WestGodavari

News August 11, 2025

ప.గో జిల్లాలో 139 మి.మీ వర్షపాతం నమోదు

image

పశ్చిమ గోదావరి జిల్లాలో గడచిన 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 139.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి సోమవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా పాలకొల్లు 25.0, మొగల్తూరు 22.2, వీరవాసరం 18.2, యలమంచిలి 17.4, ఆచంట 15.2 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదు కాగా పెంటపాడు, తణుకు, ఇరగవరం మండలంలో వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు.

News August 11, 2025

భీమవరంలో జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన

image

ఈనెల 13న భీమవరానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఆదివారం భీమవరంలోని వీవీఎస్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లను శాసన మండలి చైర్మన్ మోషేను రాజు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు, భీమవరం ఇన్ ఛార్జ్ వెంకట్రాయుడు పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు కుమార్తె వివాహా వేడుకలో మాజీ సీఎం జగన్ హాజరుకానున్నారు.

News August 11, 2025

యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలాగే 1100 నంబర్‌కు కాల్ చేసి కూడా సమస్యలు తెలియజేయవచ్చని ఆమె సూచించారు.

News August 10, 2025

నిబంధనలను కఠినంగా అమలు చేయాలి: మంత్రి

image

ఏపీ మెడికల్ కౌన్సిల్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తేనే నకిలీ వైద్యులను నిరోధించవచ్చని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆదివారం పెదఅమిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రిజిస్ట్రేషన్, రెన్యువల్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్‌లు సక్రమంగా లేకపోతే నకిలీ వైద్యులు పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు.

News August 10, 2025

తణుకు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

తణుకు శివారు ఇరగవరం రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ఉండ్రాజవరం మండలం పసలపూడికి చెందిన కత్తుల చక్రధరరావు (30) మృతి చెందాడు. మోటార్ సైకిల్‌పై వెళుతుండగా పంట బోదెలో పడి ఉండటం, తల పగిలి ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 10, 2025

భీమవరం: పోలీస్ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

పోలీసుల ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని పెంచేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆదాన్ నయీమ్ అస్మి తెలిపారు. భీమవరం డీఎన్‌ఆర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం పోలీసు క్రికెట్ లీగ్‌ను ఎస్పీ ప్రారంభించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేయడానికి క్రీడలు ఉత్తమ సాధనమని ఎస్పీ అన్నారు. ఈ లీగ్‌లో జిల్లా నుంచి నాలుగు జట్లు పాల్గొంటున్నాయి.

News August 9, 2025

భీమవరం: అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్

image

భీమవరం పట్టణంలోని గాంధీ సర్కిల్లో దాత పోతూరి బాపిరాజు చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా పరిశీలించారు. గాంధీజీ విగ్రహం ప్రాంగణంలో లాన్, మొక్కలు, వాటర్ ఫౌంటెన్, పెయింటింగ్ పనుల పురోగతిపై ఆమె ఆరా తీశారు. ఆగస్టు 15 నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

News August 9, 2025

తణుకులో కొనసాగుతున్న జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు రెండో రోజు శనివారం తణుకులో నిర్వహించారు. అర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, హాకీ క్రీడల పోటీలలో జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అర్చరీలో జోనల్ స్థాయి పోటీలకు 24 మందిని ఎంపిక చేశారు.

News August 9, 2025

సిద్ధాంతంలో వశిష్ట గోదావరికి పంచ హారతులు

image

పౌర్ణమి సందర్భంగా సిద్ధాంతం వశిష్ట గోదావరి వద్ద శుక్రవారం రాత్రి గోదావరి మాతకు పంచ హారతులు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సిద్ధాంతంకు చెందిన కలగా భద్రుడు స్వామి ఆధ్వర్యంలో పంచ హారతులు కార్యక్రమం నిర్వహించారు. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News August 8, 2025

తణుకులో ప్రారంభమైన జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు శుక్రవారం తణుకు మహిళా కళాశాలలో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన రాష్ట్ర చేనేత కార్పోరేషన్‌ మాజీ ఛైర్మన్‌ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని అన్నారు.