WestGodavari

News February 26, 2025

పశ్చిమగోదావరిలో TODAY TOP HEADLINES

image

✷ ప.గో జిల్లా రెండు రోజులపాటు జిల్లాలో వైన్ షాపుల బంద్
✷ జిల్లాలో మొదలైన శివరాత్రి ఉత్సవాలు 
✷ ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
✷ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సెలవు ప్రకటించిన కలెక్టర్
✷ మొగల్తూరులో చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష
✷ నర్సాపురం శివరాత్రి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

News February 25, 2025

ప.గో: కూటమి అభ్యర్థితో వైరల్ అవుతున్న పవన్ AI ఫొటో

image

ప.గో జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ AI ఫొటో వైరల్‌గా మారింది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి పట్టభద్రుల MLC కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కి నిన్న మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ఓ వీడియో ద్వారా సోమవారం తెలిపారు. అయితే ఆయన ఓటును అభ్యర్థిస్తూ AIతో చేసిన ఫొటోను కూటమి నేతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

News February 25, 2025

ఏలూరు: మసాజ్ సెంటర్ కేసులో నిందితుడు అరెస్ట్

image

ఏలూరులో మసాజ్ సెంటర్ల పేరిట వ్యభిచారం నిర్వహించిన ఘటన ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు భాను ప్రసాద్ పోలీసులకు చిక్కాడు. సోమవారం సాయంత్రం అతణ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఏలూరు సబ్ జైలుకు తరలించారు.

News February 25, 2025

నవదంపతులను ఓటు అభ్యర్థించిన ఏపీఐఐసీ ఛైర్మన్

image

కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో సోమవారం ఓ పెళ్లి ఫంక్షన్‌కి హాజరైన ఏపీఐఐసీ ఛైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు నూతన వధూవరులను ఆశీర్వదించి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి ఓటు వేయాలని అభ్యర్థించారు. దీనితో వధూవరులు కూడా కూటమి ప్రభుత్వంకు మద్దతుగా ఓటు వేస్తామని ఆయనకి హామీ ఇచ్చారు. దంతులూరి శ్రీనివాసరాజు, బూడి వెంకట పర్రాలు, గడి రాము తదితరులు పాల్గొన్నారు.

News February 24, 2025

ప.గో: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు..కలెక్టర్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా అంతటా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పీజీఆర్ఎస్ నిర్వహించే తేదీని ప్రకటన ద్వారా తెలియచేస్తామని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.

News February 23, 2025

అమెరికా రాజకీయాల్లో తణుకు యువకుడు

image

అమెరికా రాజకీయాల్లో తణుకుకి చెందిన యువకుడు సత్తి ఆదిత్యరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల హోరా హోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ క్యాంపైన్ బృందంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందు ఆర్మీ నేషనల్ గార్డ్‌గా పనిచేసిన ఆయన రిపబ్లిక్ పార్టీలో, ట్రంప్ ప్రభుత్వంలో అధికారిక హోదా పొందబోతున్నారు. వైట్ హౌస్‌లో జరిగే దాదాపు అన్ని కార్యక్రమాలకు ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

News February 23, 2025

నరసాపురం నుంచి బైకుపై కుంభమేళాకు..

image

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు నరసాపురం వాసులు బైకుపై వెళ్లొచ్చామన్నారు. పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు చామర్తి రవి కుమార్, నాగేంద్ర బైక్‌పై రోజుకు 500కిమీ చొప్పున 3 రోజులు ప్రయాణించి ప్రయాగ్రాజ్‌కు వెళ్లారు. పవిత్ర స్నానం తర్వాత 18న బయల్దేరి 21న నరసాపురం వచ్చారు. పెట్రోల్ బంకుల్లో టెంట్లలో బస చేస్తూ వెళ్లొచ్చినట్లు తెలిపారు.

News February 23, 2025

తాడేపల్లిగూడెం: డాక్టర్ నాగేశ్వరరావు మృతి

image

తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ డాక్టర్ కర్రి నాగేశ్వరరావు (84) వయోభారంతో శనివారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన అకాల మృతికి పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగేశ్వరావు భౌతిక కాయాన్ని పట్టణానికి చెందిన వైద్యులు, పలువురు ప్రముఖులతో పాటు సీనియర్ న్యాయవాది మాకా శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు ప్రభృతులు సందర్శించి నివాళులర్పించారు.

News February 22, 2025

పెనుగొండ: చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ 

image

పెనుగొండలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఒక రోజులోనే ఛేదించారు. పెనుగొండలో గుబ్బల లక్ష్మీనారాయణ కుటుంబం షిరిడీ వెళ్లడంతో విషయం తెలుసుకొని చోరీకి పాల్పడ్డారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో చిన్నంవారిపాలెం వద్ద నివాసం ఉంటున్న కె. పోతురాజు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. అతని నివాసం వద్ద తనిఖీ నిర్వహించి 49 ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ నయీమ్ ఆచంటలో వివరించారు.

News February 22, 2025

పాలకొల్లు: జగన్‌కు సవాలు విసిరిన మంత్రి నిమ్మల

image

వెలిగొండ ప్రాజెక్టుపై వాస్తవాలను ఎవరు వక్రీస్తున్నారో ప్రజా క్షత్రంలో తెల్చుకుందామని, మాజీ సీఎం జగన్‌కు మంత్రి నిమ్మల శుక్రవారం సవాల్ విసిరారు. పోడూరు మండలం జిన్నూరులో రూ.3 కోట్లతో చేపట్టిన ప్రధాన కాలువ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ..వెలిగొండ ప్రజెక్ట్‌ను మూడుసార్లు సందర్శించాను. ప్రాజెక్ట్ పూర్తికాలేదని జగన్ ఒప్పుకున్నట్లైతే జాతికి ఎలా అంకితమిచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

error: Content is protected !!