WestGodavari

News August 26, 2025

‘తల్లికి వందనం పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారానికి చర్యలు’

image

జిల్లాలో తల్లికి వందనం పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తల్లికి వందనం ఖాతాలో నగదు జమ చేయడానికి ఇబ్బందిగా ఉన్న అంశాల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

News August 25, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 248 అర్జీలు: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ప్రజల నుంచి 248 అర్జీలు స్వీకరించి పరిశీలించారు. అర్జీదారుడికి సంతృప్తి కలిగేలా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సైతం సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 25, 2025

కేపీపాలెం‌ బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్‌లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ ఓ యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మొగల్తూరు మండలం కొత్తపాలెంకు చెందిన శ్రీహర్ష(17) తన కుటుంబ సభ్యులతో కలిసి సముద్రంలో స్నానం చేస్తున్నాడు. ఈక్రమంలో అలల ఉద్ధృతికి లోపలికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సోమవారం శ్రీహర్ష మృతదేహం లభ్యమైంది. మృతదేహన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు,

News August 25, 2025

స్మార్ట్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా 1. 51 లక్షల స్మార్ట్ కార్డులు వచ్చాయని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద స్మార్ట్ కార్డుల పంపిణీ చేశారు. క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో జరిగే అక్రమాలను సులభంగా అరికట్టవచ్చన్నారు. స్మార్ట్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 25, 2025

కేపీ పాలెం బీచ్‌లో యువకుడి గల్లంతు

image

మొగల్తూరులోని కేపీ పాలెం బీచ్‌లో ఆదివారం ఓ యువకుడు గల్లంతయ్యాడు. మొగల్తూరులోని కొత్తపాలేనికి చెందిన శ్రీహర్ష కుటుంబీకులతో ఆదివారం బీచ్‌కు వచ్చాడు. సముద్ర స్నానం చేస్తూ అలల ఉద్ధృతికి లోపలికి కొట్టుకుపోయాడు. యువకుని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు.

News August 25, 2025

జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ ఆధారిత 5 లక్షల 51 వేల స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రభుత్వం రేషన్ పంపిణీని మరింత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో నిర్వహించే లక్ష్యంగా పాత కార్డులు స్థానంలో రాజముద్రతో ఏటీఎం కార్డు సైజులో ముద్రించిన క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రైస్ కార్డులను అందుబాటులో తీసుకొచ్చిందన్నారు.

News August 25, 2025

యధావిధిగా పీజిఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అలాగే 1100 నంబర్‌కు కాల్ చేసి కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చని కలెక్టర్ అన్నారు.

News August 24, 2025

మూడు జిల్లాల్లోని ఏకైక పోస్టుకు వేణు మాధురి ఎంపిక

image

డీఎస్సీ-2025 పరీక్షలో తాడేపల్లిగూడెం చెందిన వేణు మాధురి మూడు జిల్లాల్లో ఉన్న ఏకైక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుకు ఎంపిక కావడం విశేషం. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్‌కు ఎంపిక కావడంతో పాటు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 11వ ర్యాంకు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు 17వ ర్యాంకు సాధించారు. అంతేకాకుండా తల్లిదండ్రులు, సోదరి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం విశేషం.

News August 24, 2025

DSCలో జువ్వలపాలెం యువకుడికి నాలుగు కొలువులు

image

డీఎస్సీ ఫలితాల్లో కాళ్ల మండలం జువ్వలపాలెంకు చెందిన నడిమింటి రాము ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించాడు. ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఉమ్మడి జిల్లాలో 3వ ర్యాంక్, పీఈటీ విభాగంలో జిల్లాలో 3వ ర్యాంకు, ఎస్జీటీ విభాగంలో జిల్లా 84వ ర్యాంకు, జోనల్ స్థాయిలో పీడీ విభాగంలో 9వ ర్యాంకు సాధించాడు. గ్రామస్థులు ఈయనను అభినందించారు.

News August 24, 2025

పాలకోడేరు పీహెచ్సీనలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

image

పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎం. గీతాబాయి ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీకి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీలో సాధారణ ప్రసవం అయిన మహిళను ఆసుపత్రిలో అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ గులాం రాజ్ కుమార్, స్వర్ణ నిరంజని ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.