Vizianagaram

News August 18, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్క‌ర్ సోమవారం సూచించారు. గ్రామాల్లో పర్యటించి పరిస్థితులపై నివేదికలు సమర్పించాలని, పారిశుద్ధ్య వ్యవస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. నాగావళి పరివాహక ప్రాంతాలైన సంతకవిటి, రేగిడి, వంగర, ఆర్.ఆముదాలవలస మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

News August 18, 2025

VZM: అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు

image

భారీ వర్షాలు కారణంగా జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ఉన్నతాధికారులు నేడు సెలవు ప్రకటించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినప్పటికీ.. అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటనపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో యూనియన్ ప్రతినిధులు ఉన్నతాధికారులను సంప్రదించగా నేడు సెలవును ప్రకటించినట్లు తెలిసింది.

News August 18, 2025

VZM: మీ పింఛన్ ఆగిందా? ఇలా చేయండి..!

image

దివ్యాంగులు, మెడికల్ పింఛన్లు రద్దైన లబ్ధిదారులకు అప్పీలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా DRDA కార్యాలయం ఆదివారం తెలిపింది. రీ వెరిఫికేషన్ అనంతరం అనర్హులుగా గుర్తించిన వారు నోటీస్ అందుకున్న 30రోజుల్లోగా అప్పీలు చేయాల్సి ఉందని వెల్లడించింది. పాత సదరంతో పాటు నోటీస్ తీసుకొని సమీప ఏరియా ఆసుపత్రికి వెళ్లి వెరిఫై చేయించుకోవాలని,నిబంధనల ప్రకారం మళ్లీ సర్టిఫికెట్ పొందాలని సూచించింది.

News August 18, 2025

ఈ ఏడాదిలో రూ.25.21 లక్షల సీజ్: VZM SP

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరుకు పేకాట, కోడి పందెలుపై జరిపిన దాడుల్లో మొత్తం రూ.25,21,077 సీజ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై 141 కేసులు నమోదు చేసి 1031 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కోడిపందాలు ఆడుతున్న వారిపై 35 కేసులు నమోదు చేసి 174 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 75 పందెం కోళ్లు, నాలుగు పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

News August 17, 2025

‘విజయనగరం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు రేపు సెలవు’

image

విజయనగరం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు గమనించాలని కోరారు.

News August 17, 2025

జర్నలిస్ట్‌లకు త్వరలో క్యూఆర్ కోడ్‌తో పాస్‌లు: SP

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో ప్రత్యేక పాస్‌లు మంజూరు చేస్తామని ఎస్పీ వకుల్ జిందల్ ప్రకటించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో APUWJ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ఆదివారం హాజరయ్యారు. జర్నలిస్ట్‌లకు క్యూఆర్ కోడ్‌తో కూడిన వెహికల్ పాస్‌లు మంజూరు చేసి పోలీస్ సిబ్బందికి తగు సూచనలు జారీ చేస్తామన్నారు. పోలీసులకు జర్నలిస్టుల సహకారం గొప్పదని పేర్కొన్నారు.

News August 17, 2025

కొత్తవలసలో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రం నాటికి కొత్తవలసలో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ASO రామకృష్ణ రాజు తెలిపారు. బొండపల్లి 10.6mm, గంట్యాడ 17.6mm, ఎస్ కోట 32.6mm, వేపాడ 80.6mm, ఎల్.కోట 49.6mm, కొత్తవలస 124mm, జామి 14mm, విజయనగరం 35mm, నెల్లిమర్ల 8.4mm, పూసపాటిరేగ 26.8mm, డెంకాడ 18.2mm, భోగాపురం 41.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.

News August 17, 2025

సంతకవిటి: నాగావళి నదిలో వృద్ధుడు గల్లంతు

image

బహిర్భూమికి వెళ్లి నాగవళి నదిలో ప్రమాదవశాత్తూ జారిపడి వృద్ధుడు గల్లంతైన ఘటన ఆదివారం సంతకవిటి మండలంలో జరిగింది. మండలంలోని పొడలి గ్రామానికి చెందిన ఉరదండ పోలయ్య (76) ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది తీరానికి వెళ్లాడు. ఎప్పటికీ రాకపోవడంతో వృద్ధుడి కోసం కుటుంబీకులు వెతికానా దొరకలేదు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టారు.

News August 17, 2025

విజయనగరం స్పా సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు

image

విజయనగరం పట్టణంలోని పలు స్పా సెంటర్లో శనివారం రాత్రి విజయనగరం వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కె చౌదరి ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు బయటపడలేదని, స్పా సెంటర్ల నిర్వహణకు తగిన సూచనలు ఇచ్చామన్నారు. స్పా సెంటర్లు కార్యకలాపాలను పూర్తిగా పారదర్శకంగా చట్టబద్ధంగా కొనసాగించాలని సూచించారు. సెంటర్లకు సంబంధించి రికార్డులు, సీసీ ఫుటేజీలను పరిశీలించామన్నారు.

News August 17, 2025

VZM: కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి

image

PGRS అర్జీదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం సూచించారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఆ నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను కూడా సంప్రదించవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.