WestGodavari

News August 26, 2024

ట్రైన్‌లో మర్చిపోయిన ఆభరణాల బ్యాగ్‌ అప్పగింత

image

ఏలూరుకు చెందిన దంపతులు రైలులో 20 కాసుల బంగారం, వెండి ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ మర్చిపోగా.. రైల్వే పోలీసులు తిరిగి అప్పగించారు. శ్రీనివాసరావు-శ్రీదేవి సికింద్రాబాద్‌లో రైలు ఎక్కారు. ఏలూరులో దిగేటప్పుడు బ్యాగు మర్చిపోయారు. దానిలో ఆభరణాలు ఉండటంతో విజయవాడ జీఆర్పీ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి నిడదవోలు అవుట్ పోస్ట్‌కు సమాచారం రాగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వెళ్లి ఆ బ్యాగును గుర్తించారు.

News August 26, 2024

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏలూరు ఎంపీ

image

జిల్లాలో చేపల చెరువుల్లో కోళ్ళ వ్యర్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తగు ఆదేశాలు ఇస్తామన్నారు. ఏలూరులోని మత్స్యశాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ నాగలింగాచారి, బాదంపూడి అసిస్టెంట్ డైరెక్టర్ నరసయ్య పాల్గొన్నారు.

News August 26, 2024

టీడీపీలోకి ఏలూరు మేయర్..!

image

ఏలూరులో వైసీపీకి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు TDPలో చేరేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు మంత్రి లోకేశ్ సమక్షంలో రేపు టీడీపీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. 30 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. మేయర్ దంపతుల రాజకీయ ప్రస్థానం 2013లో టీడీపీతోనే మొదలైంది.

News August 26, 2024

ఏలూరు: ‘జెన్ ప్యాక్ట్‌లో ఉద్యోగ అవకాశాలు’

image

జెన్ ప్యాక్ట్‌ MNC సంస్థలో ఉద్యోగాలకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.సుధాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించవచ్చని అన్నారు.

News August 26, 2024

ప.గో: రూ.90.51 కోట్ల బ్యాంక్ రుణాల పంపిణీ

image

ప.గో జిల్లాలో 736 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు లక్ పతి దీదీ ప్రోగ్రాం కింద రూ.90.51 కోట్ల బ్యాంక్ రుణాల చెక్కులను పంపిణీ చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్రోగ్రాంను ప్రారంభించగా.. ప.గో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.

News August 25, 2024

ప.గో: విహారయాత్రకెళ్లి కజకిస్థాన్‌లో మృతి

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లికి చెందిన పసుమర్తి చందు కజకిస్థాన్‌కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ గుండెపోటు రావడంతో ఆదివారం మృతి చెందారు. ప్రస్తుతం ఆయన పంచాయతీ పాలకవర్గ సభ్యుడిగా ఉన్నారు. గతంలో ఉప సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పని చేశారు. చందు మృతి పట్ల ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నేత వలవల బాబ్జీ, టీడీపీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్ తదితరులు విచారం వ్యక్తం చేశారు.

News August 25, 2024

చేబ్రోలు కోట్లమ్మ జాతరలో ఏలూరు ఎంపీ 

image

ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామదేవత కోట్లమ్మ 72వ జాతర మహోత్సవంలో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులుతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ మేరకు జాతర కమిటీ నిర్వాహకులు తొలుత ఆలయ మర్యాదలతో ఎంపీ మహేష్‌ను స్వాగతించారు. అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News August 25, 2024

ఏలూరు జిల్లాలో YSR విగ్రహం ధ్వంసం

image

ఏలూరు జిల్లాలో YSR విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. జంగారెడ్డిగూడెం మండలం కృష్ణంపాలెం గ్రామంలో YSR విగ్రహాన్ని శనివారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఇవాళ ఉదయాన్నే ఈ ఘటనను గుర్తించారు. ఎంపీటీసీ బిరుదుగట్ల రత్నకుమారి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గ్రామంలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News August 25, 2024

ప.గో జిల్లాలో సగటు వర్షపాతం 17.6 మి.మీ

image

ప.గో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నరసాపురం మండలంలో 62 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మండలాల వారీగా తణుకు- 20. ఆకివీడు- 14.2, ఉండి- 17.2, పాలకోడేరు- 30.2, పెనుమంట్ర- 20.6, ఆచంట- 20.2, పోడూరు- 10.4, వీరవాసరం- 13.4, కాళ్ల- 13.2, మొగల్తూరు- 24.4, పాలకొల్లు- 30.3, యలమంచిలి- 50.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News August 25, 2024

ఏలూరు జిల్లాలో 7,613 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా

image

ఏలూరు జిల్లాలో శనివారం మూడు బుకింగ్ సెంటర్ల ద్వారా 1,526 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసినట్టు మైనింగ్ డీడీ సునీల్ తెలిపారు. జిల్లాలో ఇంతవరకు మొత్తం 7,613 మెట్రిక్ టన్నుల ఇసుక వినియోగదారులకు సరఫరా చేశామని తెలిపారు. ఇబ్రహీంపేట స్టాక్ పాయింట్ వద్ద మెట్రిక్ టన్ను రూ.210, చేబ్రోలు స్టాక్ పాయింట్ వద్ద రూ.538, వింజరం స్టాక్ పాయింట్ వద్ద పాయింట్ వద్ద టన్ను రూ.362కు ఇసుకను సరఫరా చేశామని వివరించారు.