WestGodavari

News April 19, 2025

ప.గో : మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

image

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310, ఎస్జీటీ కేడర్‌లో ఉన్న 260 పోస్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 19, 2025

ప.గో: జేసీ హెచ్చరికలు 

image

షాపులు నిర్వాహకులు రోడ్ల పక్కన చెత్త వేస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జేసీ భీమవరం పట్టణంలో పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డు పక్కన వ్యాపారస్తులు వద్దకు వెళ్లి చెత్త ఎక్కడ వేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లను వాడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

News April 18, 2025

భీమవరం: వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు

image

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు చేసుకోవచ్చునని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి గల వివిధ క్రీడల జిల్లా అసోసియేషన్లు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు వారి దరఖాస్తులను 85000 64372కు అందజేయాలన్నారు.

News April 18, 2025

మచిలీపట్నం: వాటర్ ట్యాంకర్ ఢీకొని వృద్ధుడి మృతి

image

మచిలీపట్నం డీమార్ట్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వడ్డే పెంటయ్య (78) మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా వాదాలగూడెంకి చెందిన పెంటయ్య మాచవరంలో ఉంటున్న పెద్ద కుమారుడి ఇంటికి వచ్చాడు. బైక్‌పై ఇంటికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన వాటర్ ట్యాంక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ పెంటయ్యను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 18, 2025

నరసాపురం: నేటి నుంచి తీరంలో అధికారులు సర్వే

image

చేపల వేటపై నిషేధం నేపథ్యంలో అర్హులైన మత్స్యకారులకు రూ.20 వేలు మత్స్యకార భృతి అందించేందుకు సర్వే చేపడుతున్నట్లు నరసాపురం మత్స్యశాఖ సహాయ డైరెక్టర్ ఎల్ఎన్ఎన్ రాజు తెలిపారు. ఈ నెల 18-23తేదీ వరకూ జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఒకేసారి సర్వే నిర్వహించనున్నారు. సిబ్బంది మత్స్యకారుల నుంచి బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు తదితర వివరాలను సేకరించనున్నారు.

News April 18, 2025

ప.గో: తప్పులు లేకుండా పూర్తి చేయాలి..కలెక్టర్ 

image

ఓటరు నమోదు, చేర్పులు, మార్పులు, క్లెయిమ్స్ పరిష్కార ప్రక్రియను తప్పులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం భీమవరంలో కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై క్లెయిమ్స్ పరిష్కారం పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం ఓటర్లు14లక్షల 70వేల 886మంది ఉండగా వీరిలో పురుషులు 7లక్షల 20వేల 613మంది, మహిళలు 7లక్షల 50వేల 197మంది, ట్రాన్స్ జెండర్స్ 77మంది ఉన్నారన్నారు.

News April 17, 2025

పాలకొల్లు: చాంబర్స్ కళాశాలలో 17న మెగా జాబ్ మేళా

image

ఈనెల 17 గురువారం ఉ.9 గంటల నుంచి పాలకొల్లు చాంబర్స్ కళాశాలలో ఏపీ ప్రభుత్వ శిక్షణ, ఉద్యోగ కల్పనా సంస్థ సౌజన్యంతో 13 కంపెనీలతో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. ఐసీఐసీఐ, హెచ్‌డి‌ఎఫ్‌సి ,హెచ్డిబి, డెక్కన్ కెమికల్స్, పానాసోనిక్, ఇండో ఎంఐఎం, ఇసుజు, కాగ్నిజెంట్ వంటి బ్యాంకింగ్, ఐటి, నాన్ ఐటీ సంస్థలకు చెందిన వారు 470 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.

News April 17, 2025

రోడ్డు ప్రమాదంలో పెనుగొండ యువకుడు మృతి

image

వడలి పిట్టల వేమవరం రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగొండకు చెందిన తడివాడ భార్గవ్(17) మృతి చెందాడు. స్నేహితుడితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా వెనుక వస్తున్న వ్యాను టచ్ చేయడంతో మోటార్ సైకిల్ పక్కనే ఉన్న చెట్టుని బలంగా ఢీకొంది. దీంతో భార్గవ్ తలకు బలమైన గాయం కావడంతో ఘటన ప్రాంతంలో మ‌ృతి చెందాడు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు.

News April 17, 2025

ప.గో: వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

తణుకు పట్టణంలోని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ కళాశాల బాలురు, బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రూ. 18.5 లక్షలు, రూ. 8.31 లక్షలు, రూ.2.41 లక్షల వ్యయంతో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మూడు వసతి గృహాలకు చేపట్టిన నిర్మాణ పనులను  కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.

News April 16, 2025

ప.గో: భీమవరం సబ్ డివిజన్‌కు ఏబీసీడీ అవార్డు  

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం రేపిన ఉండి మండలం యండగండిలో శవం పార్సెల్ కేసు విషయం తెలిసిందే. ఈకేసును చేధించిన భీమవరం సబ్ డివిజన్ పోలీసులకు ఏబీసీడీ ప్రథమ అవార్డు లభించింది. బుధవారం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మిలు అవార్డును అందజేశారు. సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందికి డీజీపీ అభినందనలు తెలిపారు.