WestGodavari

News September 6, 2024

ప.గో.: మంకీ ఫాక్స్ కాదు.. చర్మ వ్యాధి

image

మంకీ ఫాక్స్ అనుమానిత లక్షణాలతో ఈ నెల 2న తణుకు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వ్యక్తికి అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి అతనికి మంకీ పాక్స్ లేదని నిర్ధారించారని అత్తిలి PHC వైద్యాధికారి నాగరాజు గురువారం తెలిపారు. అతను చర్మ సంబంధితమైన వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాడని, అది అంటు వ్యాధి కూడా కాదని వివరించారు.

News September 5, 2024

FLASH: భీమవరంలో యాక్సిడెంట్.. విద్యార్థి మృతి

image

భీమవరంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో బొక్కవారిపాలెంకు చెందిన బొక్క లక్ష్మీ శ్రీగణేశ్(13) మృతి చెందాడు. గణేశ్ సైకిల్‌పై మంచినీరు తెచ్చేందకు వెళ్తుండగా.. పాలకొల్లు వైపు నుంచి భీమవరం వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. గణేశ్ తలపై నుంచి వ్యాన్ వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ స్కూల్ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News September 5, 2024

మాజీ MLA సత్యనారాయణ రాజు కన్నుమూత

image

నరసాపురం మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు సత్యనారాయణ రాజు(98) గురువారం మధ్యాహ్నం భీమవరం పట్టణంలో కన్నుమూశారు. 1967 లో సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి పరకాల శేషావతారంపై 4305 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన తుది శ్వాస విడిచే వరకు సీపీఎం లోనే ఉన్నారు. ఆయన స్వగ్రామమైన యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

News September 5, 2024

ప.గో : నేడే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

image

ప్రతి విద్యార్థి జీవితంలో ఒక గురువు ప్రభావం ఉంటుంది. విద్యార్థి భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఆ గురువు ఒక టార్చ్ బేరర్‌లా ఉంటాడు. అలాంటి గురువులను స్మరించుకునే ఈ రోజు గురుపూజోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు పలువురు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సత్కరించనున్నారు. మరి మీ విద్యార్థి జీవితంలో మీకిష్టమైన ఉపాధ్యాయుడు ఎవరని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News September 5, 2024

ఉండి: భార్యను రాడ్డుతో కొట్టి చంపిన భర్త

image

ఉండి మండలం కలుగొట్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చిరంజీవి- సత్యవతి దంపతులు. అయితే కుటుంబ కలహాలతో బుధవారం రాత్రి రాడ్డుతో భార్య సత్యావతిపై చిరంజీవి దాడి చేశాడని తెలిపారు. అనంతరం చిరంజీవి పురుగుల మందు తాగడంతో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News September 5, 2024

గోదావరి వరద.. రెస్క్యూ ఆపరేషన్‌కు రెడీ: RDO

image

గోదావరి వరదతో వేలేరుపాడు మండలములోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు 15 మోటర్ బోట్లు, 30 ట్రాక్టర్లు ఏర్పాటు చేశామని ఆర్డీవో ఆదయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ముంపు ప్రజలను తరలించడానికి 24 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉన్నారన్నారు. మరింత సహాయార్థం టోల్ ఫ్రీ నెం. 8919936844 ఏర్పాటు చేశామన్నారు.

News September 4, 2024

2వ ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉంది: కలెక్టర్

image

భద్రాచలం వద్ద గోదావరి 2వ ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. వరద ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటువంటి ప్రాణనష్టానికి ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పునరావాస, వైద్య శిబిరాల్లో అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు ఉండాలన్నారు. ఫిర్యాదులకు తావు లేకుండా పనిచేయాలన్నారు.

News September 4, 2024

ఏలూరు: గోదావరి నదికి 1వ ప్రమాద హెచ్చరిక జారీ

image

భద్రాచలం వద్ద గోదావరి నదికి 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి కుక్కునూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. గోదావరి వరద ఉద్ధ‌‌ృతి ఎక్కువగా ఉన్నదని ప్రజలు తమ ఇళ్లను విడిచి పునరావాస కేంద్రాలకు రావాలన్నారు. అధికారులకు సహకరించాలని కోరారు. అనంతరం కుక్కునూరులో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాన్ని జేసీ పరిశీలించారు.

News September 4, 2024

ఏలూరు: సెప్టెంబర్ 10న జాబ్ మేళా

image

ఏలూరులోని డీఎల్టీసీ, సత్రంపాడు ఐటీఐ కళాశాలలో సెప్టెంబరు 10వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అధికారులు బుధవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 150 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు వారు అర్హులు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్ మేళా ఉంటుందన్నారు.

News September 4, 2024

ప.గో: అల్పపీడనం రూపంలో ప్రమాదం పొంచి ఉంది: కలెక్టర్

image

మరో 2 రోజుల్లో అల్పపీడనం రూపంలో ప్రమాదం పొంచి ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను హెచ్చరించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి పటిష్ఠ పరచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు.