India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని మర్లగూడెం గ్రామానికి చెందిన సంకురమ్మ ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లి అక్కడ ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవ తీసుకొని బుధవారం ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. కువైట్ నుంచి వచ్చిన సంకురమ్మ గురువారం ఏలూరు కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసింది.
ఈనెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులతో ఉమ్మడి ప.గో జిల్లాలో పలువురు ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది. విద్య, వైద్య శాఖలు మినహా మొత్తం 15 శాఖల్లో బదిలీలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఏళ్ల తరబడి ఒకే చోట పని చేస్తున్న వారిలో కొందరు ఇప్పటికే పైరవీల కోసం యత్నిస్తున్నారట. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో ఎక్కువ బదిలీలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
విజయవాడలో జరిగిన రోడ్డుప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలోని సమతానగర్కు చెందిన కానిస్టేబుల్ తారక రామారావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహానికి గురువారం అధికారిక లాంఛనాలతో గ్రేహౌండ్స్ పోలీసులు అంతిమ వీడ్కోలు పలికారు. తారక రామారావు మృతి పోలీస్ డిపార్ట్మెంట్కు తీరని లోటని పలువురు పేర్కొన్నారు.
విజయవాడలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ప.గో. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. ఆకివీడు మండలం సమతానగర్కు చెందిన కొట్నాని తారకరామారావు (37) విజయవాడలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు స్టేషన్ నుంచి బైక్పై ఇంటికి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఓ లారీ అతణ్ని వెనక నుంచి ఢీ కొట్టగా మృతిచెందాడు. ఎనిమిదేళ్ల క్రితం అతని సోదరుడు సైతం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై కేసు నమోదుచేసినట్లు సమిశ్రగూడెం SI రమేశ్ తెలిపారు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరం జడ్పీ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగమణి రాజు కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కొందరు అతనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఆ మేరకు విచారణ చేసి సస్పెండ్ చేశారు. HM లలితారమణి ఫిర్యాదుతో కేసు నమోదుచేశారు.
గత సంవత్సర కాలంగా ఏలూరు ప్రజలు ఎదురు చూస్తున్న వందే భారత్ ఎఎక్స్ప్రెస్కు బుధవారం హాల్ట్ ఇచ్చారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కృషి ఫలితంగా వందే భరత్ రైలును ఏలూరులో నిలుపుదల చేసేందుకు రైల్వేశాఖ అంగీకరించింది. ఈ మేరకు రైల్వే బోర్డు జాయింట్ డైరెక్టర్ వివేక్ కుమార్ సిన్హా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వర్తక వాణిజ్య వర్గాలతోపాటు ప్రజలందరిలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.
గత సంవత్సర కాలంగా ఏలూరు ప్రజలు ఎదురు చూస్తున్నా వందే భారత్ ఎక్స్ప్రెస్కు బుధవారం హార్ట్ ఇచ్చారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కృషి ఫలితంగా వందే భరత్ రైలును ఏలూరులో నిలుపుదల చేయుటకు రైల్వేశాఖ అంగీకరించింది. ఈ మేరకు రైల్వే బోర్డు జాయింట్ డైరెక్టర్ వివేక్ కుమార్ సిన్హా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వర్తక వాణిజ్య వర్గాలతోపాటు ప్రజలందరిలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.
ఏలూరు టి.నరసాపురం మండలంలో బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ పలు దళిత సంఘాలకు చెందిన నాయకులు బంద్కు సహకరించాలని బంధంచర్ల గ్రామంలో పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక హోటల్ యాజమాన్యంతో జరిగిన వాగ్వాదంలో హోటల్ యాజమాని దళిత యువకుడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో గాయాలు పాలైన బాధితుడిని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప.గో. జిల్లా ఆచంట మండలం కోడేరులంకకు చెందిన రమేశ్ తూ.గో. జిల్లా పి.గన్నవరం మండలం L.గన్నవరంలో PMPగా వైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వరలక్ష్మిని ప్రేమించాడు. అమ్మాయి తండ్రి రమణకు విషయం చెప్పగా ఒప్పుకోలేదు. దీంతో ఆదివారం వారు ఓ చర్చిలో పెళ్లి చేసుకొని ఇంటికెళ్లారు. విషయం తెలిసిన రమణ మంగళవారం రాత్రి అబ్బాయి ఇంటికెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
పొగాకు రైతులు కొందరు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఢిల్లీలో కేంద్ర కామర్స్ మంత్రిని ఎంపీ మహేశ్ ఇటీవల కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంటపై పెనాల్టీ రద్దు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు పెనాల్టీ రద్దు చేస్తూ మంగళవారం జీవో విడుదల చేసిందని ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Sorry, no posts matched your criteria.