WestGodavari

News September 10, 2024

ప.గో జిల్లాలో 101 గ్రామాలకు చెక్కులు

image

రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామ పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.4 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం ఉమ్మడి ప.గో జిల్లాలో 101 గ్రామాలకు చెక్కులను అందజేశారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.

News September 9, 2024

ఏలూరు జిల్లాలో రేపు కొన్ని స్కూళ్లకు సెలవు

image

ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా మంగళవారం కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారి అబ్రహం సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. భీమడోలులో 1, పెదపాడులో 7, మండవల్లిలో 18, కైకలూరులో 9, ఏలూరులో 1, ముదినేపల్లిలో 3, కలిదిండిలో 5 స్కూళ్లకు సెలవు ఉంటుందన్నారు. మిగతా పాఠశాలలు యధావిధిగా నడపవచ్చని సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

News September 9, 2024

ఏలూరు: ATMల వద్ద చీటింగ్.. వ్యక్తి అరెస్ట్

image

ఏలూరు జిల్లా కైకలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చదువు రాని వారిని, వృద్ధులను ATM కేంద్రాల వద్ద దృష్టి మళ్లించి డబ్బు కాజేస్తున్న వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. పల్లా సురేంద్ర కుమార్ చెడు వ్యసనాలకు బానిసై ATM ల వద్ద చీటింగ్, దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 2019 నుంచి ఇలా మోసాలు చేస్తున్నాడని, ఫిర్యాదులు రాగా కేసు దర్యాప్తు చేసి సురేంద్రను అరెస్టు చేశామని తెలిపారు.

News September 9, 2024

ప.గో: కోతుల దాడిలో 50 మందికి గాయాలు

image

ప.గో జిల్లా పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రులో కోతులు దడ పుట్టిస్తున్నాయి. గుంపులుగా ఇళ్లపై తిరుగుతూ దాడి చేస్తున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. వారం రోజులుగా గ్రామంలో ఇదే సమస్య ఉందని, సుమారు 50 మందికి పైగా గాయాల పాలయ్యారని తెలిపారు. వీరంతా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చేరుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడా కోరుతున్నారు.

News September 9, 2024

జంగారెడ్డిగూడెంలో యాక్సిడెంట్.. మృతిచెందింది ఇతనే

image

జంగారెడ్డిగూడెం మండలం వేగవరం హైవేలో ఆదివారం రాత్రి జరిగిన <<14055637>>రోడ్డు ప్రమాదంలో<<>> ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. వివరాలు.. మండలంలోని వేగవరం గ్రామానికి చెందిన బూరుగు మోహన్ కృష్ణ తాడువాయి సచివాలయ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు లారీని ఢీకొని మృతి చెందాడు.

News September 9, 2024

ఏలూరు: అర్ధరాత్రి యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

ఏలూరు జిల్లా భీమడోలు మండలం కురెళ్లగూడెం వద్ద 216వ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం వైపు బత్తాయి లోడుతో వెళ్తున్న లారీ స్థానిక కురెళ్లగూడెం పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ మీద ఉంగుటూరుకి చెందిన పిల్లా విష్ణును ఢీ కొంది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News September 9, 2024

ఏలూరు: వాగు దాటుతూ లెక్చరర్ మృతి

image

ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో ఆదివారం విషాదం జరిగింది. మండలంలోని చిలకరాయుడు పాలేనికి చెందిన సూర్యప్రకాశ్ చాట్రాయి మండలం తుమ్మగూడెం వద్ద వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ఏలూరులోని ఓ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. సూర్యప్రకాష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 9, 2024

ప్రత్యేకాధికారులకు ఏలూరు కలెక్టర్ ఆదేశాలు

image

వరద ముప్పు ముగిసే వరకు అధికారులందరూ కలిసికట్టుగా పని చేయాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. ఆదివారం ఆమె అధికారులతో మాట్లాడుతూ.. పునరావాస కేంద్రాలలో ఆహారం పూర్తి నాణ్యతతో ఉండాలన్నారు. అలాగే వరద ప్రమాదం తగ్గేవరకూ మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

News September 9, 2024

ప.గో, ఏలూరు జిల్లాల్లో రేపటి ‘మీకోసం’ ప్రోగ్రాం రద్దు

image

ప.గో, ఏలూరు జిల్లాల్లో వర్షాలు, వరదల కారణంగా సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ‘మీకోసం’ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు నాగరాణి, వెట్రిసెల్వి ఓ ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో జరగాల్సిన ‘మీ కోసం’ ప్రోగ్రాములను కూడా రద్దు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు.

News September 8, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు నాగమణి, అబ్రహం తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా పాఠశాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. SHARE IT..