WestGodavari

News March 3, 2025

ప.గో : మద్యం దుకాణాలు బంద్

image

మరి కాసేపట్లో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీంతో ఆదివారం రాత్రి నుంచి మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వాటిని తెరిచే ప్రసక్తే లేదని ఎన్నికల అధికారి, కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్మకాలు చేపట్టి, అల్లర్లకు కారకులైతే కఠిన చర్యలు తప్పవన్నారు.

News March 3, 2025

ప.గో : కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర

image

గత నెల 27వ తేదీన జరిగిన ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా అభ్యర్థులు అందరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితం సోమవారం సాయంత్రం 6 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది.

News March 3, 2025

పాలకొల్లు: మాజీ మంత్రి జోగయ్యకు బన్నీ వాసు పరామర్శ

image

ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను ఆదివారం పాలకొల్లులో జనసేన నేత బన్నీ వాసు పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. పలు రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోనం చినబాబు, శిడగం సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

News March 2, 2025

ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

image

✷ ప.గో జిల్లాలో ఊపందుకున్న చికెన్ అమ్మకాలు ✷ మావుళ్ళమ్మ అమ్మవారి సేవలో యాంకర్ ఓంకార్ ✷ వేల్పూర్‌లో చికెన్ మేళా ✷ మత్స్యకారుల అభివృద్ధికి కృషి : కేంద్ర సహాయ మంత్రి ✷ ఉండిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి✷ పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి ✷ పాలకొల్లును కమ్మేసిన పొగ మంచు✷కాలువలోకి దూసుకెళ్లిన రొయ్యల లారీ.

News March 2, 2025

భీమవరం: మావుళ్ళమ్మ సేవలో యాంకర్ ఓంకార్

image

భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని ప్రముఖ యాంకర్ ఓంకార్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. ఓంకార్‌తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.

News March 2, 2025

మత్స్యకారుల అభివృద్ధికి కృషి: కేంద్ర మంత్రి

image

‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ ద్వారా మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదేశించారు. భీమవరం బీజేపీ కార్యాలయంలో మత్స్య శాఖ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలను విన్నారు, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

News March 2, 2025

భీమవరం: జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు 16 మంది ఎంపిక

image

7వ జాతీయ స్థాయి బధిర టీ20 క్రికెట్ పోటీలకు 16 మంది ఎంపికయ్యారని జిల్లా బధిర క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రంగసాయి తెలిపారు. వీరు ఏప్రిల్ 19 నుంచి 25 వరకు హర్యానా కాచపూర్ గురుగామ్‌లో జరిగే బధిర క్రికెట్ టీ20 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆదివారం భీమవరం లో ఆయన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

News March 2, 2025

పశ్చిమగోదావరి జిల్లాలో ఊపందుకుంటున్న చికెన్ విక్రయాలు

image

బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చికెన్ అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. రెడ్‌జోన్ మినహా అన్ని ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు జరపొచ్చని ఇటీవల కలెక్టర్ ప్రకటన కూడా చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. కిలో రూ.200 వరకు విక్రయిస్తున్నారు. అయితే రెడ్‌జోన్ పరిధి సమీప ప్రాంతాల్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కిలోకు అరకిలో మాంసం ఉచితంగా అందజేస్తున్నారు.

News March 2, 2025

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు: ఏలూరు కలెక్టర్

image

ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన చేసుకుని పారదర్శకతతో లెక్కింపు చేయాలని MLC ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సిబ్బంది 3వ తేదీ ఉ.6 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఉ.8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాగా ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News March 1, 2025

ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

image

✷ తాడేపల్లిగూడెంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్ ✷ జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం ✷ మార్చి 15 నుంచి 10వ తరగతి పరీక్షలు ✷ ఢిల్లీలో వర్క్ షాపునకు ఎంపికైన మహదేవపట్నం సర్పంచ్ ✷ పోలీస్ ఇండోర్ పరీక్షల్లో టాపర్‌గా మార్టేరు అమ్మాయి ✷ తణుకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ ✷ తణుకులో 123 మంది పరీక్షలకు గైర్హాజరు

error: Content is protected !!