WestGodavari

News August 20, 2024

ప.గో: వ్యభిచార గృహంపై దాడి

image

వ్యభిచారం ముఠాపై కొవ్వూరు పోలీసులు మంగళవారం దాడి జరిపారు. కొవ్వూరులోని రాజీవ్ కాలనీలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో వెళ్లి దాడి చేసినట్లు పట్టణ సీఐ విశ్వం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శిబిరం నిర్వాహకురాలు లక్ష్మీని అరెస్ట్ చేశామన్నారు. రాజమహేంద్రవరం, వైజాగ్‌కు చెందిన ఇద్దరు యువతలను ఆమె చెర నుంచి విడిపించినట్లు సీఐ పేర్కొన్నారు.

News August 20, 2024

‘మీ కోసం’ వినతులపై శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖలలో “మీకోసం” ఫిర్యాదులను పరిశీలించే అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మీకోసం వినతుల పరిష్కారం ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే వినతులను జిల్లా అధికారులు స్వయంగా పరిశీలించి సరైన పరిష్కారాన్ని అందించాలని ఆదేశించారు.

News August 20, 2024

ఉపాధ్యాయురాలిగా మారిన ఏలూరు కలెక్టర్

image

ఏలూరులోని శనివారపుపేటలో ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి మంగళవారం సందర్శించారు. ప్రభుత్వ బాలుర వసతి గృహంలో వసతి పొందుతున్న 63 మంది వీధి బాలలు, బిక్షాటన చేయు బాలలు, వివిధ కారణాల వలన తల్లిదండ్రులకు దూరమైన వారు, 7 సంవత్సరాల వయసు నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలందరిని పలకరించారు. క్లాస్ ‌రూమ్‌లో పాఠాలు బోధించారు.

News August 20, 2024

జగన్ కేసులపై హరిరామజోగయ్య పిల్.. హైకోర్ట్ విచారణ

image

మాజీ సీఎం జగన్‌పై ఉన్న కేసుల విచారణ వేగంగా చేపట్టాలంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వేసిన పిల్‌పై హైకోర్ట్ ఈరోజు విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ జరిగింది. తిరిగి పిటిషన్లపై విచారణను హైకోర్ట్ సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.

News August 20, 2024

ద్వారకాతిరుమల MROకు ఏలూరు ఎంపీ ఆదేశాలు

image

ద్వారకాతిరుమలలో నాయీ బ్రాహ్మణులకు కళ్యాణ మండపం నిర్మాణ నిమిత్తం స్థలం కేటాయించడంలో జాప్యంపై MRO సుబ్బరావును ఏలూరు ఎంపీ ఆరా తీశారు. స్థలం కేటాయించమని ఆదేశించి 20 రోజులైనప్పటికీ ఇప్పటివరకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. త్వరగా స్థలం కేటాయించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

News August 20, 2024

ఏలూరు: మహిళపై అత్యాచారయత్నం

image

మహిళపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ ఈ నెల 18న పొలంలో పనిచేస్తుండగా మానికల శ్రీను ఆమెను కొట్టి గాయపరిచి అత్యాచారానికి యత్నించాడు. దీంతో మహిళ కేకలు వేడయంతో శ్రీను పారిపోయాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన MLC నివేదిక ఆధారంగా శ్రీనుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News August 20, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో ఇసుక నిల్వలు ఇలా..

image

ఉమ్మడి ప.గో జిల్లాలోని ఇసుక నిల్వలను కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ప్రకటించారు. పెరవలి మండలం ఉసులుమర్రు-5,421 మెట్రిక్ టన్నులు, పెండ్యాల -1,00,948 మెట్రిక్ టన్నులు, నిడదవోలు మండలం పందలపర్రు – 35,182 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఒక్కింటికి రూ.265/- చెల్లించి ఇసుక పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.

News August 20, 2024

గిఫ్ట్స్ వచ్చాయంటే నమ్మకండి: ఏలూరు ఎస్పీ

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు ఎస్పీ ప్రతాప్ కిషోర్ సూచించారు. గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్, లింక్స్ క్లిక్ చేయవద్దని అన్నారు. నగదు, ఏవైనా విలువైన వస్తువులు బహుమతులుగా వచ్చాయంటే నమ్మవద్దని, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. ఎప్పుడైనా సైబర్ నేరగాళ్ల వలలో వెంటనే 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

News August 19, 2024

రూ.5లక్షల చెక్కు అందజేసిన మంత్రి దుర్గేశ్

image

పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన సాపిరెడ్డి గౌతమ్ రాజు గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు జనసేన పార్టీ సభ్యత్వం ఉండటంతో సోమవారం రాత్రి వారి నివాసానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ చేరుకొని రూ.5 లక్షల బీమా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. జనసేన సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి ఆపదలో పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.

News August 19, 2024

నరసాపురంలో 23న ‘ఉద్యోగ దిక్సూచి’: కలెక్టర్

image

ప.గో జిల్లాలో ఈనెల 20న జరగాల్సిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని SEP 17కు, ‘మాప్ అప్ దినం’ను SEP 25కు మార్చినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఏటా 2సార్లు నులిపురుగుల నిర్మూలన దినోత్సవం జరుగుతుందని, అంగన్వాడీలు విద్యా సంస్థల్లోని 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలన్నారు. నరసాపురంలో 23వ తేదీన జరిగే ఉద్యోగ దిక్సూచి కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.