Vizianagaram

News September 12, 2024

విజయనగరం: JNTUలో సైబర్ నేరాల నియంత్రణపై సెమినార్

image

సైబర్ నేరాల నియంత్రణపై విజయనగరం JNTUలో మూడు రోజులు పాటు జరగనున్న జాతీయ సెమినార్ బుధవారం ప్రారంభం అయింది. సెమినార్‌ను జైపూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగాధిపతి పి.అరుణకుమారి ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణకు టెక్నాలజీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సైబర్ మోసాలను ఎలా నియంత్రించాలో ఆచరణాత్మక పద్ధతిలో విద్యార్థులకు వివరించారు.

News September 11, 2024

‘పార్వతీపురం-విశాఖ మధ్య షటిల్ సర్వీస్ రైలు నడపాలి’

image

పార్వతీపురం-విశాఖ మధ్య షటిల్ సర్వీస్ ట్రైన్ నడపాలని సీపీఎం బొబ్బిలి పట్టణ కార్యదర్శి పి.శంకర్రావు డిమాండ్ చేశారు. పార్వతీపురం, బొబ్బిలి నుంచి విజయనగరం, విశాఖకు విద్యార్థులు, ఉద్యోగస్థులు, వైద్యం కోసం ప్రతీ రోజూ వేలాది మంది రైలు ప్రయాణం చేస్తున్నారన్నారు. కానీ, సరిపడా ట్రైన్లు లేవన్నారు. ఉన్న ఒకటి రెండు రైళ్లలో కిక్కిరిసి, ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారన్నారు.

News September 11, 2024

విజయనగరం జిల్లాలో పశువుల అక్రమ రవాణా..!

image

కొత్తవలస మండల కేంద్రంలోని సంతపాలెంలో పశువులను అక్రమంగా నిర్బంధించిన గోడౌన్‌పై సీఐ షణ్ముఖరావు మంగళవారం తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అక్రమంగా తరలించేందుకు ఉంచిన 108 పశువులను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని, పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న గొటివాడ ఎర్రిబాబు, గొటివాడ నవీన్, ఐ.దేవుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

News September 11, 2024

పెదమానాపురం హైవేపై లారీ బోల్తా

image

దత్తిరాజేరు మండలం పెదమానాపురం హైవేపై ఈరోజు తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్‌గడ్ నుంచి కంటకాపల్లి వైపు బొగ్గుతో వెళ్తున్న లారీ పెదమానాపురం ఆర్‌సీ‌ఎం చర్చి దగ్గర బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. నివారణ చర్యలు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

News September 11, 2024

కౌలు రైతుల రుణాల‌ను ముమ్మ‌రం చేయాలి: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో కౌలు రైతుల‌కు రుణాలు అందించే కార్య‌క్ర‌మాన్ని బ్యాంకులు మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ బ్యాంక‌ర్ల‌ను కోరారు. కౌలు రైతుల‌కు రుణాలు అందించే కార్య‌క్ర‌మంపై డీసీసీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. 2,333 మందికి కౌలు రుణాల కోసం బ్యాంకుల‌కు ద‌ర‌ఖాస్తులు పంపించామ‌ని వ్య‌వ‌సాయ శాఖ జిల్లా అధికారి రామారావు వివ‌రించారు.

News September 10, 2024

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

విజయనగరం పట్టణం అలకానంద కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. అక్కడ కొన్నాళ్లుగా ఒక మహిళ వ్యభిచార గృహం నిర్వహిస్తుందనే సమాచారంతో మంగళవారం సాయంత్రం దాడులు చేసి, ఇద్దరు విటులు, ఒక బాధితురాలితో పాటు వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

News September 10, 2024

ఐటీఐ అభ్యర్థులకు దుబాయ్‌లో ఉద్యోగావకాశాలు

image

విశాఖ కంచరపాలెం ప్రభుత్వ ITIలో ఈ నెల 12న ఉదయం 9 గంటల నుంచి అశోక్ లేలాండ్ కంపెనీ వారిచే జాబ్ ఫేర్ నిర్వహిస్తున్నట్లు విజయనగరం ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ టి.వి.గిరి మంగళవారం తెలిపారు. ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో పెయింటర్ ట్రేడ్లలో ITI పాసైన వారు అర్హులు. దుబాయ్‌లో ఉద్యోగావకాశం ఉంటుందన్నారు. వివరాలకు 9440197068, 9849118075 నంబర్‌లను సంప్రదించాలన్నారు.

News September 10, 2024

ప్రజలు LHMS సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: ఎస్పీ

image

విజయనగరం పట్టణం, రూరల్ స్టేషన్లతో పాటు నెల్లిమర్ల, బొబ్బిలి పోలీసు స్టేషన్ పరిధిలోని మున్సిపల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు LHMS (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తమ అవసరాల నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో తమ ఇండ్లలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఇది పనిచేస్తోందని తెలిపారు.

News September 10, 2024

పుష్పాలంకరణలో శ్రీ పైడితల్లి అమ్మవారు

image

విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లమ్మకు చదురుగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడంతో ఆలయ అర్చకులు వేకువజాము నుంచి పంచామృతాభిషేకాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

News September 10, 2024

బొబ్బిలి : నెలరోజులకే రూ.94లక్షలు గంగార్పణం

image

పారాది వద్ద వేగావతి నదిపై రూ.94 లక్షలు వెచ్చించి నిర్మించిన కాజ్వే నెల రోజులుకే గంగ పాలైంది. ఇప్పటికే నాలుగుసార్లు మరమ్మతులు చేశారు. ఈసారి వర్షాలకు ఐదు రోజులుగా నీరు పారడంతో సగం వరకు పాడైపోయింది. పూర్తిస్థాయిలో మరమ్మ తులు చేస్తే కానీ వాహనాల రాకపోకలకు వీలు ఉండదని అధికారులు అంటున్నారు. నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే మరమ్మతులు చేస్తామని ఏఈ రాజు తెలిపారు.