India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నిన్న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. 2024 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆయన ఆస్తులు రూ.73.14 లక్షలు, అప్పులు రూ.95 లక్షలు మేర పెరిగాయి. మేలో ఆయన రూ.73.14 లక్షల విలువైన ఆస్తులు కొనుగోలు చేశారు.
భూ సంబంధిత సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే లక్ష్యంతో ఆగస్టు 15 నుంచి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. జిల్లాలోని తాశిల్దార్లు, ఎంపిడిఓలు, ఇతర సిబ్బందితో కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం గొప్ప ఆశయంతో, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ సదస్సులను విజయవంతం చేయాలన్నారు.
జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు విజయనగరం వన్ టౌన్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా పశువుల కబేళాపై రైడ్ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటోన్మెంట్ ఏరియాలో స్లాటర్ హౌస్లో ఈ తనిఖీలు జరిగాయి. 1100 కేజీల గోమాంసంతో పాటు 13 కోసిన, 37 జీవంతో ఉన్న ఆవులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈనెల 20న పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల డిగ్రీ, పీజీతో పాటు ఆక్వా కల్చర్, మైక్రో బయాలజీ చదువుకున్న వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్లు జిరాక్స్తో పాటు ఒక పాస్ పోర్టు సైజ్ ఫొటోతో ఉ.9 గంటలకు హాజరవ్వాలని సూచించారు.
గత ఆరు నెలలుగా నిలిపివేసిన గుంటూరు – రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్ సర్వీస్లు పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు విజయనగరం, పార్వతీపురంతో పాటు పలు చోట్ల ఆగనుంది. రైలును పునరుద్ధరించడంతో జిల్లా వాసులకు, ముఖ్యంగా గిరిజన ప్రాంత వాసులకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ నిర్ణయంపై ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
విజయనగరం వాసి ఎం.వెంకటేశ్ 15 రోజులు కిందట తూ.గో జిల్లాకు చెందిన ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. బాలికలను కాకినాడలోని హాస్టల్లో వదులుతానని తీసుకుపోయినట్లు వారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధవళేశ్వరం సీఐ గణేశ్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వారు నెల్లూరులో ఉన్నట్లు గుర్తించి నిందితుడికి అదుపులోకి తీసుకున్నట్లు సమచారం.
జియ్యమ్మవలస మండలం గౌరీపురంలో ఆదివారం పెళ్లింట విషాదం నెలకొంది. విద్యుత్ షాక్తో పెళ్లికుమారుడి సోదరుడు చంద్రశేఖర్ మృతి చెందాడు. తండ్రి లేకపోవడంతో తమ్ముడు లక్ష్మణరావు పెళ్లిని దగ్గరుండి చంద్రశేఖర్ చేయిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
విజయనగరం రైల్వే స్టేషన్ 4వ ప్లాట్ఫాంపై సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న పురుషుడి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు. అనారోగ్యంతో చనిపోయినట్లు భావిస్తున్నారు. మృతుడు నీలం రంగు హాఫ్ హ్యాండ్ షర్ట్, కాఫీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. వివరాలు తెలిసినవారు విజయనగరం జీఆర్పీ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో మతాలను, కులాలను రెచ్చగొడుతూ ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. దీనిని పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా సీటు కోల్పోయిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. S.కోట నుంచి గొంప కృష్ణ, చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున, నెల్లిమర్ల నుంచి కర్రోతు బంగార్రాజు, బొబ్బిలి నుంచి తెంటు లక్ష్ము నాయుడు పదవులు ఆశిస్తున్నారు. జనసేన, బీజేపీ నుంచి పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.