India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్థానిక డీఎల్టీసీ సహాయ సంచాలకుడు ఎస్. ఉగాది రవి తెలిపారు. కౌశల్ వికాస్ యోజన కిందఫీల్డ్ టెక్నీషియన్, ఎయిర్ కండీషనర్ కోర్సులో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పదో తరగతి ఆపై విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువత అర్హులన్నారు. ఈ నెల 20 వరకూ గడువు ఉందన్నారు.
ప.గో జిల్లాలోని నరసాపురం MPDO వెంకటరమణారావు మిస్సింగ్పై ఉత్కంఠ నెలకొంది. ‘ఈరోజు నా పుట్టిన రోజు.నేను చనిపోయే రోజు ‘అని కుటుంబీకులకు మెసేజ్ పెట్టాడని వారు తెలిపారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన అదృశ్యానికి మాధవాయిపాలెం ఫెర్రీ రేవు పాట కారణమని అనుమానిస్తున్నారు. ఈ రేవు నిర్వహణ బాధ్యత నరసాపురం అధికారులది. వేలం కోసం పాటదారులు రాకపోవడంతో ఆయన రూ.54 లక్షలు అప్పుపడ్డట్టు సమాచారం.
ఏలూరు జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి 9, 10 తరగతులు చదివే దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు,వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ రాకడ మణి తెలిపారు. అర్హులైన దివ్యాంగ విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా http:///scholorships.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ప.గో జిల్లా ఆచంట మండలంలో చేతిపంపు నుంచి వింత శబ్దాలు రావడం కలకలం రేపింది. కోనపోతుగుంటలో పదేళ్ల కిందట బోరు వేశారు. 8 ఏళ్ల క్రితమే అది పూడిక చేసింది. తాజాగా నిన్న అదే బోరు నుంచి వింత శబ్దాలు, వాయువులతో బురద వచ్చింది. అగ్నిమాపక జిల్లా అధికారి బి.శ్రీనివాస్, సహాయ అధికారి వైవీ జానకీరాం, ఓఎన్జీసీ అధికారులు ఆ స్థలానికి వచ్చారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటామని ప్రజలు భయపడొద్దన్నారు.
కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే నేరుగా తనకు ఫోన్ చేసి చెప్పాలని పిల్లలకు నంబర్ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండిన 19 మంది చిన్నారులకు రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ పోస్టల్ పాస్ పుస్తకాలు అందజేశారు.
ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఏపీ లిమిటెడ్ ప్రతినిధులు, ఇతర అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ వలసలపై సమీక్షించారు. జిల్లాలో ఉపాధి మార్గాలు మెండుగా ఉన్నాయని, మహిళలు వాటిని సద్విని చేసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులకు దూరమై దూర ప్రాంతాలకు వెళ్లేవారు గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా మాత్రమే వెళ్లాలన్నారు. లేదంటే అక్కడ ఇబ్బందులు తప్పవన్నారు.
ప.గో జిల్లా నరసాపురం ఎంపీడీవోగా పనిచేస్తున్న ఎం.వెంకట రమణారావు కనిపించడం లేదంటూ ఆయన భార్య కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. జనవరి 24న వెంకట రమణారావు నరసాపురంలో విధుల్లో చేరారు. ఈ నెల 3న మెడికల్ లీవ్ మీద స్వస్థలానికి వెళ్లిన ఎంపీడీవో.. సోమవారం నుంచి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మిస్సింగ్పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వెలగపూడి సచివాలయంలో మంగళవారం మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్పై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష చేశారు. పలు అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో జల వనరుల శాఖ ముఖ్య సలహాదారులు వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ సీఈ నరసింహామూర్తి, ప్రాజెక్ట్ ఎల్.ఎం.సి ఎస్ఈ ఏసుబాబు పాల్గొన్నారు.
పాలకొల్లు పట్టణం లాకు సెంటర్లో ఏర్పాటుచేసిన మంత్రి నిమ్మల రామానాయుడు భారీ కటౌట్ అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. కటౌట్పైన ‘పాలకొల్లు మంత్రి గారి తాలూకా’ అని ప్రత్యేకంగా రాయించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజల మన్ననలు పొంది 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన నేపథ్యంలో అభిమానులు ఈ కటౌట్ ను ఏర్పాటుచేశారు.
గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ప.గో. జిల్లా సమన్వయ అధికారి భారతి తెలిపారు. పురుష అభ్యర్థులు గణితం-5, సోషల్-1, బోటనీ-1, ఇంగ్లిష్-1, హిందీ-1, హెల్త్ సూపర్వైజర్-1, పీఈటీ-2, మహిళా అభ్యర్థులు హిందీ-1,బోటనీ-1, జువాలజీ-1,ఇంగ్లీషు-2 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 18 లోగా సర్టిఫికెట్ల జిరాక్స్లను జిల్లా సమన్వయ అధికారి, AP సాంఘిక సంక్షేమ శాఖ ఏలూరుకు పంపాలి.
Sorry, no posts matched your criteria.