India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్తవలస మండలం కంటకాపల్లి కొత్తూరుకు చెందిన దుక్క రాధాకృష్ణ(18) కంటకాపల్లి జీడీ పిక్కల ఫ్యాక్టరీ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాధాకృష్ణ ఈనెల 9 నుంచి కనిపించట్లేదని తల్లిదండ్రులు తెలిపారు. బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థులకు మృతదేహం కనబడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్.ఐ షణ్ముఖరావు సమక్షంలో పోలీసులు విచారణ చేయగా రాధాకృష్ణ మృతదేహంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బొబ్బిలి మండలంలోని దిబ్బగుడ్డివలస ఎల్సీ రైల్వే గేటు సమీపంలో రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెచ్సీ బి.ఈశ్వరరావు తెలిపారు. మృతుడికి సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణదాసు మనుమరాలు కామేశ్వరమ్మ (88) శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఈ రోజు ఉదయం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు, కళాకారులు, పట్టణ ప్రముఖులు సంతాపం తెలిపారు. హరికథాగానం అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన నారాయణదాసు వంశీకులు ఇప్పటికి కూడా విజయనగరంలో ఉండటం విశేషం.
రాష్ట్ర వ్యాప్తంగా 11 నగరాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా ఆయా నగరాల్లో వనాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ జాబితాలో నెల్లిమర్లకు చోటు దక్కడంతో నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన కొండవెలగాడ రహదారిలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ప్రకటించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదివారం జిల్లాకు రానున్నారు. ఉదయం 10-00 గంటలకు విజయనగరం చేరుకుంటారని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుతో పాటు జిల్లా అధికారులు కేంద్ర సహాయ మంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తారని చెప్పారు.
ఆగష్టు 26న కృష్ణాష్టమి సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఉత్తర్వులు జారీ చేయడంతో విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతీ సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (గ్రీవెన్స్ సెల్) రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో ఇప్పటికీ 48,469.5 మెట్రిక్ టన్నుల ఇసుక వినియోగదారులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని గనులశాఖ ఉప సంచాలకులు సి.హెచ్.సూర్యచంద్రావు తెలిపారు. శనివారం నాడు ఇసుక కోసం జిల్లాలో 59 ఆర్డర్లు చేయగా వారందరికీ 924.5 మెట్రిక్ టన్నుల ఇసుకను బొబ్బిలిలోని ఇసుక డిపో ద్వారా సరఫరా చేశామన్నారు. ఛార్జీల కింద ఒక్కో టన్నుపై రూ.605 మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నామన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జియమ్మవలస మండలం బట్టలభద్ర గ్రామంలో డెంగ్యూ జ్వరంతో 24 గంటల వ్యవధిలో తల్లీకూతురు మృతి చెందడం కలకలం రేపింది. తల్లి మేరువ దుర్గమ్మ (40) కూతురు చైతన్య (20) డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మృతి చెందారు. డెంగ్యూ జ్వరాల నియంత్రణకు అధికారులు చేపడుతున్న చర్యలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో ఈనెల 30వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే వరలక్ష్మి వ్రతం పూర్తిగా ఉచితమని పేర్కొన్నారు. భక్తులకు ఆ రోజు కొండ దిగువ నుంచి కొండపై వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు కుంకుమ, జాకెట్, ప్రసాదం ఉచితంగా అందిస్తామన్నారు. స్వామివారి దర్శనం కూడా ఉచితంగా కల్పిస్తామన్నారు.
పొలం నుంచి మిల్లర్కు వెళ్లే వరకు అవసరాలన్నింటినీ ఏర్పాటు చేసుకొని ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కొనుగోళ్లకు అవసరమగు వాహనాలు, సంచులు, హమాలీలు, తేమ యంత్రాలు, గోడౌన్ సామర్థ్యం, బ్యాంకు గ్యారంటీలు, తూనిక యంత్రాలు తదితర సామగ్రిని నెల రోజుల ముందే ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల పై సమావేశమయ్యారు.
Sorry, no posts matched your criteria.