WestGodavari

News April 18, 2025

ప.గో: తప్పులు లేకుండా పూర్తి చేయాలి..కలెక్టర్ 

image

ఓటరు నమోదు, చేర్పులు, మార్పులు, క్లెయిమ్స్ పరిష్కార ప్రక్రియను తప్పులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం భీమవరంలో కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై క్లెయిమ్స్ పరిష్కారం పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం ఓటర్లు14లక్షల 70వేల 886మంది ఉండగా వీరిలో పురుషులు 7లక్షల 20వేల 613మంది, మహిళలు 7లక్షల 50వేల 197మంది, ట్రాన్స్ జెండర్స్ 77మంది ఉన్నారన్నారు.

News April 17, 2025

పాలకొల్లు: చాంబర్స్ కళాశాలలో 17న మెగా జాబ్ మేళా

image

ఈనెల 17 గురువారం ఉ.9 గంటల నుంచి పాలకొల్లు చాంబర్స్ కళాశాలలో ఏపీ ప్రభుత్వ శిక్షణ, ఉద్యోగ కల్పనా సంస్థ సౌజన్యంతో 13 కంపెనీలతో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. ఐసీఐసీఐ, హెచ్‌డి‌ఎఫ్‌సి ,హెచ్డిబి, డెక్కన్ కెమికల్స్, పానాసోనిక్, ఇండో ఎంఐఎం, ఇసుజు, కాగ్నిజెంట్ వంటి బ్యాంకింగ్, ఐటి, నాన్ ఐటీ సంస్థలకు చెందిన వారు 470 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.

News April 17, 2025

రోడ్డు ప్రమాదంలో పెనుగొండ యువకుడు మృతి

image

వడలి పిట్టల వేమవరం రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగొండకు చెందిన తడివాడ భార్గవ్(17) మృతి చెందాడు. స్నేహితుడితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా వెనుక వస్తున్న వ్యాను టచ్ చేయడంతో మోటార్ సైకిల్ పక్కనే ఉన్న చెట్టుని బలంగా ఢీకొంది. దీంతో భార్గవ్ తలకు బలమైన గాయం కావడంతో ఘటన ప్రాంతంలో మ‌ృతి చెందాడు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు.

News April 17, 2025

ప.గో: వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

తణుకు పట్టణంలోని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ కళాశాల బాలురు, బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రూ. 18.5 లక్షలు, రూ. 8.31 లక్షలు, రూ.2.41 లక్షల వ్యయంతో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మూడు వసతి గృహాలకు చేపట్టిన నిర్మాణ పనులను  కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.

News April 16, 2025

ప.గో: భీమవరం సబ్ డివిజన్‌కు ఏబీసీడీ అవార్డు  

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం రేపిన ఉండి మండలం యండగండిలో శవం పార్సెల్ కేసు విషయం తెలిసిందే. ఈకేసును చేధించిన భీమవరం సబ్ డివిజన్ పోలీసులకు ఏబీసీడీ ప్రథమ అవార్డు లభించింది. బుధవారం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మిలు అవార్డును అందజేశారు. సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందికి డీజీపీ అభినందనలు తెలిపారు.  

News April 16, 2025

ప.గో: సమ్మర్ సెలవుల్లో ఈప్రాంతాలు చూసొద్దాం రండి..

image

వేసవి సెలవులకు టూర్ ప్లాన్ చేసుకునే వారికి ప.గోజిల్లా స్వాగతం పలుకుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలు, సముద్ర తీరాలు మనసులను కట్టిపడేస్తాయి. భీమవరం మావుళ్లమ్మ, పెనుగొండ వాసవీ ధాం, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి క్షేత్రం, నత్తా రామేశ్వరం, దువ్వ దానేశ్వరీ అమ్మవారు, కాళ్ల సీసలి సాయిబాబా మందిరం, పేరుపాలెం బీచ్ సందర్శించి ఆహ్లాదాన్ని పొందవచ్చు. మీరేమైనా టూర్ ప్లాన్ చేసుకున్నారా కామెంట్ చేయండి.

News April 16, 2025

ఉమ్మడి ప.గో. జిల్లాలో 166 పోస్టులు

image

విద్యాశాఖ పాఠశాల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించేందుకు కొత్తగా 105 SGT, SA కేడర్లలో ఉపాధ్యాయ పోస్టులను ఉమ్మడి ప.గో.జిల్లాకు మంజూరు చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు మంజూరైన 61 (SET) పోస్టులతో కలిపితే మొత్తం 166 పోస్టులయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం 2,671 మంది ఉండగా, యూడైస్ కోడ్ ఆధారంగా పోస్టులు ఆమోదిస్తారని అభ్యర్థులు భావిస్తున్నారు.

News April 16, 2025

కాళ్ల: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో టీచర్

image

కాళ్ల మండలం సీసలి హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న చెల్లుబోయిన పద్మ సంగీత వాయిద్య ప్రదర్శనల్లో అత్యంత ప్రతిభ కనబర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. కీబోర్డ్ ఉపయోగించి సంగీతంలో మంచి ప్రతిభ కనబర్చిన పద్మకు హైదరాబాద్ హలెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు పత్రాన్ని అందించారు.

News April 16, 2025

ప.గో: సూర్యఘర్ పథకం అనుకున్నంతగా లేదు..కలెక్టర్ 

image

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం సీఎం సూర్యఘర్ పథకం అమలుపై జిల్లాలోని విద్యుత్ శాఖ ఈఈలు, డిఇలు, ఏఈలతో గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఇప్పటివరకు14,392 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ చేయగా, 917 గృహాలకు మాత్రమే సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. జిల్లాలో ఈ పథకం అమలు అనుకున్నంత వేగంగా జరగటంలేదని అసహనం వ్యక్తం చేశారు.

News April 14, 2025

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా చెరుకువాడ

image

వైసీపీ పీఏసీ సభ్యులను పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. ఈ జాబితాలో రాష్ట్ర మాజీ మంత్రి, ఆచంట మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు చోటు దక్కింది. పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర, ఆచంట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రంగనాథరాజుకు అభినందనలు తెలుపుతున్నారు. అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.