India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉన్నత న్యాయ స్థానాల ఆదేశాల మేరకు డిసెంబర్ 14వ తేదీన నరసాపురం కోర్ట్ సముదాయాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి. విజయదుర్గ తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఆయా కోర్టులలో ఉన్న రాజీపడతగిన అన్ని క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, సివిల్ భూ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్ట పరిహార కేసులు మొదలగునవి రాజీ చేసుకోవచ్చన్నారు
దెందులూరుకు చెందిన ఆంథోనీ రాజ్ (51)కు జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జ్ సునంద శుక్రవారం తీర్పునిచ్చారని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 2022 అక్టోబరు 8 న గ్రామానికి చెందిన ఓ బాలికపై సదరు నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు నేరం రుజు కావడంతో జీవిత ఖైదు తో పాటు రూ.5000 జరిమానా విధిస్తూ జడ్జ్ తీర్పునిచ్చారన్నారు.
నూజివీడు IIIT కాలేజీలో డిసెంబర్ 20న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి ఆఫీసర్ జితేంద్ర శుక్రవారం చెప్పారు. సంబంధించిన గోడపత్రికను మంత్రి పార్థసారథి ఆవిష్కరించారని, సుమారు 1800 ఖాళీలకు మంత్రి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు.10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డీగ్రీ, పీజీ, బీటెక్ వంటి విద్యార్హతలతో 18 నుండి 30 ఏళ్లు లోపు వారు ఏపీలో ఎక్కడి వారైనా జాబ్ మేళాకు హాజరు కావొచ్చన్నారు.
ప.గో.జిల్లాలో మామిడి, కొబ్బరి పంటకు ఇన్సూరెన్స్ ఉంటుందని మీకు తెలుసా? మామిడి ఎకరాకు రూ.2250 చెల్లిస్తే రూ.45 వేలు.. ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.3.50 కడితే రూ.900 చొప్పున PM ఫసల్ బీమా యోజన కింద రైతులకు పరిహారం అందిస్తారు. డిసెంబర్15 నుంచి మే31 మధ్యలో వర్షాలు, ఉష్ణోగ్రతల మార్పులతో పంటకు నష్టం జరిగితే పరిహారం వస్తుంది. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బీ పత్రాలతో డిసెంబర్ 15లోగా మీసేవలో నమోదు చేసుకోవాలి.
వివాదాస్పద భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారనే అభియోగంపై నరసాపురం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఎంవీటీ ప్రసాద్ను సస్పెండ్ చేస్తూ గురువారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరులో ఉన్న ఓ భూమికి అడంగళ్ రికార్డులు లేకుండా కోర్టు వ్యవహారంలో ఉండగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదులు అందడంతో ప్రాథమిక దర్యాప్తు చేయగా.. ఈ మేరకు సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ప.గో జిల్లాలో శుక్రవారం నుంచి 2025 జనవరి 8 వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. షెడ్యూల్ ప్రకారం.. భీమవరం డివిజన్లో 119, నరసాపురం డివిజన్ 111, తాడేపల్లిగూడెం డివిజన్లో 90 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయన్నారు. వీటిలో డివిజన్ల వారీగా భీమవరం 6, నరసాపురం 12, తాడేపల్లిగూడెంలో 7 సదస్సులు ప్రారంభిస్తున్నామన్నారు.
ఏలూరు జిల్లాలో గత రెండు రోజుల్లో నిర్వహించిన 64 గ్రామ రెవిన్యూ సదస్సుల్లో 854 అర్జీలు రాగా వాటిలో అక్కడికక్కడే 96 అర్జీలు పరిష్కరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన సదస్సులకు 487 అర్జీలు రాగా 71అర్జీలు పరిష్కరించామన్నారు. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప.గో జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలినట్లు సమాచారం. భీమవరం మాజీ MLA గ్రంధి శ్రీనివాస్ ఆ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఓటమి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. అయితే ఆయన భవిష్యత్ కార్యాచరణ తెలియాల్సి ఉంది.
సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తానని మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఆయన పర్యటన ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జగన్ గోదావరి జిల్లా పర్యటన చేస్తారని వైసీపీ చింతలపూడి ఇన్ఛార్జ్ కంభం విజయరాజు తెలిపారు. సంక్రాంతి తర్వాత జగన్ గోదావరి జిల్లా ప్రజలను కలుస్తారని చెప్పారు.
జిల్లా సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గెజిట్ నెం.62 బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విడుదల చేశారు. జిల్లాలో 354 నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయని, వీటిలో 23 గోదావరి పడమర, కృష్ణా- తూర్పు నీటి కాలువ 54 సంఘాలు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎడమ 15, తమ్మిలేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ 6 నీటి సంఘాలు, శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువకు 5, మైనర్ ఇరిగేషన్ చెరువులకు 251 సంఘాలు ఉన్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.