WestGodavari

News March 12, 2025

ప.గో: ఆరు యూనిట్లు ఇసుక ధర ఎంతో తెలుసా..!

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుకకు డిమాండ్ తగ్గి ధరలు దిగోచ్చాయి. యూనిట్ ఇసుక రూ.10 వేలకే దొరుకుతోంది. జిల్లాలో భవన నిర్మాణాలు ఒక్కసారిగా మందగించడంతో ధర అందుబాటులో ఉన్నప్పటకి డిమాండ్ లేకపోవడంతో లారీ యాజామానులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ అభివృద్ధి పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. అయినప్పటికి అదనంగా ఛార్జీలు వస్తూలు చేస్తున్నారని కనీసం రూ.2 వేలు మిగలడం లేదని వాపోతున్నారు.

News March 12, 2025

పేదలందరికీ ఇళ్ళు ఏర్పాటు దిశగా చర్యలు: కలెక్టర్ 

image

పేదలందరికీ ఇళ్ళు ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ప.గో జిల్లాలో 18,340 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. బీసీలులు 12,362, ఎస్సీలు 5,593, ఎస్టీలు 385 లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటికి అదనంగా రూ.92.66 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

News March 11, 2025

భీమవరం: ఆన్ లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్

image

ఆన్ లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు ముఠా సభ్యులను ప.గో. జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ జయసూర్య వివరాలు వెల్లడించారు. నలుగురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.13 లక్షల విలువగల 54 మొబైల్ ఫోన్స్, 3 ల్యాప్‌టాప్స్, నెట్వర్కింగ్ డివైసెస్ స్వాధీనం చేసుకున్నారు.

News March 11, 2025

ప.గో: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 162 మంది గైర్హాజరు

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ (APOSS) పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని విద్యాశాఖ అధికారి నారాయణ తెలిపారు. ఇవాళ జరిగిన ఫిజిక్స్ , పొలిటికల్ సైన్స్ పరీక్షలకు 11,77 మంది విద్యార్థులకు గాను 1,015 మంది హాజరు అయ్యారు అని తెలిపారు. 162 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. మొత్తంగా 86.24 % హాజరు నమోదయిందని తెలిపారు.

News March 11, 2025

12,13న రైతులకు కీలక సదస్సులు

image

ఈ నెల 12, 13న భీమవరంలో పూలసాగు, ఉద్యాన విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు రైతులకు, ఉత్పత్తి దారులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. 12న రక్షిత వ్యవసాయ పద్ధతులపై, 13న పంట కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలపై శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు.

News March 10, 2025

భీమవరం: పీజీఆర్‌ఎస్‌కు 367 అర్జీలు

image

భీమవరం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. నేటి పీజీఆర్‌‌కు 367 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిని సంబంధిత అధికారులు పంపించి త్వరగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ తదితరులు పాల్గొన్నారు.

News March 10, 2025

P24 సర్వే శ్రద్ద పెట్టి చేయాలి: జిల్లా కలెక్టర్

image

ఆకివీడులో జరుగుతున్న P4 సర్వేను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో P4 సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వే చేసేటప్పుడు శ్రద్ధ పెట్టి చేయాలని, ఎలాంటి తప్పులు ఉండకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, వార్డు సచివాలయ అధికారి దాసిరెడ్డి పాల్గొన్నారు

News March 10, 2025

భీమవరంలో నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్

image

భారత్ -న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. భీమవరం పట్టణంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన కొందరు యువకులు దీనిపై క్రికెట్ బుకింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News March 10, 2025

ప.గో: సంజయ్ దత్‌ను కలిసిన రఘురామ

image

ఏఎంఆర్ సంస్థ ఛైర్మన్ మహేశ్ రెడ్డి కుమారుడు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పాల్గొని నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ రిసెప్షన్లో తన పాత మిత్రుడు సంజయ్ దత్‌ను కలిశారు.

News March 10, 2025

పి4 సర్వే సర్వేను వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్

image

పీఫోర్ సర్వే సమర్థవంతంగా నిర్వహించడంతో సామాన్యుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఆదివారం ఆకివీడులో జరుగుతున్న బిఫోర్ సర్వే‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యువతను ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా సర్వేను పూర్తి చేయాలని ఆమె సిబ్బందికి దిశా నిర్దేశించారు.

error: Content is protected !!