WestGodavari

News September 7, 2024

ప.గో.: వరదలపై సీఎం చంద్రబాబు ఆరా

image

కొల్లేరులో వరద ఉద్ధృతి, ఉప్పుటేరు ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసే అవకాశం ఉందని సమాచారం అందడంతో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఉప్పుటేరులో ప్రవాహానికి అడ్డంకులను తొలగించే పనులు ముమ్మరం చేయించారు.

News September 7, 2024

ఊటుకూరులో పట్టపగలే దారుణ హత్య

image

ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం ఊటుకూరులో శనివారం పట్టపగలే దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన పోసిన బాల కోటయ్య (55)ను మారణాయుధాలతో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ముదినేపల్లి పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

News September 7, 2024

ప.గో.: భార్య చేపలకూర వండలేదని భర్త సూసైడ్

image

భార్య చేపల కూర వండలేదని అలిగి ఉరేసుకున్న వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు మొగల్తూరు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. వివరాలు.. మండలంలోని ముత్యాలపల్లి చెందిన మైల సుబ్బరాజు (38) గత నెల 22న తన భార్యను చేపలకూర వండమని చెప్పారు. ఆమె వండకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబీకులు కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

News September 7, 2024

ప.గో.: ఇన్‌స్టాలో పరిచయం.. రూ.10.15లక్షలు మాయం

image

నరసాపురానికి చెందిన ఓ యువతి సైబర్ మోసానికి గురైంది. టౌన్ SI జయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చింతపల్లి హాసిని డిగ్రీ పూర్తి చేసి జాబ్ సెర్చింగ్‌లో ఉంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రాంలో పాటిల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం ఇస్తానని చెప్పి యువతిని నమ్మించాడు. కాగా రూ.10.15 లక్షలు కావాలని అడగ్గా ఫోన్‌పేలో పంపించింది. మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదైంది.

News September 7, 2024

ప.గో.: స్కూటీ డిక్కీలో పాము (PHOTO)

image

పెనుమంట్ర మండలం మార్టేరులో శుక్రవారం రాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీలోకి జెర్రిపోతు జాతికి చెందిన పెద్దపాము చొరబడింది. వివరాలు.. గ్రామానికి చెందిన మహమ్మద్ బాషాకి చెందిన స్కూటీలోకి పాము ప్రవేశించినట్లు ఆయన కుమారుడు యూసుఫ్‌ గమనించాడు. దీంతో స్కూటీ ముందుభాగాన్ని తొలగించగా పాము వెళ్లిపోయింది. వర్షాకాలం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

News September 7, 2024

వినాయక ఉత్సవాల్లో డీజేలు వాడొద్దు: డీఎస్పీ

image

భీమవరం పట్టణంలోని త్యాగరాజ భవనంలో వినాయక చవితి ఉత్సవ కమిటీలకు అవగాహన కార్యక్రమాన్ని భీమవరం డీఎస్పీ జైసూర్య నిర్వహించారు. పట్టణంలోని వన్ టౌన్, టూ టౌన్ సీఐలు, ఎస్సైలను కలిసి ఉత్సవ నిర్వాహ కమిటీలు అనుమతులు ఎలా పొందాలి..? ఉత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఊరేగింపుల్లో డీజే సౌండ్స్ వాడకూడదని అన్నారు.

News September 6, 2024

బాలికపై లైంగికదాడి.. యావజ్జీవ కారాగార శిక్ష

image

పోక్సో కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఇటీవల తడికలపూడి పోలీస్ స్టేషన్‌ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించి పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాక్షులను విచారించి వాదనలు వినిపించారు. ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పు వెలవడినట్లు ఎస్పీ తెలిపారు.

News September 6, 2024

ఏలూరు జిల్లాలో కి‘లేడీ’.. విలాసాల కోసం చోరీల బాట

image

ఏలూరు జిల్లా భీమడోలులో ఓ కి‘లేడీ’ని పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శ్రావణ్ వివరాల ప్రకారం.. గుండుగొలనులోని YSR కాలనీకి చెందిన శ్రీదేవి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో దొంగతనాల బాట పట్టింది. కాలనీలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతోంది. దీనిపై ఫిర్యాదులు అందగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. రూ 4,47,000/- విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

News September 6, 2024

వైసీపీలో కీలకనేతలు రాజీనామా.. పరిస్థితి ఏంటి..?

image

ఉమ్మడి ప.గో.లో వైసీపీ కీలక నేతలంతా రాజీనామాలు చేయడం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఏలూరు జిల్లాలో మాజీ మంత్రి ఆళ్ల నాని, మేయర్ నూర్జహాన్ సహా 19 మంది కార్పొరేటర్ల రాజీనామా చేశారు. తాజాగా జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాదరావు సైతం రాజీనామా చేశారు. ఈ ఎఫెక్ట్ జిల్లా వైసీపీలో ఏ మేర ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది. మీ కామెంట్..?

News September 6, 2024

ప.గో.: భార్యను చంపిన భర్త, ఆపై ఆత్మహత్యాయత్నం

image

భార్యను చంపి ఆపై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉండి మండలం కలిగొట్లలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన చిరంజీవికి భూపతి సత్యవతి(36)తో15 ఏళ్ల క్రితం పెళ్లైంది. భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండేవాడు. ఈ క్రమంలో భార్య నిద్రిస్తున్న సమయంలో ఆమె ముఖంపై దిండు వేసి హత్యచేసి బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం ఎలుకల మందు తాగాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.