WestGodavari

News March 4, 2025

ప.గో: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

image

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. B.com పూర్తిచేసిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.

News March 4, 2025

MLC ఎన్నికల్లో తొలిసారి గెలవబోతున్న టీడీపీ అభ్యర్థి..!

image

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News March 4, 2025

ప.గో: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.

News March 4, 2025

జైన్ ఇరిగేషన్ సిస్టంతో ఉద్యాన వర్సిటీ ఎంవోయూ

image

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెంలోని డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మహారాష్ట్రలోని జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ కంపెనీతో సోమవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. జైన్ ఇరిగేషన్ సిస్టం నిర్వహిస్తున్న అత్యధిక టిష్యూ కల్చర్ ల్యాబ్ సదుపాయాలను, రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విభాగాలను ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఉపకులపతి కే. గోపాల్ తెలిపారు.

News March 4, 2025

పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం

image

శుభకార్యానికి వెళ్లే విషయమై ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఓ వివాహత ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనుగొండ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటాపురం గ్రామానికి చెందిన ఉప్పలపాటి శ్రీదేవి ఆదివారం శుభకార్యానికి హాజరయ్యే విషయమై ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె గోదావరిలో దూకింది. కాగా సోమవారం దొంగరావిపాలెం వద్ద ఆమె మృతదేహాన్ని కనుగొన్నట్లు పెనుగొండ ఎస్ఐ కే.గంగాధర్ తెలిపారు.

News March 4, 2025

‘మహిళా దినోత్సవం రోజు భారీ ర్యాలీ చేపట్టండి’ 

image

మార్చి 8న మ‌హిళా దినోత్సవంలో భాగంగా భారీగా ర్యాలీ ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. ఈ మేరకు ఆమె క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ప్రకాశం చౌక్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సుమారు వెయ్యి మంది మహిళలతో ర్యాలీ నిర్వహించాలన్నారు. ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.

News March 4, 2025

సర్వేలను సకాలంలో పూర్తిచెయ్యాలి: కలెక్టర్

image

జిల్లాలో సర్వేలను సకాలంలో పూర్తిచెయ్యలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఆమె మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష గూగుల్ మీట్ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేస్తున్న సర్వేలపై చర్చించారు. పి-4 సర్వేపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

News March 3, 2025

ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

image

✷ తణుకులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా అఘోరి ✷ నన్నయ యూనివర్సిటీ అధ్యాపకురాలికి అరుదైన గౌరవం ✷ భీమవరం: ఇయర్ ఫోన్స్ వాడకం తగ్గించాలి  ✷ గోదావరి పుష్కరా పై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి ✷ అత్తిలిలో సాగునీరు అందించాలని ఆందోళన ✷మహిళా దినోత్సవం రోజున భారీ ర్యాలీ 

News March 3, 2025

రేషన్ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలి: జేసీ

image

రేషన్ లబ్ధిదారులకు మెరుగైన సేవలను అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం మండలం చినమిరం గ్రామంలో 62 నెంబరు రేషను షాపును జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టరును, కార్డుదారులకు పంపిణీ చేసే రికార్డులను పరిశీలించారు. ఎండీయూ వాహనంపై సరుకుల వివరాలు రేట్లు పట్టికను పరిశీలించారు.

News March 3, 2025

ఏలూరు : పోస్టల్ బ్యాలెట్‌లో 42 చెల్లని ఓట్లు

image

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కొనసాగుతోంది. ఇందులో మొత్తం పోస్టల్ బ్యాలెట్‌లో 243 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వ్యాలిడ్ (చెల్లుబాటు అయ్యే) ఓట్లు 201, ఇన్ వ్యాలిడ్ (చెల్లని) ఓట్లు 42 గా సమాచారం.

error: Content is protected !!