WestGodavari

News September 18, 2024

ప.గో.: మాజీ MLAకు వైసీపీలో కీలక పదవి

image

వైసీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ముదునూరి ప్రసాద్ రాజును నియమిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆయన గతంలో నరసాపురం ఎమ్మెల్యేగా, మాజీ చీఫ్ విప్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

News September 18, 2024

ప.గో. జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ

image

తాడేపల్లి పరిధిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ బుధవారం సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు. సమావేశంలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

News September 18, 2024

పాప చికిత్సకు సాయం అందిస్తాం: మంత్రి లోకేశ్

image

జంగారెడ్డిగూడెంలోని ఓ పాపకు డెంగీ, మలేరియా ఇన్ఫెక్షన్ కవాసకి అనే డిసీస్ వచ్చింది. చికిత్స నిమిత్తం సుమారు రూ.6లక్షలు ఖర్చు అవుతోందని వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత లేకపోవడంతో పలువురు సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి ధైర్యంగా ఉండమ్మా! పాప ఆరోగ్యం మెరుగుపడేందుకు వైద్య చికిత్సకు సాయం అందిస్తామని లోకేశ్ ట్వీట్ చేశారు.

News September 18, 2024

మంత్రి మండలి సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై మాట్లాడారు. అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన మంత్రులు, అధికారులు, ఈ మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్నారు.

News September 18, 2024

సీఎం చంద్రబాబుతో సమావేశం.. హాజరైన మంత్రి నిమ్మల

image

చెల్లించకుండా పెండింగ్ లో ఉన్న నీరు చెట్టు బిల్లుల విడుదలకు సంబంధించి మంగళవారం సీఎం చంద్ర‌బాబుతో మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్, నిమ్మ‌ల రామానాయుడు, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ కలిసి చర్చించారు. చర్చల అనంతరం ద‌శ‌ల వారీగా నీరు చెట్టు బిల్లులను విడుద‌ల చేయాల‌ని ఆర్థిక శాఖ‌ను ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు.

News September 18, 2024

ప.గో జిల్లాలో పొగాకు మళ్లీ ఆల్ టైం రికార్డ్ ధర

image

ఉమ్మడి జిల్లాలోని ఎన్‌ఎల్‌ఎస్‌ ఏరియా పరిధిలోని పొగాకు ధర రికార్డు బద్దలు కొట్టింది. మంగళవారం జంగారెడ్డిగూడెం-1, జంగారెడ్డిగూడెం-2, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో అత్యధికంగా రూ.408 నమోదయ్యింది. దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.400, గోపాలపురంలో రూ.399 ధర పలికింది. మొత్తం ఐదు వేలం కేంద్రాల్లో 6,669 బేళ్లు రైతులు అమ్మకానికి తీసుకురాగా, వీటిలో 4,444 బేళ్లు అమ్ముడైనట్లు రైతులు పేర్కొన్నారు.

News September 18, 2024

ఏలూరు: లాయర్ మృతి.. ఫ్యామిలీ పైనే కేసు

image

ఏలూరుకు చెందిన లాయర్ కార్తీక్ గత నెల మృతి చెందిన విషయం తెలిసిందే. ఏలూరు 2 టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. కార్తీక్ HYDలో వేరే కులానికి చెందిన మనీషాను 2017లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్య తరఫువాళ్లు కుల వివక్ష చూపేవారు. 2023లో భార్య పుట్టింటికి వెళ్లిపోయి, తన వారితో కేసులు పెట్టించడంతో మనోవేదనకు గురై మృతి చెందారు. మృతుని తండ్రి ఫిర్యాదుతో అతని భార్య, మరో ఐదుగురిపై కేసు నమోదైనట్లు తెలిపారు.

News September 18, 2024

మంత్రి లోకేష్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే గన్ని

image

ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లిలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి చర్చించారు. ఆయన వెంట పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి శ్రీనివాసులు, నాయకులు తోట సీతారామలక్ష్మి, వలవల బాబ్జి, మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2024

ప.గో.: చీపురు పట్టిన కేంద్ర మంత్రి, కలెక్టర్

image

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా భీమవరం అంబేడ్కర్ సర్కిల్‌ వద్ద కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు రామాంజనేయులు, రఘురామ కృష్ణరాజు, కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఉన్నారు. అంతా కలిసి చెత్త ఊడ్చి డస్ట్‌బిన్‌లో వేశారు.

News September 17, 2024

న్యాయం చేయమనాలంటే సిగ్గుగా ఉంది: RRR

image

వైసీపీ హయాంలో తనపై దాడి చేశారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇటీవలే కాదంబరీ జెత్వానీ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశారని, అలానే తనకు కూడా న్యాయం చేయాలని ప్రత్యేకంగా అడుక్కోవాలంటే సిగ్గుగా ఉందన్నారు.