WestGodavari

News April 12, 2025

పా.గో: రూ.కోట్లలో వసూళ్లు.. ఒకరికి రిమాండ్: CID

image

కామవరపుకోట మండలం తడికలపూడి హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ నందిగం ధర్మరాజును రాజమండ్రి CID పోలీసులు నిన్న అరెస్టు చేశారు. స్కూల్ నిర్వాహకులు నందిగం రాణి- ధర్మరాజు 15 మందిని మోసగించి రూ.కోట్లలో వసూలు చేశారని CID డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈ కేసులో 3వ నిందితుడైన ధర్మరాజును అరెస్టు చేసి గుంటూరు జైలుకు రిమాండ్‌లో తరలించామన్నారు. అటు రూ.14.74కోట్ల ఆస్తి జప్తు చేయాలని ఆదేశాలు ఉన్నాయన్నారు.

News April 12, 2025

రైతులు దళారులను ఆశ్రయించవద్దు: కలెక్టర్

image

రైతులు మద్దతు ధరకు ధాన్యాన్ని ఆర్ఎస్కేల ద్వారా మాత్రమే అమ్మాలని ఎట్టి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించవద్దని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల రైతు సేవా కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు పక్రియను పరిశీలించారు. తేమ శాతాన్ని లెక్కించే మీటర్‌ను కూడా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.

News April 11, 2025

రేపే రిజల్ట్.. పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 37,831 మంది ఇంటర్‌ విద్యార్థులు రాయగా వీరిలో ప్రథమ సంవత్సరం 19,708, ద్వితీయ సంవత్సరం 18,123 విద్యార్థులు పరీక్షల రాశారు. మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

తెలుగు మిస్ USA ఫైనల్‌కు ప.గో జిల్లా యువతి

image

వీరవాసరం మండలం రాయకుదురు శివారు నడపవారిపాలెంలో పుట్టిన కొత్తపల్లి చూర్ణం ప్రియ USA డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు
యుఎస్ఏ పోటీల్లో ఫైనల్‌కు చేరింది. 5 వేల మందిలో ఫైనల్ చేరటంతో గ్రామస్థులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె USAలో MS చేస్తుంది. మే 25న ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు. 

News April 11, 2025

దెందులూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

దెందులూరు మండలం కొమరేపల్లి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నిడమర్రు గ్రామానికి చెందిన బాపన్న(55) పెద్ద కుమారుడికి ఈ నెల 18న వివాహం. బంధువైన గరిమెళ్ల అప్పారావుతో కలిసి పెళ్లిపత్రికలు ఇచ్చేందుకు బాపన్న బైక్‌పై వెళ్లారు. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో ఈ ప్రమాదం విషాదం నింపింది.

News April 11, 2025

తెలుగు మిస్ USA ఫైనల్ కు పగోజిల్లా మహిళ 

image

వీరవాసరం మండలం రాయకుదురు శివారు నడపవారిపాలెంలో పుట్టిన కొత్తపల్లి చూర్ణం ప్రియ USA డల్లాస్ లో నిర్వహించిన మిస్ తెలుగు యు ఎస్ ఎ పోటిల్లో ఫైనల్ కు చేరింది. 5 వేల మందిలో ఫైనల్ చేరటంతో గ్రామస్థులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె USAలో MS చేస్తుంది. మే 25 న ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు. 

News April 11, 2025

ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

పెనుగొండ మండలం సిద్ధాంతంలో ఈదుబిల్లి నాగలక్ష్మి దుర్గ (18) గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెనుగొండలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటి వద్దనే ఉంటోంది. గత కొంతకాలంగా తరచూ గుండెనొప్పితో బాధపడుతుండగా ఆమెకు శస్త్ర చికిత్స చేయించి మందులు వాడుతున్నారు. ఈ క్రమంలో గురువారం నొప్పి ఎక్కువగా రావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 10, 2025

నల్లజర్ల : చిన్నపిల్లలతో HIV ఉన్న వృద్ధుడి అసభ్య ప్రవర్తన

image

చిన్నారులను HIV ఉన్న ఓ వృద్ధుడు లైంగిక చర్యలతో వేధించిన ఘటన నల్లజర్ల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పాఠశాలలో 4,5 తరగతి చదువుకుంటున్న చిన్నారులు స్కూల్ అయ్యాక ఆడుకుంటుండగా వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఆయిల్‌పామ్ తోటలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ బాలుడు తన తల్లికి చెప్పగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సాయంతో సీఐ రాంబాబు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News April 10, 2025

పాలకొల్లు : లవ్ మ్యారేజ్ ..మూడు నెలలకే ఆత్మహత్య

image

ప్రేమ వివాహం చేసుకున్న మూడు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాలకొల్లులో జరిగింది. 28వ వార్డుకు చెందిన సతీశ్ మంగళవారం భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబీకులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదుతో ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేశామన్నారు.

News April 10, 2025

ప.గో జిల్లా రొయ్య రైతు ఆవేదన

image

ప.గో జిల్లాలో రొయ్య రైతులు అయోమయంలో పడ్డారు. రాష్ట్రంలో ఆక్వాసాగు 5.75 లక్షల ఎకరాల్లో ఉంటే, ఉమ్మడి ప.గో జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి జరుగుతూ మొదటి స్థానంలో నిలిచింది. కొనుగోలు దారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో జూలై నుంచి పంట బ్రేక్‌కు పిలుపునిచ్చారు. బుధవారం ఉండిలో జరగాల్సిన ఆక్వా రైతుల సదస్సు వాయిదా పడింది.