India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం హార్టీసెట్-2024 ఫలితాలను ఉపకులపతి గోపాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హార్టీసెట్ పరీక్షకు 26 మంది విద్యార్థులు హాజరు కాగా, 255 మంది ఉత్తీర్ణులైనట్టు వివరించారు. అనుముల విజయలక్ష్మి (మడకశిర), కుంపాటి పావని (కోయలకుంట్ల ), గోసల సతీష్ (పొదిలి) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారన్నారు.
భీమవరం మున్సిపాలిటీ ఉద్యోగి ఉదయ్ తనను ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాధవి అనే యువతి ఆరోపించింది. ఆమె వివరాల ప్రకారం.. భీమవరంలోని గునుపూడికి చెందిన ఉదయ్, తాను 10ఏళ్లు ప్రేమించుకున్నామని, మున్సిపాలిటీలో జాబ్ రావడంతో ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని వాపోయింది. పంచాయితీ పెట్టగా పెద్దలు కూడా హేళనగా మాట్లాడారని, అందుకే శుక్రవారం కలెక్టర్ను కలవనున్నట్లు తెలిపింది.
ప.గో జిల్లా పాలకొల్లు పట్టణంలో శుక్రవారం విషాదం నెలకొంది. పాలకొల్లు-నరసాపురం వెళ్లే రైలు మార్గంలో ఓ ప్రేమ జంట శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రైన్ వచ్చే సమయంలో ప్రియుడు రాజేశ్ ప్రియురాలిని పక్కకు నెట్టేసి రైలు కింద దూకేశాడు. యువతిని చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉండి MLA రఘురామకృష్ణరాజు కేసుపై గుంటూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిందితులుగా పేర్కొన్న మాజీ CM జగన్, CID పూర్వపు GD సునీల్కుమార్, అప్పటి నిఘా బాస్ ఆంజనేయులు తదితరులకు నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. తనపై హత్యాయత్నం చేసిన వారితో పాటు అందుకు ప్రోత్సహించిన వారిని, ఘటనను కప్పిపుచ్చేందుకు సహకరించిన వారిని బాధ్యులుగా చేయాలని RRR పోలీసులను కోరారు.
ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువకుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలానికి చెందిన రవికుమార్ తనను మోసం చేశాడని ప.గో జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద్కు చెందిన యువతి ఫిర్యాదు చేసినట్లు నరసాపురం రూరల్ SI సురేశ్ తెలిపారు. దీంతో రవికుమార్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖలో గుమస్తాగా పనిచేస్తున్న కాజా కిరణ్ కొద్ది రోజుల కింద ఏలూరుకు చెందిన గెడ్డం శ్రీవంశీ వద్ద కొంత సొమ్ము అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమంలో శ్రీవంశీకి బ్యాంక్ చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కు బ్యాంకులో వేస్తే చెల్లలేదు. దీంతో శ్రీవంశీ కోర్టును ఆశ్రయించారు. ఏలూరు మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టు కిరణ్కు ఏడాది జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది.
ఇటీవల ఒలింపిక్స్లో పాల్గొన్న తణుకు పట్టణానికి చెందిన క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అభినందించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతికశ్రీకి శాలువా కప్పి అభినందించి జ్ఞాపిక అందజేశారు. రాబోయే రోజుల్లో క్రీడల్లో మరింత రాణించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైదరాబాద్లో ‘హైడ్రా’ నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అలాంటి ‘హైడ్రా’ అవసరం మన ఉమ్మడి. ప.గో జిల్లాకు కూడా అవసరం ఉందని ఊర్లలో చర్చలు నడుస్తున్నాయి. ఇరగవరం, ఆచంట, ఆకివీడు, భీమవరం ఇలా చాలా మండలాల్లో ఆక్రమణలు చాలా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తు్న్నాయి. ఉమ్మడి జిల్లాలో 11 పంట కాలువలు, వందల బోదెలుండగా, వాటిలో చాలా వరకు ఆక్రమించేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ప.గో జిల్లాలో సెప్టెంబరు నెల పెన్షన్లు ఆగస్టు 31వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 2,31,075 మందికి రూ.96.95 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆగస్టు 31 నాడే 100 శాతం పింఛన్ల పంపిణీని టార్గెట్గా పెట్టుకున్నామన్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని జీడి పిక్కల ఫ్యాక్టరీ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని దగ్గుమళ్ల రామారావుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బొర్రంపాలెం గ్రామానికి చెందిన రామారావు ఓ శుభకార్యానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.