Vizianagaram

News June 3, 2024

వంగరలో పిడుగు పాటుకు మూగజీవాలు మృతి

image

వంగర మండలం పట్టువర్ధనం గ్రామ సమీపంలో పిడుగు పాటుకు ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. చిన్న గంగులు, చిన్ని అయ్యప్పకు చెందిన గొర్రెల మందతో పొలంలో కాపు కాస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిలోకి పరుగులు తీసి తమ ప్రాణాలు కాపాడుకున్నామన్నారు.

News June 3, 2024

పాడేరు: ఘాట్ రోడ్డులో భారీ వాహనాలు నిషేధం

image

పాడేరు ఘాట్ రోడ్డులోకి సోమవారం ఉదయం నుంచి భారీ వాహనాల రాకపోకలను నిషేధించినట్టు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మైదాన ప్రాంతం నుంచి పాడేరు, జీ.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట తదితర మండలాలకు సిమెంటు, తదితర సామగ్రిని తరలించే భారీ వాహనాలను ముందస్తుగానే ఘాట్ మార్గంలోకి ప్రవేశించకుండా అవసరమైన చర్యలు చేపట్టామని సీఐ వెల్లడించారు.

News June 3, 2024

విజయనగరం: లెక్క తేలేందుకు ఇక ఒక్క రోజే..!

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. జూన్ 4న ఫలితాలు వెడుననున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. సోమవారం డ్రైడేగా ప్రకటించామని.. మద్యం తాగినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల పరిధిలో 53 మద్యం దుకాణాలు, 8 బార్లు మూసివేస్తున్నట్లు తెలిపారు.

News June 3, 2024

జిల్లాలో 144 సెక్ష‌న్ అమ‌లు: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఓట్ల లెక్కింపు జ‌రిగే జూన్ 4న జిల్లాలో 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంటుంద‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను ప్ర‌శాంతంగా పూర్తి చేసేందుకు, శాంతిభ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించేందుకు ఈ సెక్ష‌న్‌ను విధిస్తున్న‌ట్లు తెలిపారు. ఆ రోజు ఐదుగురు కంటే ఎక్కువ‌మంది గుమిగూడ‌కూడ‌ద‌ని, ఎవ‌రూ ఎటువంటి ఆయుధాల‌ను ధ‌రించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

News June 2, 2024

విశాఖ: తంతడి బీచ్‌లో అక్కాచెల్లెళ్లు మృతి

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌లో ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. వారిలో శెట్టిపాలెంకి చెందిన నూకరత్నం, తీడ గ్రామానికి చెందిన కనకదుర్గ(27) మృతిచెందగా.. శిరీష అనే అమ్మాయిని స్థానికులు కాపాడారు. కాగా మృతి చెందిన వారిద్దరూ సొంత అక్కాచెల్లెళ్లుగా గుర్తించారు. శిరీష పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 2, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

డెంకాడ మండలం చింతలవలస సమీపంలోని బొడ్డవలస పెట్రోల్ బంక్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. చింతలవలసకు చెందిన శరత్ కుమార్ (26), శివ ప్రసాద్ (25) శనివారం రాత్రి బైక్‌పై భీమిలి నుంచి ఇంటికి వస్తుండగా చింతలవలస పెట్రోల్ బంక్ సమీపంలో ముందున్న వాహనాన్ని ఢీకొన్నారు. స్థానికుల సమాచారంతో శివ ప్రసాద్ తల్లి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వారిద్దరూ మృతిచెందారు.

News June 2, 2024

EXIT POLLS: ఉమ్మడి విజయనగం జిల్లాలో 2 ఎంపీ సీట్లు ఎవరివంటే!

image

విజయనగరం ఎంపీగా వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి తనూజ విజయం సాధిస్తారని పేర్కొంది. ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాలనూ వైసీపీ కైవశం చేసుకుంటుందన్న ఈ సర్వేపై మీ COMMENT.

News June 2, 2024

బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం

image

బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. శనివారం బొబ్బిలి ఎస్సై చదలవలస సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో గల రాముడువలస గ్రామ శివారులో తోటపల్లి కెనాల్ గట్టు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభించింది. అతని వయస్సు సుమారు 45 నుంచి 50 సంత్సరాలు ఉంటుందని తెలిపారు. స్థానిక వీఆర్వో అలజంగి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు.

News June 2, 2024

EXIT POLLS: విజయనగరం జిల్లాలో టఫ్ ఫైట్!

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో టఫ్ ఫైట్ ఉండనున్నట్లు చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 9 స్థానాల్లో కూటమి 4 సీట్లు, వైసీపీకి ఒక సీటు వస్తుందని చెప్పింది. వైసీపీకి ఒకటి, టీడీపీకి ఒకటి ఎడ్జ్ ఉండగా, ఒక సీటులో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఈ సర్వేపై మీ COMMENT.

News June 2, 2024

విజయనగరంలో ఉత్కంఠ.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

image

ప్రధాన పార్టీలు జిల్లాలో తమకే మెజారిటీ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదులయ్యాయి. చాలా సర్వేలలో జిల్లాలో టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపాయి. 9 స్థానాల్లో 4 లేదా 5 స్థానాలను వైసీపీ, కూటమి పంచుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. విజయనగరం ఎంపీ సీటు కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందట. దీంతో ఉత్కంఠ నెలకొంది.