India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దత్తత తీసుకున్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఫోస్టర్ అడాప్షన్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి చేతులు మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు కావలసిన వారు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలన్నారు. చిన్న పిల్లలను అమ్మినా,కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తప్పవని అన్నారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ అప్పలనాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పలు రోడ్లు అభివృద్ధి చెయ్యాలని కోరారు. నెల్లిమర్ల నుంచి రామతీర్థం మీదుగా రణస్థలం వరుకు రహదారిని అభివృద్ధి చేయాలని, విజయనగరం-కొత్తూరు NH-16ను 4 లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని, పాలకొండ, రామభద్రపురం, రహదారులను 4లైన్ల రహదారిగా మార్చాలని వినతిపత్రం ఇచ్చారు.
విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో వార్షిక జిల్లా పోలీసు స్పోర్ట్స్ గేమ్స్ మీట్ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టి ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా పోటీలను ప్రారంభించారు. పోలీసు ఉద్యోగులు అన్ని రంగాల్లోను ఇతరులకు రోల్ మోడల్గా ఉండాలన్నారు. పోలీస్ సిబ్బంది శారీరక ధారుడ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.
విద్యా వ్యవస్థ బలోపేతానికే శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గజపతినగరం మండలం మరుపల్లి పరిధిలో గల పాలిటెక్నికల్ కళాశాలలో శిక్షణ ఇస్తున్న శ్రీను అనే ఉపాధ్యాయుడు గురువారం గుండెపోటుతో మరణించాడు. ఈ ఉపాధ్యాయుడు శ్రీకాకుళం వాసిగా స్థానిక ఎంఈవో సాయి చక్రధర్ తెలిపారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకువెళ్లానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఏనుగుల సంచారంతో పంటలు, ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు జీవన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పవన్కు వివరించామన్నారు. ఏనుగుల కదలికలను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీలో కలిసి కోరినట్లు ఎంపీ తెలిపారు.
బలిజిపేట మండలం గంగాపురంలో అప్పుల భారంతో వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై సింహాచలం వివరాల ప్రకారం.. ఇటుక బట్టీ నిర్వహిస్తున్న రవి అప్పులు ఎక్కువగా చేశాడు. వీటిని సమయానికి తీర్చలేక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స కోసం విజయనగరం తరలించగా బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టీ జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో పోలీసు ఉద్యోగులకు వార్షిక క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీలను డీఐజీ గోపీనాథ్ జట్టి గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభించనున్నారు. కాగా ఈ పోటీలు ఈ నెల 30 వరుకు కొనసాగనున్నాయి.
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సింహాచల దేవస్థానం పంచ గ్రామాల భూముల క్రమబద్దీకరణపై అశోక్ తో చర్చించారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకర్ల రమేష్, తదితరులు అశోక్ ను కలిసిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
డెంకాడ మండలం చింతలవలస ACA క్రికెట్ అకాడమి స్టేడియంలో విదర్భ, పాండిచ్చేరి మధ్య జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీను మాజీ మంత్రి, ఏపీ అటవీ అభివృద్ది కార్పొరేషన్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు బుధవారం తిలకించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు వాళ్లతో ముచ్చటించారు. కార్యక్రమంలో ACA కార్యదర్శి సానా సతీష్ పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లాలో విజయనగరం స్వాముల బస్సుకు ప్రమాదం జరిగిన <<14721893>>విషయం తెలిసిందే<<>>. లారీ డ్రైవర్ మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశాడని క్షతగాత్రులు తెలిపారు. సోమవారం విజయనగరం నుంచి బస్సు బయలుదేరింది. క్షతగాత్రులు సత్యారావు, రామారావు, సత్యనారాయణ, శ్రీధర్, ఉమా మహేశ్వర్, ధనుంజయ్ విజయనగరం వాసులుగా తెలిపారు.
Sorry, no posts matched your criteria.