India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కాళ్ల(M) పెదమిరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద విషాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ కన్నయ్య(46) గుండెపోటుతో కన్నుమూశారు. నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. గతంలో APSPలో పనిచేసిన కన్నయ్య, ఆ తర్వాత AR విభాగానికి బదిలీపై వచ్చారు. నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోవడంతో తోటి సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మొగల్తూరులో పెళ్లి పేరుతో మోసానికి పాల్పడిన యువకుడిపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఒడిశాకు చెందిన బాధితురాలు స్థానిక రొయ్యల పరిశ్రమలో పని చేస్తోంది. యనమదుర్రుకు చెందిన రాధాకృష్ణ ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించి, పలుమార్లు లోబరుచుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై నాగ లక్ష్మి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026వ సంవత్సర మార్కెట్ విలువలను పెంచుతూ ఉత్తర్వలు జారీచేసింది. ఫిబ్రవరి 1 నుంచి మార్కెట్ విలువలు పెరుగుతాయని జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. 0 నుంచి 25% వరకు మార్కెట్ విలువలు పెరిగాయని జిల్లాలోని 15 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అన్నారు.

ఏలూరు జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 595 మంది ఉద్యోగులకు సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. వీరిలో డీఆర్ఓ విశ్వేశ్వరరావు, ఏఎస్పీలు సుస్మిత, సూర్యచంద్రరావు సహా 14 మంది జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. వేడుకల్లో వీరిని ఘనంగా సత్కరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఏలూరు జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 595 మంది ఉద్యోగులకు సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. వీరిలో డీఆర్ఓ విశ్వేశ్వరరావు, ఏఎస్పీలు సుస్మిత, సూర్యచంద్రరావు సహా 14 మంది జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. వేడుకల్లో వీరిని ఘనంగా సత్కరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఏలూరు జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 595 మంది ఉద్యోగులకు సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. వీరిలో డీఆర్ఓ విశ్వేశ్వరరావు, ఏఎస్పీలు సుస్మిత, సూర్యచంద్రరావు సహా 14 మంది జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. వేడుకల్లో వీరిని ఘనంగా సత్కరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఏలూరు జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 595 మంది ఉద్యోగులకు సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. వీరిలో డీఆర్ఓ విశ్వేశ్వరరావు, ఏఎస్పీలు సుస్మిత, సూర్యచంద్రరావు సహా 14 మంది జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. వేడుకల్లో వీరిని ఘనంగా సత్కరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, ఈ నెల 29న పెనుమంట్ర ఎంపీడీఓ కార్యాలయంలో జరగాల్సిన ప్రత్యేక వినతుల స్వీకరణ కార్యక్రమం కూడా పరిపాలనా కారణాల దృష్ట్యా రద్దయిందని పేర్కొన్నారు. అర్జీదారులు ఈ మార్పును గమనించాలని కోరారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, ఈ నెల 29న పెనుమంట్ర ఎంపీడీఓ కార్యాలయంలో జరగాల్సిన ప్రత్యేక వినతుల స్వీకరణ కార్యక్రమం కూడా పరిపాలనా కారణాల దృష్ట్యా రద్దయిందని పేర్కొన్నారు. అర్జీదారులు ఈ మార్పును గమనించాలని కోరారు.

భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. వేడుకల కోసం ప్రత్యేక వేదికలు, గ్యాలరీ, స్టాల్స్తో పాటు ప్రభుత్వ పథకాలను వివరించే శకటాలను సిద్ధం చేశామన్నారు. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణతో కలెక్టరేట్ భవనం కనువిందు చేస్తోందని ఆమె పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.