WestGodavari

News September 3, 2024

పోలవరం: 5,16,058 క్యూసెక్కుల వరద నీరు విడుదల

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు, కొండవాగుల జలాలతో గోదావరి నీటిమట్టం సోమవారం పెరిగింది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే నుంచి అదనంగా వస్తున్న 5,16,058 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే ఎగువన 30.190 మీటర్లు, స్పిల్ వే దిగువన 21.130 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు ప్రాజెక్ట్ ఈఈలు వెంకటరమణ, మల్లికార్జునరావు తెలిపారు.

News September 3, 2024

భీమవరంలో వ్యభిచారం.. ఐదేళ్ల జైలుశిక్ష

image

భీమవరం పట్టణం గునుపూడిలోని ఓ ఇంట్లో నాలుగేళ్ల కిందట కొందరు మహిళలు, యువతులతో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకురాలిని అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచారు. ఏలూరు అయిదో అదనపు ప్రత్యేక న్యాయమూర్తి రాజేశ్వరి తుదివిచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలుశిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

News September 2, 2024

భీమవరంలో వ్యభిచార గృహం.. మహిళకు జైలు శిక్ష

image

ప.గో జిల్లా భీమవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం నిర్వహించిన మహిళకు జైలు శిక్ష విధిస్తూ ఏలూరు మహిళా కోర్టు న్యాయమూర్తి రాజేశ్వరి మంగళవారం తీర్పునిచ్చారు. 2020లో పోలీసులు వ్యభిచారం గృహంపై దాడి చేసి నిర్వాహకురాలైన సాయి కుమారిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో సాయికుమారికి 5ఏళ్ల జైలు శిక్ష, రూ.4వేల ఫైన్ విధిస్తూ తీర్పు వెల్లడైందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామాంజనేయులు తెలిపారు.

News September 2, 2024

YSR వర్ధంతి సభలో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ YSR వర్ధంతి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో మహానేత YSR వర్ధంతి కార్యక్రమానికి తిమ్మిరిమీసాల వీరయ్య(60) హాజరయ్యాడు. ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి నివాళులర్పిస్తుండగా వీరయ్య ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News September 2, 2024

రేపు స్కూళ్లకు సెలవు: ప.గో కలెక్టర్

image

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు.. వరదల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప.గో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సెలవును అమలు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు.

News September 2, 2024

భారీ వరదలు.. ఏలూరు జిల్లా నుంచి 22 బోట్లు

image

భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లా వణుకుతోంది. అక్కడ వరద బాధితులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఏలూరు జిల్లా నుంచి 22 బోట్లను పంపిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి నాగలింగా చారి సోమవారం తెలిపారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశాల మేరకు కలిదిండి నుంచి 15, కైకలూరు-05, పట్టిసీమ ఫెర్రీ నుంచి 2 పడవలు ఎన్టీఆర్ జిల్లాకు పంపినట్లు పేర్కొన్నారు. వీటిలో 20 దేశీయ పడవలు, 2 ఫైబర్ బోట్లు ఉన్నాయన్నారు.

News September 2, 2024

పారిశుద్ధ్య నిర్వహణలో ఏలూరు జిల్లాకు ఫస్ట్ ర్యాంక్

image

పారిశుద్ధ్య నిర్వహణలో ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. మురుగు కాలువలు, తాగునీరు ట్యాంకుల శుభ్రం, ప్రజలకు రక్షిత తాగునీటి సరఫరా, పంచాయతీ చెరువుల్లో గుర్రపు డెక్క, గ్రామాల్లో చెత్త కుప్పల తొలగింపు పనులను సమర్థవంతంగా నిర్వహించామన్నారు. తద్వారా పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రంలోనే మొదటి స్థానం కైవసం చేసుకుందన్నారు.

News September 1, 2024

భీమవరంలో ఇద్దరి మధ్య కొట్లాట.. ఒకరి మృతి

image

భీమవరంలో ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ ఒకరి మరణానికి కారణమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. భీమవరంలోని డిమార్ట్ వద్ద మెకానిక్ షెడ్డులో వరప్రసాద్, నాగరాజు మధ్య గొడవ జరిగింది. కోపంలో వరప్రసాద్ నాగరాజును చాక్‌తో పొడవగా.. నాగరాజు వరప్రసాద్‌ను రాడ్డుతో కొట్టాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా వారిని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగరాజు మృతి చెందగా.. వరప్రసాద్‌ను అక్కడి నుంచి ఏలూరు తరలించారు.

News September 1, 2024

భారీ వర్షాలు.. ఉమ్మడి ప.గో కంట్రోల్ రూం నంబర్లు ఇవే

image

ఉమ్మడి ప.గో జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠ కంట్రోల్ రూం నంబర్లు: 08816-299219 (ప.గో), 18002331077 (ఏలూరు).

News September 1, 2024

ఖతర్‌లో నరసాపురం మహిళల కష్టాలు

image

ప.గో. జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు ఖతర్‌లో ఇబ్బందులు పడుతున్నారు.నరసాపురానికి చెందిన ఉండవల్లి రామలక్ష్మి, వాటాల ముత్యాల అరుణ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండగా స్థానికంగా ఉండే బొమ్మిడి కొండాలమ్మ వారిని విదేశం పంపిస్తానని చెప్పింది. ఏజెంట్ల సాయంతో ఖతర్ పంపించింది. అక్కడికి వెళ్లాక మూడు నెలలుగా సరైన ఆహారం అందించకుండా పనిచేయించుకుంటున్నారని బాధితులు వాపోయారు. తమను స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు.