India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారీ వర్ష సూచనల మేరకు సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్ష సూచన ఉందని, ఇతర ప్రాంతాల నుంచి రావడంలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని, అందుకే గ్రీవెన్స్ రద్దు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్ గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉండే గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ వర్షం పడే సమయంలో చెట్ల దగ్గరకు వెళ్లకండి
➤ తడిగా ఉండే స్తంభాలను పట్టుకోకండి
➤ నదులు, కాలువలు ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ విజయనగరం కంట్రోల్ రూమ్ నెం.08922 236947, మన్యం జిల్లా 08963 293046
జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్ గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉండే గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ వర్షం పడే సమయంలో చెట్ల దగ్గరకు వెళ్లకండి
➤ తడిగా ఉండే స్తంభాలను పట్టుకోకండి
➤ నదులు, కాలువలు ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ విజయనగరం కంట్రోల్ రూమ్ నెం.08922 236947, మన్యం జిల్లా 08963 293046
జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్ గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉండే గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ వర్షం పడే సమయంలో చెట్ల దగ్గరకు వెళ్లకండి
➤ తడిగా ఉండే స్తంభాలను పట్టుకోకండి
➤ నదులు, కాలువలు ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ విజయనగరం కంట్రోల్ రూమ్ నెం.08922 236947, మన్యం జిల్లా 08963 293046
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు రేపు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, మూసివేయాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రమాదవశాత్తు వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బొండపల్లి SI మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన కంది అప్పలనరసమ్మ (75) ఆగస్టు 30 రాత్రి నుంచి కనిపించలేదని, 31వ తేదీన పెన్షన్ కూడా అందుకోలేదని అన్నారు. గ్రామ పరిధిలో గల బాడి చెరువులో అప్పలనరసమ్మ మృతదేహం తేలింది, మనవడు శ్రీనివాసరావు తెలపడంతో పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు.
వర్షాల వల్ల పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఆదివారం బయలుదేరాల్సిన విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖ సికింద్రాబాద్ గరీబ్ రథ్, విశాఖ లోకమాన్య తిలక్, విశాఖ మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్, మహబూబ్ నగర్ విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను రద్దు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్, సికింద్రాబాద్-హౌరా ఫలక్ నామాను రద్దు చేశారు.
విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ను ఆదివారం రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్ పరిధిలో రాయనపాడు రైల్వే స్టేషన్లో వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా ఈ ట్రైన్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
విజయనగరం కన్నా పార్వతీపురం జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైంది. మన్యంలో ఆగస్టు 29న 25.4 మి.మీ. కురవగా, 30న 6.8 మి.మీ వాన కురిసింది. విజయనగరం జిల్లాలో 29న 33.7 మి.మీ నమోదు కాగా, 30న 13.6 మి.మీ వాన కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా ఎల్.కోట మండ 37.2 మి.మీ వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలో ఆగస్టు 30 వరకు సాధారణ వర్షపాతం 181 మి.మీ కాగా, శనివారం 157 మి.మీ వర్షపాతం నమోదయింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో విద్యను అభ్యసించేందుకు ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు కేంద్రం డైరెక్టర్ ఆచార్య ఎస్ విజయమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.