India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ దంపతులతో శనివారం దర్శించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు హైకోర్టు జడ్జిను శాలువాతో సత్కరించి శ్రీ స్వామి వారి ఫోటో, తీర్థప్రసాదాలు అందజేశారు. పాలకొల్లు ప్రిన్సిపల్, సివిల్ జడ్జి షేక్ జియావుద్దీన్ పాల్గొన్నారు.
ఇటీవల విడుదలైన డీఎస్సీ 2025 మెరిట్ లిస్టులో కాళ్ల మండలం పెదఅమీరంకు చెందిన బూరాడ వెంకటకృష్ణ ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ – మ్యాథ్స్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 8వ ర్యాంక్, జోన్ 2 స్థాయి (3జిల్లాలు కలిపి) ఉద్యోగాలైన టీజీటీ మ్యాథ్స్లో 6వ ర్యాంక్, పీజీటీ మ్యాథ్స్లో 24వ ర్యాంక్, రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ పోస్ట్కు గాను 56వ ర్యాంక్ సాధించాడు.
మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 35 భాగాలుకు ప్రైవేటు టెండర్లు పిలిచారని వెంటనే ఉపసంహరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బలరాం డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం జిల్లా స్థాయి శిక్షణా తరగతులు 2వ రోజు భీమవరం సీపీఎం ఆఫీసులో జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు కాదని మేం కాపాడుతామని చెప్పిన పెద్దలు నేడు నోరు మెదపకపోవడం దారుణమన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25న ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకట లక్ష్మమ్మ తెలిపారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు, మూడు గెజిటెడ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో హాజరుకావాలి. ముందుగా ఒరిజినల్ సర్టిఫికెట్లను https:/apdsc.apcfss.in అప్లోడ్ చేయాలన్నారు
జిల్లాలో ఎరువులకు కొరత లేదని, సరిపడినంత స్టాకు సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖామంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు వివిధ జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఎరువుల పరిస్థితి, పంటల స్థితిగతులను వారికి కలెక్టర్ వివరించారు.
కాలువలు, చెరువు గట్లపై ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి “వాచ్ డాగ్” కమిటీ సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 361.86 ఎకరాల ఆక్రమణలపై పరిశీలించి, వాటిని తొలగించే దిశగా అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
జిల్లాలో తీరప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనపై అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తీరప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనకు సంబంధించిన మూడు అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. నర్సాపురంలోని వశిష్ఠ గోదావరి నది ఒడ్డున ఘన వ్యర్థాలను పారేయడంపై సమీక్షించారు.
మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి స్పేస్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన పర్యావరణ అనుకూల వినాయక చవితి అవగాహన కార్యక్రమంకు సంబంధించిన గోడపత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.
చిన్ననాటి వినాయక చవితి వేడుకలు మధుర జ్ఞాపకాలు.10 రోజుల ముందు నుంచే హడావిడి ఉండేది. వీధుల్లో పెద్ద పందిళ్లు మైకుల్లో పాటల హోరు.. ఆ సందడే వేరు. ఉదయం పూజలు, రాత్రికి స్నేహితులతో కలిసి తిరుగుతూ రకరకాల బొమ్మలు చూస్తూ, ప్రసాదాలను ఆస్వాదిస్తూ, ఆడిపాడిన ఆ రోజులు ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ అనుభూతులు ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో సజీవంగా ఉన్నాయి. ఆ పాత రోజులలోని జ్ఞాపకాలు మీకు గుర్తున్నాయా? COMMENT చేయండి.
చిన్ననాటి వినాయక చవితి వేడుకలు మధుర జ్ఞాపకాలు.10 రోజుల ముందు నుంచే హడావిడి ఉండేది. వీధుల్లో పెద్ద పందిళ్లు మైకుల్లో పాటల హోరు.. ఆ సందడే వేరు. ఉదయం పూజలు, రాత్రికి స్నేహితులతో కలిసి తిరుగుతూ రకరకాల బొమ్మలు చూస్తూ, ప్రసాదాలను ఆస్వాదిస్తూ, ఆడిపాడిన ఆ రోజులు ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ అనుభూతులు ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో సజీవంగా ఉన్నాయి. ఆ పాత రోజులలో జ్ఞాపకాలు మీకు గుర్తున్నాయా? COMMENT చేయండి.
Sorry, no posts matched your criteria.