India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1520 ఓడీ కేసులు నమోదు చేశామని చెప్పారు. వాటిలో డ్రోన్స్ సహాయంతో 90 కేసులు నమోదు చేశామన్నారు.
గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు కమిటీ సభ్యులు సహకరించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం పిలుపునిచ్చారు. అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీస నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాలు ఏర్పాటు చేస్తున్న సభ్యులు https://ganeshutsav.netలో అనుమతులు పొందాలని సూచించారు.
DSC ఫలితాల్లో విజయనగరానికి చెందిన కే.వి.ఎన్ శ్రీరాం 5 ఉద్యోగాలు సాధించాడు. SA గణితంలో 7వ ర్యాంక్, ఫిజిక్స్ 10th, జోన్ స్థాయి పోస్టులో PGT మ్యాథ్స్ 5th, TGT మ్యాథ్స్ 18th, జనరల్ సైన్స్లో 7వ ర్యాంక్ వచ్చింది. కాగా తెలంగాణ DSC పోటీ పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ మాథ్స్ సబ్జెక్టులో రాష్ట్ర స్థాయిలో 1వ ర్యాంక్ సాధించి ఖమ్మం జిల్లాలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
వంగర మండలం మరువాడ గ్రామానికి చెందిన గుంట ప్రసాద్ శుక్రవారం వెలువడిన DSC ఫలితాలలో ఎస్సిబి కేటగిరిలో ఆరు ఉద్యోగాలు సాధించారు. SA ఫిజిక్స్, SA మ్యాథ్స్, PGT ఫిజికల్ సైన్స్, TGT మ్యాథ్స్ జోన్1, TGT ఫిజిక్స్ జోన్1, TGT సైన్స్ జోన్1లలో ఉత్తీర్ణత సాధించారు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ తనను చదివించారని ప్రసాద్ తెలిపారు. ఇష్టమైన ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరుతానన్నారు.
మండల స్థాయిలో MRO, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహశీల్దార్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం ప్రకటించారు. దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, RSKలను తనిఖీ చేయిస్తామన్నారు. షాపులకు సరఫరా అయిన ఎరువులు, పంపిణీ, నిల్వలపై వారం రోజుల్లో తమకు నివేదికను అందజేయాలని ఆదేశించారు. పక్కదారి పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
విజయనగరం జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి, నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో పిసిపిఎన్డిటి చట్టం అమలుపై తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల రెన్యువల్, కొత్త వాటికి అనుమతులపై చర్చించారు. అనుమతి లేకుండా స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేయకూడదన్నారు.
పార్లమెంటు అధ్యక్షుల నియామకంలో భాగంగా తనను గుంటూరు పార్లమెంట్ స్థానానికి పరిశీలకులుగా నియమించినట్లు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రిక విడుదల చేశారు. తనపై నమ్మకం పెట్టి పరిశీలకునిగా నియమించినందుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్కి ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో నాగార్జునకి పలువురు అభినందనలు తెలిపారు.
విజయనగరం జిల్లాలో ఎరువులకు కొరత లేదని, సరిపడి నంత స్టాక్ సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. శుక్రవారం తన ఛాంబర్లో సమీక్ష జరిపారు. ప్రస్తుతం ఉన్నవివిధ పంటలకు గాను 36,740 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 25,605 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని చెప్పారు. 3వేల టన్నుల యూరియా అవసరం ఉంటుందన్నారు.
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు కార్యాలయంలో శుక్రవారం “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. ఈసందర్భంగా సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్కు దరఖాస్తు చేసుకోగా VRO రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ.లక్ష VROకి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. MRO కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.