WestGodavari

News September 11, 2024

ఏలూరులో జాబ్ మేళా.. 77 మంది ఎంపిక

image

ఏలూరు ప్రభుత్వ డీఎల్ టీసీ, ఐటీఐ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు 224 మంది హాజరయ్యారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాలో 77 మందిని అర్హులుగా గుర్తించి, వివిధ కంపెనీలలో ఉపాధి కల్పించామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్.ఉగాది రావు, జిల్లా ప్లేస్మెంట్ అధికారి(ఒకేషనల్) వరలక్ష్మి, వై.పి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

News September 11, 2024

గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నేపథ్యంలో వశిష్ట గోదావరి వద్ద నీటిమట్టం పెరుగుతుందని, లంక గ్రామాలు, పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అత్యవసరమైతే తప్ప బోట్ల ద్వారా రాకపోకలు సాగించవద్దని హెచ్చరించారు.

News September 10, 2024

రేపు ప.గో జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

image

ప.గో జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఆకివీడు పట్టణంలోని ఉప్పుటేరు ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తారని కూటమి నాయకులు తెలిపారు.

News September 10, 2024

ప.గో: కారును అడ్డగించి నగదు, బంగారం దోపిడీ

image

దారి కాచి 3 కాసుల బంగారం, రూ.50 వేల నగదు, సెల్‌ఫోన్ అపహరించిన ఘటనపై తణుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన తోట సత్తిపండు తన ముగ్గురి స్నేహితులతో కలిసి కారులో రాజమండ్రి నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో డీమార్ట్ వద్ద ఇద్దరు దుండగులు సత్తిపండు కారును అడ్డగించారు. అతడిని బైక్‌పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీకి పాల్పడ్డారు.

News September 10, 2024

పది, ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్‌లో చేరేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం మంగళవారం తెలిపారు. అడ్మిషన్స్‌ కోసం ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 15 వరకు గడువు పొడిగించారన్నారు. రూ.200 ఫైన్‌తో 25 వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News September 10, 2024

ఏలూరు: ఫోన్ ఇవ్వలేదని యువతి సూసైడ్

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన అన్నాచెల్లెలు జామాయిల్ నర్సరీలో పని చేసేందుకు కుక్కునూరు మండలం గణపవరం వచ్చారు. అక్కడ పనిని బట్టి వేతనం పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. చెల్లెలు (18) పని సమయంలోనూ ఎక్కువ సేపు ఫోనుతో కాలక్షేపం చేస్తుండటంతో ఆమె సోదరుడు కోపంతో ఫోన్ లాక్కున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 10, 2024

ప.గో.: నేటి క్రీడా పోటీలు వాయిదా

image

పెదవేగిలోని గురుకుల బాలుర పాఠశాలలో నేడు జరగాల్సిన ఉమ్మడి ప.గో. జిల్లా జూనియర్ కళాశాలల అండర్-19 క్రీడా జట్ల ఎంపిక పోటీలను వర్షాల కారణంగా వాయిదా వేసినట్లు ఉమ్మడి జిల్లా కార్యదర్శి జయరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిగిలిన తేదీల్లో జరిగే పోటీలు యథావిధిగా ఉంటాయని చెప్పారు.

News September 10, 2024

ఏలూరు: 7 మండలాల్లో పాఠశాలలకు సెలవు

image

ఏలూరు జిల్లాలో వర్షాలు, వరదల ప్రభావానికి గురైన ఏడు మండలాల్లోని పాఠశాలలకు మంగళవారం (నేడు) సెలవు ప్రకటించినట్లు డీఈవో ఎస్.అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు. భీమడోలు మండలంలో ఒకటి, పెదపాడులో ఏడు, మండవల్లిలో 18, కైకలూరులో 9, ఏలూరులో 1, ముదినేపల్లిలో 3, కలిదిండి మండలంలో 5 పాఠశాలలకు సెలవు ప్రకటించామన్నారు. మిగతా పాఠశాలలు యథావిధిగా పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.

News September 10, 2024

గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్: కలెక్టర్

image

పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ.. ప.గో జిల్లాలో గత నెల రోజుల నుంచి ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అంటూ వ్యాధులు ప్రబలకుండా మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

News September 10, 2024

ఈనెల 11 నుంచి ఉచిత ఇసుక విధానం: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ఈనెల 11 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత ఇసుక విధానం అమలవుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఇసుక సమన్వయ శాఖల అధికారులు, లారీ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలసీపై అవగాహన కలిగించారు. పారదర్శకంగా ఇసుక సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.