India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో జిల్లా ప్రజలు ఎలాంటి భయం లేకుండా చికెన్ తినొచ్చని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం తణుకులో నిర్వహించిన చికెన్ మేళాలో ఆమె పాల్గొన్నారు. దాదాపు 10 వేల మందికి ఉచితంగా అందిచారు. ఫౌల్ట్రీ రైతులను రుణాల రీషెడ్యూల్కు ప్రయత్నిస్తామని కలెక్టర్, MLA రాధాకృష్ణ తెలిపారు. వేల్పూరు కృష్ణానందం కోళ్లఫారం, పెదతాడేపల్లిలో రామలక్ష్మి ఫారం నుంచి కి.మీ పరిధిలో మినహా జిల్లా మొత్తం చికెన్ తినొచ్చన్నారు.
సిద్ధాంతం అయ్యప్ప స్వామి గుడి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధాంతం చెరువుపేటకు చెందిన పమ్మి చినబాబు (30)మృతి చెందాడు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఈతకోట రొయ్యల ఫ్యాక్టరీలో డ్యూటీ ముగించుకుని మోటార్ సైకిల్ పై ఇంటికి తిరిగి వెళ్తూండగా బస్సును తప్పిస్తూ, ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టాడంతో తలకు బలమైన గాయం అవ్వగా ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని మాట్లాడుతూ.. స్థానిక బీవీ రాజు కళాశాలలో పండుగ వాతావరణంలో మహిళా దినోత్సవం వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరు హాజరవుతారన్నారు.
భీమవరం పట్టణంలోని డాక్టర్ బి.వి రాజు ఆడిటోరియంలో జిల్లా పంచాయతీ కార్యదర్శుల సమీక్షా సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ..పంచాయతీలు మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేసి, ప్లాస్టిక్ నిషేధంపై పూర్తిగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో అరుణశ్రీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
✷ TPG: జగన్పై ఎమ్మెల్యే బొలిశెట్టి ఫైర్ ✷ భీమవరం: 6న గీత కులాల మద్యం షాపుల డ్రా ✷మాజీ ఎమ్మెల్యే పాడె మోసిన తణుకు ఎమ్మెల్యే ✷ ప.గో: నిధులు వినియోగంలో ఏపీఐఐసీ తీవ్ర జాప్యం✷ నరసాపురంలో 8 కేజీల వెండి చోరీ ✷అత్తిలి: స్నేహితుల మధ్య ఘర్షణ..వ్యక్తి హత్య✷ నిడమర్రు: ఆక్వా రైతు ఆత్మహత్య✷ ఏలూరు: రాజకీయ ప్రత్యర్థుల ఆత్మీయ అనుబంధం ✷ కాళ్ల: ఎమ్మెల్సీ పేరాబత్తులను అభినందించిన RRR
పవన్ కళ్యాణ్ని ఏదోకటి విమర్శిస్తేనే కానీ జగన్ని ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పట్టించుకొనే పరిస్థితి లేదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బుుధవారం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..పవన్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ పవన్ విమర్శించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రజలు ఇవ్వని ‘ప్రతిపక్ష హోదా’ని అడుక్కోవడం ఏంటని ప్రశ్నించారు.
సాధారణంగా రాజకీయాల్లో కానీ ఆటల్లో కానీ పోటీల్లో కానీ వ్యాపారంలో కానీ ఇలా ఏ రంగంలో అయినా ప్రత్యర్థులు అంటే ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఉంటారు. అయితే ఎమ్మెల్సీగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ దిడ్ల వీర రాఘవులు వీరిద్దరూ పోటీపడ్డారు. అంతేకాక కౌంటింగ్లో కూడా వీరిద్దరి మధ్యనే పోటీ నెలకొంది. అయితే రాజశేఖర్ గెలిచాక స్నేహపూర్వక వాతావరణంలో కౌంటింగ్ సెంటరులో ఇరువురూ ఆత్మీయంగా నవ్వుతూ పలకరించుకున్నారు.
తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు(86) బుధవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలినాళ్లలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తరపున 1983లో పోటీ చేసి వెంకటేశ్వరరావు గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయలేదు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈయన మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ముళ్ళపూడి వెంకటకృష్ణారావు సంతాపం తెలిపారు.
అత్తిలి మండలం దంతుపల్లిలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన జుత్తిగ వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ స్నేహితులు కాగా మంగళవారం కలిసి మద్యం తాగారు. ఈ సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరగగా వీరాంజనేయులు తలపై వెంకటనారాయణ రాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామ శివారులోని వీరాంజనేయులు మృతదేహం లభ్యం కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పుల బాధ తాళలేక ఆక్వా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిడమర్రు(M) గుణపర్రులో జరిగింది. గ్రామంలో రొయ్యలు చెరువు సాగు చేస్తున్న నిమ్మల శ్రీను సుమారు రూ.కోటి మేర నష్టపోయాడు. అప్పులు తీర్చలేనని మనోవేదనకు గురై విషం తాగాడు. ఆ తర్వాత సోదరుడికి ఫోన్ చేయడంతో బంధువులు గాలించి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.