WestGodavari

News July 1, 2024

ప.గో: యువకుడి మిస్సింగ్.. గోదావరిలో గాలింపు

image

ఫంక్షన్‌కని చెప్పి వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, పోలీసులు గాలింపు చేపట్టారు. ప.గో జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లికి చెందిన వై.త్రిమూర్తులు పంక్షన్‌కు వెళ్తున్నానన చెప్పి ఆదివారం ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడం.. బైక్ నరసాపురంలోని స్మశానవాటిక దగ్గరలో ఉండటంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జాలర్లతో పడవ సాయంతో గోదావరిలో వెతికించారు.

News July 1, 2024

ప.గో: కాపు కాసి యువకుడిపై దాడి.. రంగంలోకి DSP

image

తణుకు మండలం కొమరవరంలో ఇటీవల యువకుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచిన ఘటనపై తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి సోమవారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన మేడే రాంమూర్తి బైక్‌పై వెళుతుండగా.. అదే గ్రామానికి చెందిన ముత్యాల సుబ్బారావు, సాయిలు గత నెల 26న దారి కాచి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తణుకు రూరల్‌ ఎస్సై కె.చంద్రశేఖర్‌ నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

News July 1, 2024

ఏలూరు: ఆసుపత్రికి వెళ్లి మరీ పెన్షన్ అందజేత

image

ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన కొవ్వలి రాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొద్దిరోజులుగా ఏలూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది అడారి చందు, శివ శంకర్, కూటమి నేతలు తొలి రోజున ఎలాగైనా రాజుకు నగదు అందివ్వాలని నిర్ణయించుకున్నారు. సొంత ఖర్చులతో ఏలూరులోని ఆసుపత్రికి వెళ్లి మరీ పెంచిన పెన్షన్ అందించారు. ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

News July 1, 2024

కలెక్టర్ చదలవాడ నాగరాణికి కలిసిన RRR

image

పశ్చిమ గోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు సోమవారం మర్యాదపూర్వంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజవర్గ సమస్యలను కలెక్టర్ నాగరాణికి వివరించారు.

News July 1, 2024

ప.గో.: జడ్పీ కార్యాలయ పరిపాలనాధికారి మృతి

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పని చేస్తున్న చిర్రావూరి రత్న గిరి సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

News July 1, 2024

ఏలూరు: పింఛన్ నిరాకరించిన మహిళ

image

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో పింఛన్ల ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కాగా గ్రామానికి చెందిన సూర్యదేవర పద్మావతి అనే మహిళకు కూటమి నాయకులు రూ.7వేల పింఛన్ అందించారు. కాగా ఆమె తీసుకున్న పింఛన్‌కు రూ.3 వేలు కలిపి మొత్తం రూ.10వేలను తిరిగి కూటమి నాయకులకు ఇచ్చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు సాయంగా ఈ నగదు అందిస్తున్నట్లు ఆమె తెలిపింది.

News July 1, 2024

కాళ్లు కడిగి పింఛన్ అందించిన మంత్రి నిమ్మల

image

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ క్రమంలో వృద్ధుల కాళ్లు కడిగి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల పెరిగిన పింఛన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు.

News July 1, 2024

వైసీపీ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టుకు దెబ్బ: MP

image

వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ఆరోపించారు. 2014కు ముందు ప్రాజెక్టు పనులు కేవలం 5 శాతం మాత్రమే జరగ్గా.. 2014- 2019 మధ్య టీడీపీ హయాంలో 68 శాతం పనులు జరిగాయన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 3.8 శాతం పనులను మాత్రమే చేయగలిగిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును సందర్శించి.. పనులను గాడిలో పెడుతుందని చెప్పారు.

News July 1, 2024

ప.గో.: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని సూసైడ్

image

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. భీమవరం రూరల్ స్టేషన్ రైటర్ మహేశ్ తెలిపిన వివరాలు.. భీమవరం మండలం యమునేపల్లికి చెందిన బుంగా చందు(23) ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు ఇటీవల వేరే వ్యక్తితో పెళ్లి కుదరడంతో మనస్తాపంతో చందు శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పాతపాడు వద్ద ఉప్పుటేరులో ఆదివారం మృతదేహం లభ్యమైంది. సూసైడ్ చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు.

News June 30, 2024

ప.గో.: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కొవ్వూరు మండలం ఆరికరేవుల ఏటిగట్టుపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న తాత, మనవడు మృతిచెందారు. మృతులు మాసా వీర్రాజు (55), పాముల ధనుష్ (12)గా చెబుతున్నారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.