WestGodavari

News April 14, 2026

కలెక్టరేట్‌లో ఉద్యోగాలంటూ SMలో వైరల్.. ఖండించిన కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో రాత పరీక్ష లేకుండా 40 పోస్టుల భర్తీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఖండించారు. ఈ వీడియోలు పూర్తిగా అవాస్తవమని, నిరుద్యోగులు వీటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే ఒకటికి రెండుసార్లు అధికారికంగా సరిచూసుకోవాలని ఆమె సూచించారు. నకిలీ వార్తలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

News April 14, 2026

కలెక్టరేట్‌లో ఉద్యోగాలంటూ SMలో వైరల్.. ఖండించిన కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో రాత పరీక్ష లేకుండా 40 పోస్టుల భర్తీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఖండించారు. ఈ వీడియోలు పూర్తిగా అవాస్తవమని, నిరుద్యోగులు వీటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే ఒకటికి రెండుసార్లు అధికారికంగా సరిచూసుకోవాలని ఆమె సూచించారు. నకిలీ వార్తలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

News April 14, 2026

పోషణ పక్వాడను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 23 వరకు నిర్వహించే 8వ ‘పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పోషకాహార లోప నివారణపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ సమతుల ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News April 14, 2026

పోషణ పక్వాడను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 23 వరకు నిర్వహించే 8వ ‘పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పోషకాహార లోప నివారణపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ సమతుల ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News April 14, 2026

పోషణ పక్వాడను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 23 వరకు నిర్వహించే 8వ ‘పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పోషకాహార లోప నివారణపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ సమతుల ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News April 14, 2026

పోషణ పక్వాడను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 23 వరకు నిర్వహించే 8వ ‘పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పోషకాహార లోప నివారణపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ సమతుల ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News April 13, 2026

పీజీఆర్ఎస్‌లో 20 ఫిర్యాదుల స్వీకరణ: ఎస్పీ

image

ప్రజల సమస్యలను చట్టపరిధిలో నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని ఎస్పీ అదాన్ నయీం అస్మి తెలిపారు. సోమవారం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన 20 అర్జీలను స్వీకరించారు. బాధితులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.

News April 13, 2026

ప.గో : ఈ మున్సిపాలిటీలకు ఈసారైనా ఎన్నికలు జరిగేనా ?

image

పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు మున్సిపాలిటీలకు సమీప గ్రామాల విలీనంపై కోర్టు కేసులు ఉండటంతో దాదాపు పదేళ్లుగా ఎన్నికలకు నోచుకోలేదు. ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతోంది. ముగియగానే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. 4 మున్సిపాలిటీలకు కోర్టు కేసులు పరిష్కారం తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News April 12, 2026

ప.గో: భర్త కళ్లెదుటే మహిళ తలపై నుంచి వెళ్లిన లారీ

image

ఉండి రైల్వే గేటు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయశ్రీ(56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాలు.. ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన నాగరాజు నరసింహారాజు, తన భార్య ఉదయశ్రీతో కలిసి పెద్దపుల్లేరులో జరుగుతున్న ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలకు బైకుపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయశ్రీ తల పైనుంచి లారీ వెళ్లడంతో ఆమె మృతి చెందింది.

News April 12, 2026

ప.గో: భర్త కళ్లెదుటే మహిళ తలపై నుంచి వెళ్లిన లారీ

image

ఉండి రైల్వే గేటు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయశ్రీ(56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాలు.. ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన నాగరాజు నరసింహారాజు, తన భార్య ఉదయశ్రీతో కలిసి పెద్దపుల్లేరులో జరుగుతున్న ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలకు బైకుపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయశ్రీ తల పైనుంచి లారీ వెళ్లడంతో ఆమె మృతి చెందింది.