India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లాలో గురువారం జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,667ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో 2,443 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని స్పష్టం చేశారు. ఓట్లు వేసిన వారిలో స్త్రీలు 1,056, పురుషులు 1,387 మంది ఓటు వేశారన్నారు.
పెనుమంట్ర మండలం మార్టేరులో రెడ్డి కళ్యాణమండపం ఎదురుగా ఉన్న పుల్లల షాపులో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. దొంగలు 10 కేజీ, 5 కేజీల తూకం రాళ్లు, ఇస్త్రీ పెట్టి దొంగలించారు. పెనుమంట్ర మండలంలో గత కొంతకాలంగా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రధానంగా మార్టేరులో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లింద్రపర్రులో గురువారం ఆటో బైక్ ఢీకొన్న ప్రమాదంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన హరి(15) మృతి చెందాడు. మృతుడు కోత మెషీన్పై పని నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్నేహితులు పెనుమంట్ర పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం 108లో తణుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
ఏలూరు మాజీ MLA ఆళ్ల నాని టీడీపీలో చేరికపై బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన రాకను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. నిన్న MLA బడేటి చంటితో పాటు పలువురు నేతలు సీఎం చంద్రబాబుని కలిసి పార్టీలో చేర్చుకునే నిర్ణయంపై పునరాలోచించాలని విన్నవించినట్లు తెలిసింది. వైసీపీ హయాంలో ఆయన టీడీపీ నేతలను వేధింపులకు గురిచేశారని, అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారని సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. దీంతో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ జరగనుంది.
ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపక్, డాక్టర్ కావల నాగేశ్వరరావు, నామన వెంకటలక్ష్మి, బొర్రా గోపి మూర్తి బరిలో ఉన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఏలూరు జిల్లాలో బుధవారం ఉదయం భూకంపం వచ్చిందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కన్నాపురం, వేలూరుపాడు, చింతలపూడి, ద్వారకాతిరుమల తదితర చోట్ల ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిందన్నారు. ఇంట్లో ఉన్న సామాగ్రి ధ్వంసమవ్వడంతో.. బయటికి పరుగులు తీసినట్లు తెలిపారు. అయితే ఎక్కడా ప్రాణనష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఏలూరు సత్యనారాయణ పేట చెందిన షాజహాన్ (29) (సాఫ్ట్వేర్ ఉద్యోగి) పై కేసు నమోదైనట్లు సీఐ సత్యనారాయణ బుధవారం తెలిపారు. వారి కథనం పట్టణానికి చెందిన యువతికి (23) ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అయితే ఆమెను వద్దని, వారంలో వేరే యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు షాజహాన్ ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ప.గో జిల్లాలోని 248 రైతు సేవా కేంద్రాల ద్వారా 1 లక్ష 72 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. జేసీ మాట్లాడుతూ.. కొనుగోళ్లకు సంబంధించి రూ.390 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.383 కోట్లు రైతులకు జమ చేయడం జరిగిందన్నారు. ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని మండల స్థాయి అధికారులకు ఆదేశించారు.
టీ.నర్సాపురం మండలం రాజుపోతేపల్లికి చెందిన నత్త నాగరాజుపై డిసెంబర్ 2న గుమ్మల్ల స్వామి అనే వ్యక్తి కత్తితో తలపై తీవ్రంగా దాడి చేసినట్లు ఎస్ఐ జయబాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. భూ వివాదాల నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.