WestGodavari

News December 28, 2025

పశ్చిమ గోదావరి కలెక్టర్‌కు పదోన్నతి

image

ప్రభుత్వం 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సూపర్‌ టైమ్‌ స్కేల్‌ (లెవల్‌-14)కు పదోన్నతి కల్పించింది. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఉన్నారు. ఈ పదోన్నతి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమెను కార్యదర్శి హోదాకు పెంచినప్పటికీ, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌, మేజిస్ట్రేట్‌గా అదే స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

News December 28, 2025

పశ్చిమ గోదావరి కలెక్టర్‌కు పదోన్నతి

image

ప్రభుత్వం 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సూపర్‌ టైమ్‌ స్కేల్‌ (లెవల్‌-14)కు పదోన్నతి కల్పించింది. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఉన్నారు. ఈ పదోన్నతి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమెను కార్యదర్శి హోదాకు పెంచినప్పటికీ, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌, మేజిస్ట్రేట్‌గా అదే స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

News December 28, 2025

పశ్చిమ గోదావరి కలెక్టర్‌కు పదోన్నతి

image

ప్రభుత్వం 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సూపర్‌ టైమ్‌ స్కేల్‌ (లెవల్‌-14)కు పదోన్నతి కల్పించింది. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఉన్నారు. ఈ పదోన్నతి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమెను కార్యదర్శి హోదాకు పెంచినప్పటికీ, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌, మేజిస్ట్రేట్‌గా అదే స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

News December 27, 2025

భీమవరం: ప్రత్యేక ఉపకారాగారాన్ని సందర్శించిన జిల్లా జడ్జి

image

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో శనివారం భీమవరం ప్రత్యేక ఉపకారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు S. శ్రీదేవి సందర్శించారు. ముద్దాయిలతో ఆయన మాట్లాడారు. బెయిల్ వచ్చి కూడా జామీన్లు సమర్పించని కారణంగా విడుదల కాని ముద్దాయిల వివరాలు నమోదు చేసుకున్నారు. ముద్దాయిల భోజన వసతులను, వైద్య సదుపాయాలను ఆరా తీశారు.

News December 27, 2025

ఒక్కరోజు ముందే పెన్షన్ పంపిణీ: కలెక్టర్

image

నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జనవరి 1 ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను ఒకరోజు ముందుగానే ఈనెల 31 పంపిణీ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సిబ్బందికి సూచించారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పెన్షన్ల పంపిణీ అవసరమయ్యే నగదును సిద్ధం చేసుకోవాలన్నారు.

News December 27, 2025

ఈనెల 28న పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి పర్యటన

image

ఈనెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైనవానిలంకలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 27, 2025

ఈనెల 28న పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి పర్యటన

image

ఈనెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైనవానిలంకలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 26, 2025

ఇరగవరం: అమరజీవి జలధారకు శంకుస్థాపన

image

శుద్ధిచేసిన తాగునీటిని ఇంటింటికీ అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఇరగవరం మండలం కత్తవపాడులో ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా అమరజీవి జలధార కార్యక్రమానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి మొదటి దశలో తణుకు నియోజకవర్గం ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.

News December 26, 2025

నరసాపురం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

నరసాపురం మండలంలోని సీతారామపురం సౌత్ గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లలో భాగంగా మైక్ సెట్ కడుతూ జెట్టిపాలెం గ్రామానికి చెందిన శీలం అభిరామ్ (19) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. చెట్టుపై మైక్ అమర్చుతుండగా సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News December 25, 2025

ఆడుకోమని వదిలిన తండ్రి, కొద్దిసేపటికే విగత జీవిగా కొడుకు

image

పార్కులో తన కొడుకుని ఆడుకోమని వదిలి వెళ్లిన కొద్దిసేపటికి చెరువులో పడి విగత జీవిగా మారిన ఘటన గురువారం పెనుగొండలో చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఆర్.కండ్రిక గ్రామానికి చెందిన జొన్నల ధనరాజు పెనుగొండలో బేకరీ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కుమారుడు ఈశ్వర్(5) తీసుకొని బేకరీకి వచ్చిన ధనరాజు కొద్దిసేపు పార్కులో ఆడుకోమని వదిలిపెట్టి వెళ్లాడు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.