India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంత్రి నిమ్మల రామానాయుడుకు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని మహిళలు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. అనురాగం, ఆప్యాయత, అనుబంధాలకు రాఖీ పండుగ ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
ఫొటో రెండక్షరాల జ్ఞాపకం. అప్పుడు నువ్విలా ఉండేవాడివిరా… ఆ రోజు మనమెళ్లింది ఇక్కడికేరా.. మన ఊరు ఒకప్పుడు ఇలా ఉండేది.. మొదటిసారి మనం సినిమాకెళ్లినప్పడు.. అంటూ ఫ్రెండ్స్తో గుర్తుచేసుకునే వేల జ్ఞాపకాలకు.. లక్షల మధుర స్మృతులకు వేదిక ఫొటో. ఆనాటి ఎన్నో క్షణాలను కళ్లముందుంచే ఆయుధమే చిత్రం. మరి మీకు గుర్తుండిపోయే చిత్రం ఎక్కడ, ఎవరితో తీసుకున్నారో పంచుకోండి.
– నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం పంచాయతీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసమైంది. చింతలపూడి నుంచి పామాయిల్ లోడుతో వెళ్తున్న ఓ లారీ అర్ధరాత్రి విగ్రహాన్ని ఢీ కొట్టడంతో ధ్వంసమైందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ఓ టీచర్ తన పెళ్లి శుభలేఖను వినూత్నంగా ప్రింట్ చేయించారు. నార్కెడమిల్లి సతీష్, రాణి దంపతుల కుమార్తె ప్రత్యూషకు ఈ నెల 23న పెళ్లి జరగనుంది. తన వివాహ పత్రిక వినూత్నంగా ఉండాలని భావించిన ప్రత్యూష శుభలేఖను ప్రశ్నాపత్రం రూపంలో 8 ప్రశ్నలుగా విభజించింది. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్, ట్రూఫాల్స్ ఆన్సర్ క్వశ్చన్స్గా కార్డ్ రూపొందించారు.
ఏలూరు శనివారపుపేట ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినిని ప్రేమించాలంటూ వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై ఏలూరు త్రీటౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శనివారపుపేట ప్రాంతానికి చెందిన పదవ తరగతి విద్యార్థినిని విష్ణు అనే యువకుడు ప్రేమించాలంటూ వేధిస్తూ ఉండడంతో బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో ఏలూరు త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడి జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వి.సంపత్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ఉపాధ్యాయుడు సంపత్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 8, 9వ తరగతి విద్యార్థులు డీఈవో అబ్రహంకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆయన విచారణకు ఆదేశించారు. విద్యార్థులు చెప్పిన విషయం నిజమేనని తేలడంతో సంపత్ కుమార్ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు నరసాపురం మాజీ ఎంపీ, డీఎన్ఆర్ కళాశాలల అధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆదివారం రూ.కోటి విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని మంత్రి నారా లోకేశ్కు ఆయన చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గోకరాజు గంగరాజు పారిశ్రామికవేత్తగా, సమాజ సేవకుడిగా గుర్తింపు పొందారు.
ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర విమానయాన శాఖను కోరినట్లు MLA బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం తాడేపల్లిగూడెంలోని ఆయన క్యాంపు కార్యాలయం ప్రతినిధులు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. వెంకట్రామన్నగూడెం ప్రాంతంలో భూమిని పరిశీలించి, అనుమతులు రాగానే ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
పోలవరం ఎడమ, కుడి కాలువ (ఎల్ఏ) కార్యాలయ ఫైళ్ల దహనం కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సీనియర్ అసిస్టెంట్లు నూకరాజు, కారం బేబి, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళాజ్యోతి, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ రాజశేఖర్ను సస్పెండ్ చేస్తూ తూ.గో కలెక్టర్ ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహశీల్దార్లు కుమారి, సత్యదేవికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్లలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ తిరగబడి రెబ్బా నాగేంద్రబాబు(23) మృతి చెందాడు. పొలం పనులు చేస్తుండగా ట్రాక్టర్ తిరగబడటంతో నాగేంద్ర ప్రాణాలు కోల్పోయాడు.
Sorry, no posts matched your criteria.