India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శిగా బొద్దల సత్యనారాయణను నియమిస్తూ అధిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు సత్యనారాయణ కృతజ్ఞతలు చెప్పారు. బొబ్బిలి మండలం ముత్తావలస గ్రామానికి చెందిన సత్యనారాయణ సర్పంచిగా పని చేశారు. వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
గరివిడి మండలంలోని కొండదాడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామారావు(50) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పాఠశాలలో ప్రార్థన ముగిసిన తరువాత అసౌకర్యంగా ఉండడంతో రామారావు బాత్ రూమ్ కు వెళ్లారు. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
విజయనగరం జిల్లాలో టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా ఉన్న ప్రైవేటు భవనాల్లో ఉంటున్న అంగన్వాడీ కేంద్రాలను ఖాళీ చేయించాలని కలెక్టర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. వారిని కొత్త భవనాల్లోకి మార్చాలని విద్యుత్ శాఖా, విద్యాశాఖాధికారులకు ఆయన సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం లేని జాబితాను అందించాలన్నారు.
మహా కుంభమేళాకు శుక్రవారం విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి 70 మంది భక్తులతో రెండు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరాయి. జిల్లా ప్రజా రవాణాధికారి సీ హెచ్. అప్పలనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. కుంభమేళా త్రివేణి సంగమం దర్శించుకుని 27వ తేదీన విజయనగరం చేరుకుంటారని డిపో మేనేజరు శ్రీనివాసరావు తెలిపారు. ఆర్టీసీ ఆదరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
విజయనగరం జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదని పశుసంవర్ధక శాఖ జేడీ వైవీ రమణ స్పష్టం చేశారు. కోళ్ల ఫారాల్లో జీవభద్రత చర్యలపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ‘జిల్లాలో గుడ్లు, మాంసం రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాం. అందరూ చికెన్, గుడ్లు తినవచ్చు’ అని జేడీ సూచించారు. డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ ఎంబీవీ ప్రకాశ్ పాల్గొన్నారు.
భీమిలి పరిధిలో 2023 నవంబర్ 6న జరిగిన దొంగతనం కేసులో ఓ యువకుడికి జైలుశిక్ష పడింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గొండేయపాలేనికి చెందిన ఎర్నింటి కృష్ణబాబు(22) తగరపువలస పరిధిలోని వైటీవై ఎలైట్ అపార్ట్మెంట్లో వాత్సాయి నరసింహారాజు నివాసంలో రూ.లక్ష నగదు దొంగలించారు. భీమిలి పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం నిరూపణ కావడంతో భీమిలి కోర్టు జడ్జి నిందితుడికి సంవత్సరం జైలుశిక్ష విధించారు.
ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాలు, వివిధ శాఖల ద్వారా అందుతున్న సేవలపై ప్రధాన కార్యదర్శి విజయానంద్ ర్యాంకులను విడుదల చేశారు. మద్యం నిర్వహణలో 1వ ర్యాంక్, ఘన వ్యర్ధాల నిర్వహణలో 2వ ర్యాంక్, ఆసుపత్రుల్లో సేవలకు 5వ ర్యాంక్, ఆర్టీసీ బస్ స్టేషన్ల నిర్వహణలో 1వ ర్యాంక్, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో 5వ ర్యాంక్, రేషన్ సరుకుల పంపిణీలో 7వ ర్యాంక్, పింఛన్ల పంపిణీలో 18వ ర్యాంక్, అన్న కాంటీన్లకు 25వ ర్యాంక్ లభించాయి.
ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాలు, వివిధ శాఖల ద్వారా అందుతున్న సేవలపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. మద్యం షాపుల నిర్వహణలో జిల్లాకు మొదటి ర్యాంక్ లభించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం తెలిపారు. మద్యం షాపుల నిర్వహణలో ప్రజల్లో సంతృప్తి శాతం అధికంగా ఉన్న జిల్లాల్లో విజయనగరం మొదటి స్థానంలో ఉందన్నారు. నాణ్యమైన మద్యం, మంచి బ్రాండ్ లు, MRP అంశాలపై ర్యాంక్ ప్రకటించామన్నారు.
నేడు పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యుల పరామర్శ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పాలకొండ పట్టణానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి హెలిప్యాడ్ స్థలాన్ని పాలవలస ధవళేశ్వరరావు, రాజాం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ డా. తలే.రాజేశ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్గా కె.అప్పలరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ అప్పలరాజు మాట్లాడుతూ.. కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో, తోటి సిబ్బంది సమన్వయంతో నగరాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా ఆదాయ రాబడిపై దృష్టి సారిస్తానని, పన్ను వసూళ్లు లక్ష్యాలను అధిగమించే దిశగా పని చేస్తానన్నారు.
Sorry, no posts matched your criteria.