Vizianagaram

News December 17, 2024

విజయనగరం: బొకారో ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు

image

సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రం విజయవాడ డివిజన్‌లో భద్రత కారణాల దృష్ట్యా రైలు నంబర్ 13351 దన్‌బాద్- అలెప్పీ బొకోరో ఎక్స్‌ప్రెస్ దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజనల్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ తెలిపారు. ఈ నెల 16,17,20,21,23,24 తేదీల వరకు ఈ మళ్లింపు ఉంటుందని ప్రయాణికులు గమనించాలని కోరారు.

News December 17, 2024

PPM: మార్చి 17 నుంచి 31 వరకు పదవ తరగతి పరీక్షలు

image

వచ్చే ఏడాది మార్చి 17 వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరీక్షలు ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టైం టేబుల్‌ను విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. విద్యార్థులకు ఇప్పటి నుంచే పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు.

News December 16, 2024

పవన్ కళ్యాణ్ రేపటి విజయనగరం జిల్లా పర్యటన రద్దు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కురుపాం నియోజకవర్గ 17వ తేదీ పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే జగదీశ్వరి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కురుపాం మండలంలోని గ్రామాల్లో మంగళవారం పర్యటించడానికి డిప్యూటీ సీఎం షెడ్యూల్ ఖరారు అయినప్పటికీ రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారని కూటమి నాయకులు, అధికారులు గ్రహించాలన్నారు.

News December 16, 2024

VZM: జిల్లాలో రేపు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ క‌మిష‌న్ పర్యటన

image

ఎస్సీ ఉప‌కులాల‌ వ‌ర్గీక‌ర‌ణపై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజ‌న్ మిశ్రా క‌మిష‌న్ మంగ‌ళ‌వారం జిల్లాలో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ఏక‌స‌భ్య‌ క‌మిష‌న్‌ ఉద‌యం 11.గంట‌ల‌కు జిల్లాకు చేరుకొని, క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో స‌మావేశం అవుతారు. అనంత‌రం ఎస్సీ ఉప‌కులాల‌ వ‌ర్గీక‌ర‌ణపై ప్ర‌జ‌ల‌నుంచి వారి సమస్యలను విన‌తుల రూపంలో స్వీక‌రిస్తార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. 

News December 16, 2024

కైలాసగిరిలో స్కై సైక్లింగ్ జిప్‌లైనర్

image

ఏపీలో పర్యటక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. సందర్శకుల కోసం కైలాసగిరిలో స్కై సైక్లింగ్ జిప్‌లైనర్ ఇటీవల ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి రూ.300గా టిక్కెట్ ధరను నిర్ణయించారు. జల విన్యాసాలపై అసక్తి ఉన్నవారి కోసం రుషికొండ బీచ్‌లో మళ్లీ స్కూబా డైవింగ్ అందుబాటులోకి వచ్చింది. ఆకాశంలో విహరించేందుకు పారా గ్లైడింగ్ కూడా అందుబాటులోకి తెచ్చారు.

News December 16, 2024

పార్వతీపురం: రేపు జిల్లాలో పవన్ పర్యటన

image

డిప్యూటీ సీఎం పవన్ 17న జిల్లాకు రానున్నారు. దీంతో జిల్లా స్థాయి అధికారులు పర్యటనకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. ఎల్విన్ పేట హెచ్ గ్రౌండ్ పరిసరాలను సోమవారం పరిశీలించారు. కురుపాం మండలం గిరిశిఖర ప్రాంతాలను సందర్శించనున్న నేపథ్యంలో హెలిపాడ్, రూట్ మ్యాప్‌ను అధికారులు తనిఖీ చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక హెచ్ గ్రౌండ్‌ను సబ్ కలెక్టర్, పాలకొండ DSP, మండల స్థాయి అధికారులు సందర్శించారు.

News December 16, 2024

విజయనగరం జిల్లాను వణికిస్తోన్న చలి

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం 7.30 దాటినా పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు. సోమవారం ఉదయం గజపతినగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీస్తున్న చలి గాలులతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News December 16, 2024

విజయనగరం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో అరుదైన లేగ దూడ జననం

image

విజయనగరం జిల్లా, రామభద్రపురం మండలం, ఆరిక తోట వెటర్నరీ డిస్పెన్సరీ పరిధిలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన మొదటి ఆడ దూడ ఆదివారం జన్మించింది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ(IVF-ET) ద్వారా సంకరజాతి ఆవు మేలు జాతి గిర్ ఆడ దూడకు జన్మనిచ్చిందని పశువైధ్యాధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మొదటి ఆడ దూడ కావడం విశేషమని పశువైద్యాధికారి డాక్టర్ డి.సురేశ్‌కు ఉన్నతాధికారులు తెలిపారు.

News December 15, 2024

VZM: పొట్టి శ్రీరాములకు నివాళి అర్పించిన మంత్రి

image

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆదివారం విజయనగరం కలెక్టర్ అడిటోరియంలో ఆయన చిత్ర పటానికి ఘననివాళి అర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరు చేసి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన చేసిన కృషి మరువలేనిది అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో అందరూ కలసి ముందుకు సాగాలని తెలిపారు.

News December 15, 2024

భోగాపురం ఎయిర్‌పోర్ట్.. శాటిలైట్ ఇమేజ్

image

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన శాటిలైట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి పర్యవేక్షణలో ఎయిర్‌పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గడువుకు 6 నెలలు ముందుగానే పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ ఇదివరకే పేర్కొంది. కాగా ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామ రాజు పేరును ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.