Vizianagaram

News February 28, 2025

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: కిమిడి

image

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యంగా ఉందన్నారు. రాష్ట్రం పూర్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. రూ.3,22,359 కోట్లతో ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసి, స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసిందన్నారు.

News February 28, 2025

NDPS కేసుల్లో హిస్టరీ సీట్లు తెరవాలి: SP

image

విజయనగరం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో నిందితులకు హిస్టరీ సీట్లు తెరవాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియా కేసులపై దృష్టి సారించాలని సూచించారు.

News February 28, 2025

రెండు రోజుల్లో 24 మందిపై కేసు: VZM ఎస్పీ

image

విజయనగరం సిటీ పరిధిలోని రెండు రోజుల్లో 24 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. పట్టణంలో పట్టుబడిన నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ రూ.10 వేలు చొప్పున మొత్తం రూ. 2.40 లక్షల జరిమానా విధించారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 28, 2025

ఏప్రిల్ 1 నాటికి మానాపురం ఫ్లైఓవర్ పూర్తి కావాలి: కలెక్టర్

image

మానాపురం ఫ్లైఓవర్ ఏప్రిల్ నాటికి ప్రారంభం అయ్యేలా పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ అంబేడ్క‌ర్ తెలిపారు. శుక్రవారం ఆయన ఛాంబర్‌లో నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బి అధికారులు, కాంట్రాక్టర్‌లతో ఆర్.ఓ.బి పనులపై సమీక్షించారు. మార్చి లోపల మిగిలిన 18 శాతం పూర్తి చేసి ఏప్రిల్ 1 నాటికి ప్రారంభించడానికి సిద్ధం చేయాలనీ ఆదేశించారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

News February 28, 2025

చీపురుపల్లి జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవే..!

image

➤ మార్చి 2న ఉదయం నేత్రోత్సవం, పాలధార ఉత్సవం, సాయంత్రం భామా కలాపం పేరిట భాగవతం ప్రదర్శన
➤ మార్చి 2న రాత్రి 7గంటలకు రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు
➤ 3న సాయంత్రం క్లాసికల్ డాన్స్ ప్రోగ్రాం, ప్రముఖ సినీ గాయకులచే స్వరాభిషేకం, బాలు రైడర్స్ ఆధ్వర్యంలో డాన్స్ ఈవెంట్
➤ 4న రాత్రి ఢీ డ్యాన్సర్లతో మెగా డాన్స్ హంగామా, 11 గంటలకు భారీ మందుగుండు ప్రదర్శన, శ్రీరామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకం

News February 28, 2025

VZM: పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు

image

విజయనగరంలో ఓ యువకుడు పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. CI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నెయ్యిల వీధికి చెందిన పి.సాయికి మార్చిలో వివాహం జరగాల్సి ఉంది. కాగా ఈనెల 24 ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తల్లికి ఫోన్ చేసి పెళ్లి ఇష్టం లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. యువకుడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ CI కేసు దర్యాప్తు చేపట్టారు.

News February 28, 2025

VZM: మెడికల్ స్టోర్ ముందే కుప్పకూలిపోయాడు

image

విశాఖలో విజయనగరం జిల్లా వాసి గురువారం మృతిచెందాడు. డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో మెడికల్ స్టోర్ వద్దకు వచ్చి మందులు తీసుకునే సమయంలో ఓ వ్యక్తి కుప్పకూపోయాడు. స్థానికులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అతడు మృతిచెందినట్లు తెలిపారు. అతని వద్ద మందుల చీటీ మాత్రమే ఉండడంతో టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి మెరకముడిదాం మండలానికి చెందిన రమణ (60)గా గుర్తించారు.

News February 27, 2025

మెరకముడదాంలో వందశాతం పోలింగ్

image

మెరకముడిదాం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. ఈ ఎన్నికలలో 100% పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. మెరకముడిదం మండలంలో మొత్తం 55 ఓట్లు ఉండగా మెుత్తం 55 ఓట్లు నమోదైయాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగలేదని ఓటింగ్ ప్రశాంతంగా అయిందని అధికారులు తెలిపారు.

News February 27, 2025

భోగాపురంలో చీటీల పేరుతో మోసం.. భార్యాభర్తల అరెస్ట్

image

భోగాపురంలో చీటీల పేరుతో మోసం చేసిన కేసులో భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. భోగాపురంలో ఉంటున్న భార్యాభర్తలు తులసీ, మురళీ చీటీలు నిర్వహించేవారు. చీటీ పూర్తయిన వారికి డబ్బులు చెల్లించకుండా పరారీలో ఉన్నారు. దీంతో రూ.30 కోట్ల వరకు నష్టపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దార్యాప్తు చేపట్టారు. పోలీసులు ఈనెల 25న రాజమహేంద్రవరంలో వీరిని అదుపులోకి తీసుకొని బుధవారం విజయనగరం కోర్టులో హాజరుపరిచారు.

News February 27, 2025

విజయనగరం: ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

image

విజయనగరంలో ఓ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్‌లో ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య గణేశ్ ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.