India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2022లో గుర్ల PSలో నమోదైన పొక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. తన బిడ్డ కనిపించడం లేదని ఓ మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బాలిక ఆచూకీ కనుగొన్నామన్నారు. పెనుబర్తికి చెందిన గుడిశ సూర్యనారాయణ అనే యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసినట్లు గుర్తించామన్నారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.
ద్వారకా బస్టాండ్లో విశాఖ-పలాస ప్లాట్ఫాం వద్ద శ్రీకాకుళం డిపో-1కు చెందిన బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి ఢీకొట్టిన ఘటనలో మహిళ మృతి చెందింది. మృతురాలు విజయనగరం(D) ఎస్.కోట(M) పోతనాపల్లికి చెందిన ముత్యాలమ్మ(45)గా గుర్తించారు. గాజువాక గోపాలరెడ్డిపేటలో ఉన్న మనవడి(పెద్ద కుమార్తె కొడుకు) అన్నప్రాసన నిన్న జరగ్గా వచ్చింది. తిరిగి ఇంటి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా.. ఈమె అక్కయ్యపాలెంలో ఓ హోటల్లో పనిచేస్తోంది.
ఎస్.కోట మండలం దెప్పూరు గిరిజన గ్రామాన్ని తమకు తెలియకుండా అమ్మేశారని గ్రామస్థులు విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. జిందాల్ కంపెనీ పేరిన రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందన్నారు. కిల్తంపాలెం పంచాయతీలో ఉన్న ఈ గ్రామంలో 13 కుటుంబాల వారు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నా తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ జరిగిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.
ఆగస్టు 15 నాటికి 50వేల బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. వివిధ అంశాలపై ఆన్లైన్ సమావేశం ద్వారా కలెక్టర్ సోమవారం సమీక్షించారు. జిల్లాలో మొదట 67,066 బంగారు కుటుంబాలను గుర్తించగా, వడపోతల అనంతరం ఆ సంఖ్య 60,612కు తగ్గిందని కలెక్టర్ చెప్పారు. ఇంకా ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించాలని సూచించారు.
కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులతో భూముల రీసర్వే పై JC సేతుమాధవన్ సోమవారం సమీక్ష జరిపారు. గ్రామాల, ప్రభుత్వ భూముల, సంస్థల, అతుకుబడి భూములు, సరిహద్దులను నిర్ణయించడానికి నవంబర్ నెల లోపల రీసర్వే జరపనున్నట్లు తెలిపారు. ఆయా శాఖల భూముల్ని రీ సర్వే చేసుకొని సరిహద్దులను నిర్ణయించుకోవాలన్నారు. ఆయ శాఖల అధికారులు బాధ్యత వహించాల్సి ఉందని, లేని యెడల తదుపరి సమస్యలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
విజయనగరం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించిన PGRSకు 149 వినతులు అందాయి. వాటిలో భూ సమస్యలకు సంభందించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 52 వినతులు అందాయి. పంచాయతిశాఖకు 6, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 27 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 8, విద్యాశాఖకు 8 అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవన్నారు. ఫిర్యాదులను కలెక్టర్ అంబేడ్కర్తో పాటు ఇతరులు స్వీకరించారు.
విజయనగరం జిల్లా పోలీసు కార్యాయంలో ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. బాధితుల నుంచి 37 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన ఆయన సమస్యలను వారం రోజులలోపు పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశించారు.
జిల్లాలో ఖరీఫ్లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 91,214 హెక్టార్లకు గాను ఇప్పటివరకు 44,231 హెక్టార్లలో ఉబాలు జరిగాయని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. సోమవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని పంటలు కలిపి సాధారణ సాగు విస్తీర్ణం 1,16,993 హెక్టార్లకు గాను, ఇప్పటివరకు 61,922 సాగు అయ్యాయని తెలిపారు. సుమారు 60 శాతం సాగు విస్తీర్ణానికి కాలువల ద్వారా సాగునీరు అందుతోందన్నారు.
కారణం లేకుండా అర్ధరాత్రి వేళల్లో బయట తిరిగితే కేసులు తప్పవని SP వకుల్ జిందల్ ఆదివారం హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి నేటి వరుకు 3,573 మందిపై టౌన్ న్యూసెన్స్ కేసులు నమోదు చేశామన్నారు. నేరాల నియంత్రణకు కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. జిల్లా కేంద్రంతో పాటు బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాం పట్టణాల్లో CI స్థాయి అధికారితో పెట్రోలింగ్ జరుపుతున్నామన్నారు. తనిఖీల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.