Vizianagaram

News April 2, 2026

VZM: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎస్‌బీఐ ఆర్‌సెటీ ద్వారా గ్రామీణ మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ భాస్కరరావు తెలిపారు. ఈ నెల 6 నుంచి టైలరింగ్, ఎంబ్రాయిడరీ &ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కోర్సులు నిర్వహిస్తామన్నారు. 18-50 ఏళ్ల వయస్సు గల మహిళలు 9959521662 నంబర్‌కు ఫోన్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. భోజనం,వసతి ఉచితమని, ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేయాలని సూచించారు.

News April 1, 2026

VZM: తాగునీటి వేసవి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

image

వేసవి కాలంలో గ్రామాలు, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో సురక్షిత తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో తాగునీటి వేసవి ప్రణాళికపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఓ ప్లాంట్లు లేని పాఠశాలలు, వసతి గృహాల జాబితా సిద్ధం చేసి అవసరమైన చోట జల జీవన్ మిషన్ ద్వారా కుళాయిల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

News April 1, 2026

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకులు మెరుగుపరచాలి: VZM కలెక్టర్

image

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు మున్సిపాలిటీలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, ప్లాస్టిక్ కవర్ల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News April 1, 2026

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకులు మెరుగుపరచాలి: VZM కలెక్టర్

image

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు మున్సిపాలిటీలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, ప్లాస్టిక్ కవర్ల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News April 1, 2026

భూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో రెవెన్యూ సేవలు, భూ సర్వే ప్రక్రియలు, ప్రజల దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు వేగంగా స్పందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం నిర్వహించిన ఆన్‌లైన్ సమీక్షలో మ్యుటేషన్ల సవరణలు, 22ఏ దరఖాస్తుల పరిష్కారం, ఫారం-8 జారీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, ఈ-కేవైసీ నమోదు, వెబ్‌ల్యాండ్ పోర్టింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు.

News April 1, 2026

భూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో రెవెన్యూ సేవలు, భూ సర్వే ప్రక్రియలు, ప్రజల దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు వేగంగా స్పందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం నిర్వహించిన ఆన్‌లైన్ సమీక్షలో మ్యుటేషన్ల సవరణలు, 22ఏ దరఖాస్తుల పరిష్కారం, ఫారం-8 జారీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, ఈ-కేవైసీ నమోదు, వెబ్‌ల్యాండ్ పోర్టింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు.

News April 1, 2026

VZM జిల్లాలో రూ.1344.17 కోట్ల మద్యం తాగారు

image

విజయనగరం జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1344.17 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో మద్యం బాక్సులు18.55 లక్షలు, బీర్ బాక్సులు 9.41లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1373.66 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో ఇది 2 శాతం తగ్గింది. 2024-25తో పోలిస్తే 2025-26లో 47 శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

News April 1, 2026

VZM జిల్లాలో రూ.1344.17 కోట్ల మద్యం తాగారు

image

విజయనగరం జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1344.17 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో మద్యం బాక్సులు18.55 లక్షలు, బీర్ బాక్సులు 9.41లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1373.66 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో ఇది 2 శాతం తగ్గింది. 2024-25తో పోలిస్తే 2025-26లో 47 శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

News April 1, 2026

VZM జిల్లాలో రూ.1344.17 కోట్ల మద్యం తాగారు

image

విజయనగరం జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1344.17 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో మద్యం బాక్సులు18.55 లక్షలు, బీర్ బాక్సులు 9.41లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1373.66 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో ఇది 2 శాతం తగ్గింది. 2024-25తో పోలిస్తే 2025-26లో 47 శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

News April 1, 2026

క్రికెట్ బెట్టింగులపై కఠిన చర్యలు: VZM ఎస్పీ

image

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్రికెట్ బెట్టింగులు నిర్వహించినా, పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా SP ఏ.ఆర్.దామోదర్ మంగళవారం హెచ్చరించారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో యువత బెట్టింగుల జోలికి పోవొద్దని ఆయన సూచించారు. బెట్టింగులు చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్లు కూడా తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగులతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని SP సూచించారు.