Vizianagaram

News August 17, 2024

విజయనగరంలో టైక్వాండో పోటీలు ప్రారంభం

image

న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో టైక్వాండో అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీలను మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టైక్వాండో క్రీడ రోజురోజుకు ప్రాచుర్యం పొందుతోందన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు.

News August 17, 2024

మక్కువలో మంత్రి సంధ్యారాణికి ఘన స్వాగతం

image

ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శనివారం మొదటిసారి తన సొంత మండలానికి వచ్చిన గుమ్మిడి సంధ్యారాణికి ఘన స్వాగతం లభించింది. అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికి, దారి పొడవునా పూలు చల్లారు. మజ్జి గౌరమ్మ తల్లి గుడి నుంచి 4రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చాలా కాలం పాటు పదవిలో లేకపోయినా, తన వెన్నంటే ఉండి గెలిపించిన వారందరినీ మరవనని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

News August 17, 2024

విజయనగరం అడిషనల్ ఎస్పీ బదిలీ

image

విజయనగరం అడిషనల్ ఎస్పీ(అడ్మినిస్ట్రేషన్) ఆస్మా ఫర్హీన్ బదిలీ అయ్యారు. ఆమెను సీఐడీ ఆఫీసులో ఎస్పీగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆమె స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతానికి అడిషనల్  ఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది.

News August 17, 2024

విజయనగరంలో అన్న క్యాంటీన్లపై మీ కామెంట్..!

image

విజయనగరం జిల్లాలో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలో రెండు చోట్ల క్యాంటీన్లను ఓపెన్ చేశారు. మరికొద్ది రోజుల్లో మన్యం జిల్లాలోనూ ప్రారంభించనున్నారు. తొలిరోజు విజయనగరంలో క్యాంటీన్ల వద్ద రద్దీ కనపడింది. ఇంతకీ ఈ క్యాంటీన్లలో మీరు భోజనం చేశారా? రుచి ఎలా ఉంది? ప్రజలకు ఉపయోగపడే ప్రాంతాల్లో క్యాంటీన్లు పెట్టారా? ఇంకా ఎక్కడెక్కడ క్యాంటీన్లు పెట్టాలి? అనేది మీరు కామెంట్ చేయండి.

News August 17, 2024

MLCగా బొత్సకు మూడేళ్లే అవకాశం..!

image

ఎమ్మెల్సీ పదవీ కాలం ఆరేళ్లు ఉంటుంది. కానీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ మూడేళ్ల తర్వాత మాజీ అవుతారు. దీనికి ప్రధాన కారణం ఉపఎన్నిక. వైసీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ జనసేనలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఈక్రమంలోనే ఉపఎన్నిక వచ్చింది. నిబంధనల ప్రకారం ముందుగా ఎన్నికైన వ్యక్తి ఆరేళ్లలో ఎన్నిరోజులు పదవిలో ఉంటారో అవి మినహాయించి కొత్త వ్యక్తి పదవీకాలం ఉంటుంది.

News August 17, 2024

VZM: తెలుగు రాకపోవడంతోనే చనిపోయారు..!

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీచర్లు వాగులో <<13872165>>గల్లంతైన<<>> విషయం తెలిసిందే. హర్యానాకు చెందిన మహేశ్, ఆర్తి పాచిపెంట(M) సరాయివలస ఏకలవ్య పాఠశాలలో 45 రోజుల క్రితమే ఉద్యోగంలో చేరారు. విధులు ముగించుకుని బైకుపై సాలూరుకు బయల్దేరారు. మధ్యలో వాగు పొంగింది. దానిని దాటవద్దని అక్కడి ప్రజలు చెప్పినా.. తెలుగు రాకపోవడంతో వాగు దాటేందుకు ప్రయత్నించి గల్లంతయ్యారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా మహేశ్ కోసం గాలిస్తున్నారు.

News August 17, 2024

VZM: రేపు జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు బంద్

image

కోల్‌కతాలో ట్రైనీ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన కారణంగా రేపు ఉ.6 గంటల నుంచి ఆదివారం ఉ.6 గంటల వరకు దేశవ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు IMA వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైద్యులు నిరసనలతో 24 గంటలు పాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.

News August 16, 2024

విజయనగరం: ట్రైన్ ఢీకొని యువకుడు మృతి

image

రైలు ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు శుక్రవారం విజయనగరం రైల్వే పోలీసులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బలిరెడ్డి సురేష్ (26) పెద్దామనాపురంలోని తన నాన్నమ్మ ఇంటికి వెళుతుండగా పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొట్టిందని తెలిపారు. దీంతో అతను తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు బొబ్బిలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 16, 2024

పాచిపెంట: ఉపాధ్యాయురాలు మృతి

image

పాచిపెంట మండలం రాయిమానుగెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. సారాయివలస ఏకలవ్య పాఠశాలలో ఉపాధ్యాయులుగా మహేశ్, ఆర్తీ పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని బైక్‌పై వస్తుండగా మార్గ మధ్యలో గడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో నదిలో కొట్టుకుపోయారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా, మహేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News August 16, 2024

ఈవీఎంలపై మాజీ ఉప ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

image

ఈవీఎంలపై మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం సాలూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని మెజారిటీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, 2019లో చంద్రబాబు కూడా ఈవీఎంలను వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఈ సారి ఫలితాలు మరింత బలాన్ని చేకూర్చాయని, బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలన్నారు.