India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఈ నేపథ్యంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 08922 236947, విజయనగరం డివిజన్ కంట్రోల్ రూమ్ 08922 276888, బొబ్బిలి డివిజన్ కంట్రోల్ రూమ్ 9390440932, చీపురుపల్లి కంట్రోల్ రూమ్ 7382286268 నంబర్లను కేటాయించామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మౌలిక వసతులను కల్పించే పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. విమానాశ్రయానికి వసతుల కల్పన, భూ సేకరణ తదితర అంశాలపై తన ఛాంబర్లో శనివారం సమీక్షించారు. ఎయిర్పోర్టుకు నీటిని అందించేందుకు సుమారు రూ.20కోట్లతో చేపట్టిన పనులపై ఆరా తీశారు. ఈ పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ఉపకరణాలు పట్ల జాగ్రత్తగా ఉండాలని, తడిసిన విద్యుత్ స్తంభాలు, తెగి పడిన విద్యుత్ తీగలను నేరుగా తాకరాదని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు గుర్తిస్తే కంట్రోల్ రూమ్ నంబర్ 949061012 అందుబాటులో ఉంటుందన్నారు.
ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు పనిచేస్తాయని ఆయన చెప్పారు. వర్షాల కారణంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్ గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉండే గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ వర్షం పడే సమయంలో చెట్ల దగ్గరకు వెళ్లకండి
➤ తడిగా ఉండే స్తంభాలను పట్టుకోకండి
➤ నదులు, కాలువలు ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ విజయనగరం కంట్రోల్ రూమ్ నెం.08922 236947, మన్యం జిల్లా 08963 293046
వాయుగుండం కారణంగా రానున్న మూడు రోజులపాటు విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ నెం. 08922 236947 ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రైవేటు మద్యం దుకాణాలను అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న 18వేల మంది సేల్స్మెన్, సూపర్వైజర్లు తమ ఉద్యోగాలకు ముప్పు కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా వచ్చే నెల సెప్టెంబరు 7న ప్రభుత్వ మద్యం దుకాణాల బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. మా ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరారు.
గరివిడి మండలంలోని కొండపాలెంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ శనివారం పర్యటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడి ఏ మేరకు పంపిణీ చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. శత శాతం పింఛన్ల పంపిణీ జరగాలని ఆదేశించారు.
దేశంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలలో విజయనగరం ఉందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. జాతీయ స్వచ్ఛ గాలి కార్య క్రమం అమలుపై శుక్రవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా రూ.2.65 కోట్లతో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రూ.4.5 కోట్లు ఖర్చు చేశారని, ఈ మేరకు వచ్చిన ఫలితాలను తెలియజేయాలన్నారు. కాలుష్య కారకాలను నియంత్రించాలన్నారు.
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో ఉన్న మత్స్యకారులు వేటకు వద్దని మత్స్యశాఖ డీడీ నిర్మలాకుమారి సూచనలు చేశారు.
Sorry, no posts matched your criteria.