీపంలో ఉన్న గెడ్డలో పడి అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి వారధి కృష్ణ చనిపోయాడు స్థానికులు తెలిపారు. మృతుడు ఆదివారం నుంచి కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం సుమారు 11 గంటల ప్రాంతంలో స్థానికులు గెడ్డలో శవం ఉన్నట్లు తెలిసి వెళ్లి చూడగా అతను వారధి కృష్ణగా గుర్తించారు. ప్రమాదవశాత్తు గెడ్డలో పడి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

News March 31, 2025

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రంజాన్ : VZM SP

image

విజయనగరం జిల్లాలో రంజాన్ పండగ హిందూ – ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు, సంఘర్షలు, అల్లర్లు జరగకుండా ప్రశాంతయుతంగా ముగిసినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు భద్రత చర్యలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు.

News March 31, 2025

బొబ్బిలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

బొబ్బిలి సమీపంలోని దిబ్బగుడివలస – గుమ్మడివరం మధ్యలో రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని GRP హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. సదరు వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడి మృతిచెంది ఉంటాడని ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని ఎవరైనా గుర్తిస్తే బొబ్బిలి రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News March 31, 2025

గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఉగాది రోజు ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్‌లో కులిమిశెట్టి కృష్ణ (65)ను ఆదివారం ఓ బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణను స్థానికులు విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు గంట్యాడ SI సాయకృష్ణ సోమవారం తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News March 31, 2025

రంజాన్ మాసం అందిర జీవితంలో వెలుగులు నింపాలి: జడ్పీ ఛైర్మన్

image

పవిత్ర రంజాన్ సందర్భంగా అల్లాహ్ తన కరుణతో అందరినీ దీవించాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. అందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రశాంతత లభించాలని కోరారు. రంజాన్ మాసం జీవితాల్లో వెలుగు నింపాలనీ, ప్రేమ, శాంతి, సామరస్యాన్ని అందించాలనీ కోరారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో మన హృదయాలను శుద్ధి చేసుకోవాలని, విజయానికి మార్గం సుగమం కావాలని ఆయన అభిలషించారు.