WestGodavari

News December 16, 2024

ఏలూరు: లారీకి ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

ఏలూరు మినీ బైపాస్ రోడ్డులో ఆగి ఉన్న లారీకి ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం నెలకొంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలను త్వరలో తెలుపుతామని పోలీసులు తెలిపారు.

News December 16, 2024

నేడు పోలవరంలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా ఉదయం 10.45 గం.లకు ప్రాజెక్ట్ వ్యూపాయింట్ వద్ద నున్న హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.05 గం.లకు ప్రాజెక్ట్ సైట్‌కు చేరుకుంటారు. 12.05 గం.లకు వరకు ప్రాజెక్ట్ ప్రాంతంలోని గ్యాప్-1, గ్యాప్-2 వైబ్రో కాంపాక్షన్ పనులను, డీవాల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 12.20 గం.లకు పనులపై అధికారులు, నిర్మాణదారులతో సమీక్షిస్తారు.

News December 16, 2024

నేడు పోలవరంలో పర్యటించనున్న సీఎం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా ఉదయం 10.45 గం.లకు ప్రాజెక్ట్ వ్యూపాయింట్ వద్ద నున్న హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.05 గం.లకు ప్రాజెక్ట్ సైట్‌కు చేరుకుంటారు. 12.05 గం.లకు వరకు ప్రాజెక్ట్ ప్రాంతంలోని గ్యాప్-1, గ్యాప్-2 వైబ్రో కాంపాక్షన్ పనులను, డీవాల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 12.20 గం.లకు పనులపై అధికారులు, నిర్మాణదారులతో సమీక్షిస్తారు.

News December 15, 2024

రేపు మీకోసం కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమం రేపు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన నేపథ్యంలో మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. కావున జిల్లా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News December 15, 2024

సంక్రాంతి సంబరం.. సరిగ్గా మరో నెల

image

సంక్రాంతి సంబరాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ప్రకృతి సోయగాలతో అలరించే ఇక్కడి పల్లెటూర్లు పండుగ శోభతో మరింత వన్నె సంతరించుకుంటాయి. రక్తి కట్టించే కోళ్ల పందేలతో తూ.గో, ప.గో జిల్లాల పేర్లు తెలుగు రాష్ట్రాల్లో మోత మోగుతాయి. కొత్త అల్లుళ్లకు చేసే వినూత్న మర్యాదలు మరో స్పెషల్ అట్రాక్షన్. రంగ వల్లులు, ఉత్సవాలు, ఉద్యోగాలకు పట్నం వెళ్లిన వారి రాకతో సరిగ్గా మరో నెలలో పల్లెలు కళకళలాడనున్నాయి.

News December 15, 2024

కూతూరుని వేధిస్తూ తండ్రిని హత్య చేసిన ఉన్మాది

image

ఏలూరులో దారుణ ఘటన జరిగింది. తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని గొడవ పడుతూ వెంకట రాజు (44) అనే వ్యక్తిని నాని అనే యువకుడు శనివారం కత్తితో పొడిచి హత్య చేశాడు. సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు కాగా పెద్ద కుమార్తెను నాని తరచూ వేధించేవాడన్నారు. దీంతో వెంకటరాజు పిల్లల్ని తీసుకుని ఉంగుటూరుకి వెళ్లి ఉంటున్నారు. పని మీద  ఏలూరు వచ్చిన వెంకటరాజుతో నాని గొడవపడి హత్య చేశాడు.

News December 15, 2024

డిసెంబర్ 17నుంచి జిల్లాలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

image

జిల్లాలో డిసెంబర్ 17 నుంచి నిర్వహించనున్న ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం తెలిపారు. డిసెంబర్ 17 నుంచి 20 వరకు మళ్లీ డిసెంబర్ 26 నుంచి 28 వరకు వారం రోజులపాటు ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులను అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 14, 2024

పాలకోడేరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి-ఎస్సై

image

సోంపల్లి శివాలయం సమీపంలో గురువారం రాత్రి రెండు మోటర్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో గాయపడిన పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరుకు చెందిన కొరత్తిక బాబి కాకినాడ జీ.జీ.హెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాబి సొంత పనుల నిమిత్తం పల్సర్ బైక్‌పై మండపేట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మృతుని తల్లి దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రాజోలు ఎస్ఐ రాజేష్ తెలిపారు.

News December 14, 2024

ఏలూరు DLTCలో 17న జాబ్ మేళా

image

ఏలూరు DLTC ఐటీఐ కాలేజీలో డిసెంబర్ 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DLTC సహాయ సంచాలకులు ఎస్.ఉగాది రవి తెలిపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. సుమారు 100 ఖాళీలకు ఈ జాబ్ ఫెయిర్ జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డీగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉన్న 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. నిరుద్యోగులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 14, 2024

బియ్యం, కందిపప్పు, వంటనూనె ప్రత్యేక కౌంటర్లు కొనసాగించాలి: జేసీ

image

జిల్లాలో బియ్యం, కందిపప్పు, వంటనూనె ప్రత్యేక కౌంటర్లను మరికొంత కాలం కొనసాగించాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని వ్యాపార సంఘాలు, కిరాణా వ్యాపారస్తులతో నిత్యవసర సరుకుల ధరలపై సమీక్ష నిర్వహించారు. తణుకు పట్టణంలో ప్రత్యేక కౌంటర్‌లో మినప్పప్పు కూడా హోల్‌సేల్ ధరలకు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.