India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డెంకాడ మండలంలోని చింతలవలస గ్రామంలో MVGR ఇంజినీరింగ్ కళాశాలకు సమీపంలో ఉన్న నీలగిరి తోటలో గంజాయి విక్రయిస్తున్న, తాగుతున్న ఏడుగురిని అరెస్టు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. స్థానిక పోలీసులు వచ్చిన పక్కా సమాచారం మేరకు రైడ్ చేయగా గంజాయి అమ్ముతున్న ముగ్గురితో పాటు, తాగుతున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారని, వారి వద్ద నుండి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
దత్తిరాజేరు మండలం పాపయ్యవలసలో గురువారం విచిత్రమైన ఆవు దూడ జన్మించింది. గేదెల రవికి చెందిన ఆవు తోక లేని దూడకు జన్మనిచ్చింది. ఆవు దూడ ఆరోగ్యంగా ఉందని యజమాని తెలిపారు. వింత ఆవు దూడ జన్మించిందని తెలియగానే స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి తరలివచ్చి ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు.
మెంటాడ మండలం జీటీ.పేట జడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్గా పనిచేస్తోన్న డా.బొంతలకోటి శంకరరావు అందరిలా కాకుండా ప్రత్యేక శైలిలో పాఠాలు బోధిస్తున్నారు. హార్మోనియం, కంజీర, కీ బోర్డు వంటి వాయిద్య పరికరాలతో పాఠాలకు సరిగమలు జోడించి, విద్యార్థులను హత్తుకునేలా బోధించడం బొంతలకోటి ప్రత్యేకత. రాష్ట్రపతి అబ్దుల్ కలాంలో పాటు మరో ఇద్దరు రాష్ట్రపతుల చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ అవార్డులను అందుకున్నారు.
విశాఖలో యువకుడికి పోక్సో కేసులో 20 ఏళ్ల శిక్షను న్యాయస్థానం విధించిన విషయం <<14024641>>తెలిసిందే<<>>. బాలిక కాల్ డేటా ఆధారంగా నరేశ్ను పోలీసులు విచారించారు. 2021 అక్టోబర్ 5 అర్ధరాత్రి బాలిక తండ్రికి మెలుకువ రాగా కుమార్తె లేదు. దీంతో చుట్టుపక్కల వెతుకుతుండగా నరేశ్ అపార్టమెంట్లో ఉన్న బాలిక తండ్రికి భయపడి అపార్ట్మెంట్ పైకి ఎక్కింది. అక్కడి నుంచి ప్రమాదవశాత్తు పడి మృతిచెందినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.
ఓ యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి ఆనందిని తీర్పునిచ్చారు. పెద్ద అగనంపూడిలో నివాసం ఉంటున్న బాలిక (13) 2021లో ఓ అపార్ట్మెంట్ పైనుంచి కిందపడి మృతిచెందింది. ఈ కేసులో ఎదురు అపార్ట్మెంట్లో ఉంటున్న విజయనగరం జిల్లాకు చెందిన నరేశ్(28)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమపేరుతో బాలికను పలుమార్లు లోబర్చుకున్నట్లు విచారణలో తేలడంతో పైవిధంగా శిక్ష విధించారు.
ప్రతి విద్యార్థి జీవితంలో ఒక గురువు ప్రభావం ఉంటుంది. విద్యార్థి భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఆ గురువు ఒక టార్చ్ బేరర్లా ఉంటాడు. అలాంటి గురువులను స్మరించుకునే ఈ రోజు గురుపూజోత్సవం జరుపుకుంటున్నాం. విజయనగరం జిల్లాలో 75 మంది, మన్యం జిల్లాలో 71 మంది ఉపాధ్యాయులకు ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సత్కరించనున్నారు. మరి మీ విద్యార్థి జీవితంలో మీకిష్టమైన ఉపాధ్యాయుడు ఎవరని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
దులీప్ ట్రోఫీ తొలిదశ మ్యాచ్లు గురువారం నుంచి బెంగళూరు, అనంతపురంలో ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నమెంటులో విశాఖకు చెందిన భరత్, నితీశ్ కుమార్ రెడ్డి, రికీబుయ్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. నితీశ్ IPLలో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణించారు. భరత్కు భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. రికీబుయ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ బ్యాటింగ్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు.
భోగాపురం మండలం ముంజేరులో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవిను కొండవెలగాడ గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కొంతమంది క్రీడాకారులు పతకాలు సాధించారు. ఈ నేపథ్యంలో కోచ్ రాము ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిశారు. మరిన్ని పతకాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో 71 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జీ.పగడాలమ్మ తెలిపారు. 10 మంది ప్రధాన ఉపాధ్యాయులు, 21 మంది స్కూల్ అసిస్టెంట్లు, 7గురు పీడీలను, 33 మంది సెకండ్ గ్రేడ్ టీచర్లను జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామన్నారు. వీరందరికీ కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక అయిన ఉపాధ్యాయులకు అవార్డులు బహుకరించబడుతున్నాయని డి.ఈ.ఒ. ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎంపికైన 75 మంది ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకులు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు గురువారం ఉ.9గంటలకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో అవార్డు బహుకరణకు హాజరు కావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.