Vizianagaram

News August 26, 2025

విజయనగరం పోలీసులపై యాక్షన్ షురు..!

image

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుదారుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, ఐదుగురు కానిస్టేబుళ్లపై వేటు పడింది. విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్.కోట రూరల్ సీఐ రవికుమార్‌తో సహా పలువురిపై కేసులు నమోదు కాగా పలువురిని బదిలీలు చేశారు.

News August 25, 2025

రైతులే నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది: కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, జిల్లాకు సరిపడా యూరియా ఇప్పటికే అందుబాటులో ఉందని కలెక్టర్ అంబేడ్క‌ర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 32 వేల మెట్రిక్ టన్నుల వరకు పంపిణీ చేశామన్నారు. మరో 3 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం రైతులే నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు.

News August 25, 2025

విజయనగరం: ‘60% పెరిగిన మహిళా ప్రయాణికులు’

image

విజయనగరం జిల్లాలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన తొలివారం 3,26,939 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. నాలుగు రకాల బస్సుల్లో మొత్తం 6,17,206 మంది ప్రయాణించగా.. వారిలో వీరిలో 3,26,939 మంది మహిళలు ఉన్నారన్నారు. టికెట్లు తీసుకుని ప్రయాణించిన పురుషులు 2,90,499 మంది ఉన్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య 60% పెరిగినట్లు ఆమె తెలియజేశారు.

News August 25, 2025

VZM: ప్ర‌తి నెల 3వ శుక్ర‌వారం ఎంప్లాయిస్ గ్రీవెన్స్‌

image

ప్ర‌తి నెల 3వ శుక్ర‌వారం ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ సోమవారం తెలిపారు. ఎంప్లాయిస్ గ్రీవెన్స్‌ సెప్టెంబ‌రు 19న క‌లెక్ట‌రేట్‌లో జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొంటార‌ని పేర్కొన్నారు. ఉద్యోగులు త‌మ స‌మ‌స్య‌ల‌పై ఈ గ్రీవెన్స్‌లో ధ‌ర‌ఖాస్తుల‌ను అంద‌జేయ‌వ‌చ్చున‌ని సూచించారు.

News August 25, 2025

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు: కలెక్టర్

image

బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిన దృష్ట్యా రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. పిజిఆర్ఎస్ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలకు పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చెరువులు, కాల్వల గట్లు పటిష్టంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News August 25, 2025

VZM: ఏ శాఖకు ఎన్ని వినతులంటే..!

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో PGRS కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్ అంబేద్కర్, అధికారులు వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 68 వినతులు అందగా పంచాయతీశాఖకు 10, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డిఏకు 40 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 07, విద్యా శాఖకు 12, హౌసింగ్‌కు 02, వైద్య శాఖకు 05, విద్యుత్ శాఖకు 07, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి.

News August 25, 2025

ఎమ్మెల్యే కళా వెంకట్రావు సోదరడి మృతి

image

చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నయ్య నీలం నాయుడు (75) అనారోగ్య కారణంగా సోమవారం ఉదయం రేగిడిలో మృతి చెందారు. ఈయన గతంలో రేగిడి గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. స్వస్థలం రేగిడిలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నీలం నాయుడు మృతితో రేగిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 25, 2025

రామభద్రపురం: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

రామభద్రపురానికి సమీపంలో ఉన్న సిమెంట్ గోడౌన్‌లో పనిచేస్తున్న జన్నివలసకు చెందిన ఎం.శ్రీను (44) ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీను పని చేస్తున్న గోడౌన్‌లో తడి బట్టలను తాడుపై ఆరేశాడు. దగ్గరలోని కరెంటు తీగా ఉండడంతో విద్యుత్ షాక్‌కు గురై చనిపోయాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో రోడ్డున పడ్డమని సిమెంట్ గోడౌన్ యాజమాన్యం ఆదుకోవాలని వారు కోరారు.

News August 25, 2025

VZM: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్

image

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. విజయగనరం జిల్లాలో 5,68,277 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వలస వెళ్లిన లబ్ధిదరులు తమ కార్డును నమోదు చేసుకున్న రేషన్ దుకాణం తీసుకోవాలన్నారు. ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది

News August 25, 2025

డోన్స్ సహాయంతో 90 కేసులు నమోదు: SP

image

జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1520 ఓడీ కేసులు నమోదు చేశామని చెప్పారు. వాటిలో డ్రోన్స్ సహాయంతో 90 కేసులు నమోదు చేశామన్నారు.