Vizianagaram

News March 26, 2024

పదోతరగతి పరీక్షలకు 816 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో మొత్తం 129 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీవశాస్త్రం పరీక్షలకు మొత్తం 25,287 విద్యార్థులు మంగళవారం హాజరయ్యారు. కాగా 816 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. మాస్ కాపీయింగ్ వంటి పిర్యాదులు ఎక్కడ అందలేదన్నారు. జిల్లా మొత్తం జీవశాస్త్రం పరీక్ష సజావుగా జరిగిందన్నారు. జిల్లా మొత్తం హాజరు 96.87 శాతం నమోదు అయ్యిందన్నారు.

News March 26, 2024

తెర్లాం: గుండెపోటుతో డిజిటల్ అసిస్టెంట్ మృతి

image

తెర్లాం మండలం సుందరాడ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్న ఉప్పాడ శ్రీకాంత్ ఈరోజు మధ్యాహ్నం భోజనం కోసం తన సొంత ఊరు ఉద్దవోలు వెళుతుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో ఒక్కసారి కుప్ప కూలిపోయాడు. వెంటనే దగ్గరలో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News March 26, 2024

VZM: ఈవీఎంల భద్రతను సమీక్షించిన కలెక్టర్

image

స్థానిక ఈవీఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి మంగ‌ళ‌వారం త‌నిఖీ చేశారు. అక్క‌డి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. గోదాముల‌ను తెరిపించి, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఏర్పాటు చేసిన గ‌దుల‌ను, ఈవీఎంల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం మ‌ళ్లీ గోదాముల‌కు సీల్ వేయించారు. గోదాములలోని సీసీ కెమేరాలను త‌నిఖీ చేశారు. ఈవీఎంల తొలిద‌శ త‌నిఖీకి ఏర్పాట్లు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను ఆదేశించారు.

News March 26, 2024

పార్వతీపురం: ‘సువిధలో 48 గంటల ముందుగా దరఖాస్తు చేయాలి’

image

ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్ యాప్‌లో కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలన్నారు.

News March 26, 2024

విజయనగరం: మంటల్లో పడి మహిళ మృతి

image

ప్రమాదవశాత్తు మంటల్లో పడి ఓ మహిళ మృతి చెందిన విషాదకర ఘటన గజపతినగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొత్తబగ్గాం గ్రామానికి చెందిన ఎస్.బంగారమ్మ(45) ఆదివారం పొలంలో ఉన్న పిచ్చి మొక్కలను ఏరి, నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే ఆమెకు మూర్చరావడంతో మంటల్లో పడిపోయారు. తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News March 26, 2024

విజయనగరం ఎంపీ సీటు.. ఐవీఆర్ఎస్‌లో ఆ ముగ్గురి పేర్లు..!

image

విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం TDP ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో మూడు పేర్లను తెరపైకి తీసుకువచ్చారు. సర్వేలో కలిశెట్టి అప్పలనాయుడు, కంది చంద్రశేఖర్, మీసాల గీత అభ్యర్థిత్వాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాగా.. మీసాల గీత విజయనగరం ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడగా.. కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు.

News March 26, 2024

VZM: మద్యం అక్రమరవాణా కేసుల నమోదు

image

జిల్లా వ్యాప్తంగా మద్యం అక్రమరవాణాపై పోలీసులు సోమ వారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన నిందితులపై 16 కేసులు నమోదుచేసి 60.3 లీటర్ల ఐఎంఎఫ్ఎల్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై 32 కేసులు, మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 20 కేసులు, కోడిపందాలు, పేకాట ఆడుతున్న వారిపై మూడుకేసులు నమోదుచేసి, 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.

News March 26, 2024

పార్వతీపురం ఎమ్మెల్యేపై కోడ్ ఉల్లంఘన కేసు

image

పార్వతీపురం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదయ్యింది. ఈనెల 21న ఎలాంటి అనుమతులు లేకుండా పార్వతీపురం పట్టణం కొత్తవలసలో ఉ.8గంటలకు ప్రచారం చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అనంతరం పార్వతీపురం పట్టణ పోలీసులు జోగారావుపై కేసు నమోదు చేశారు. కాగా.. బొబ్బిలి ఎమ్మెల్యేపై కూడా ఇటీవల కోడ్ ఉల్లంఘన కేసు నమోదయ్యింది.

News March 26, 2024

‘కురుపాం అభ్యర్థి భర్తపై సస్పెన్షన్ అన్యాయం’

image

కురుపాం టీడీపీ అభ్యర్థి జగదీశ్వరి భర్తపై సస్పెన్షన్ అన్యాయమని టీడీపీ, గిరిజన సంఘాల నాయకులు ఎం. భూషణరావు, ఎం. ప్రసాదరావు, కడ్రక కళావతి అన్నారు. టీడీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక రాజకీయ సంబంధం లేని ఉపాధ్యాయుడిపై వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. అనధికారికంగా ఐటీడీఏ వసతిగృహాల్లో ఉంటున్న వైసీపీ నాయకులను ఖాళీ చేయించాలని డిమాండు చేశారు.

News March 26, 2024

దివ్యాంగులకు మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్: డీఈఓ

image

జిల్లాలో మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి జి. పగడాలమ్మ తెలిపారు. మన్యం జిల్లా సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో 3 సం. నుంచి 18 సం. గల దివ్యాంగ విద్యార్థులకు వైకల్యం నిర్ధారించుటకు నిపుణుల వైద్యుల పర్యవేక్షణలో మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామన్నారు. వైకల్య నిర్ధారణ పరీక్షల అనంతరం వారికీ అవసరమగు ఉపకరణాలు అందజేస్తామని తెలిపారు.